అన్వేషించండి

మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్

బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.
బహిరంగ దాడులు కలకలం...
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి వ్యవహరం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. తనపై జరిగిన దాడి ఘటనపై సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో భారతీయ జనతా పార్టికి చెందిన నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు  మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించిన కాషాయ దళం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి తాను మాట్లాడానని, అయితే అధికారంలో ఉన్న పార్టి నేతలయినా అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడరని సత్యకుమార్ ప్రశ్నించారు. 

మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో‌ వైషమ్యాలు సృష్టించారని, సీఎం జగన్ తన విధ్వంసక రచనను‌ బీజేపీ ప్రశ్నించిందని అన్నారు. సభ నుండి తిరిగి వస్తుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారని, వారు తమ వాహనాలను ఆపారని సత్యకుమార్ అన్నారు. వెంటనే  మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టి నేతల పైకి దూసుకువచ్చి దాడికి పాల్పడ్డారని, అసభ్యంగా బూతులు తిడుతూ... కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. డీఎస్పీని ఇదేంటని అడిగినా స్పందించ లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.
పోలీసులు కూడా తమ పార్టికి చెందిన నేతలనే వెనక్కి నెట్టారని, తామంతా అటుగా వస్తున్నామనే  తెలిసి పథకం రచించారని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి‌వచ్చిన ఆదేశాలనే అమలు చేశారని, తమపై జరిగిన దాడికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మద్దతు ఉందని ఆరోపించారు.
ఇల్లు ఇక్కడే కట్టుకున్నానన్న జగన్... ఇప్పుడు ఏం చేశారు..
ఇక్కడే ఇల్లు కట్టా, అమరావతి అభివృద్ధి చేస్తా అని జగన్ చెప్పలేదా అని బీజేపీకి చెందిన నేతలు ప్రశ్నించారు. అమరావతికి మద్దతు ఇస్తే దాడి చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తెర లేపడం వారికి అలవాటేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నేత  సత్యకుమార్ మండిపడ్డారు. అమరావతికి అండగా ఉద్యమంలో బీజేపీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ నందిగం ‌సురేష్ రాజధాని ప్రాంతంలో తిరగాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులను ‌ఖండించాల్సిన ఎంపీ, రౌడీలకు, దాడులు చేసిన వారికి మద్దతు ఇస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కనుసన్నల్లోనే ఈ‌దాడి జరిగిందని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేష్ కాల్ డేటా మొత్తం తీస్తే.. దీని వెనుక ఉన్న వాళ్ల వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ఆయన పాత్ర మీద సందేహించాల్సి ఉంటుందని సత్యకుమార్ అన్నారు.
ఖండించిన సోము వీర్రాజు...
బీజేపీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలిని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఉద్దేశ పూర్వకంగానే  వైసీపీ దాడి కి పాల్పడిందని సోమువీర్రాజు ఆరోపించారు. బీజేపీ నేతలు పై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే బిజెవైఎం నేత పనతల సురేష్ పైకి దాడి చేశారని అన్నారు. దాడులకు బీజేపీ భయపడదని సోమువీర్రాజు అన్నారు.
దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గోని తిరిగి వస్తున్న భారతీయ జనతా పార్టికి చెందిన నేతల పై జరిగిన దాడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖండిచారు. ప్రశ్నిస్తే దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget