అన్వేషించండి

మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్

బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు.
బహిరంగ దాడులు కలకలం...
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి వ్యవహరం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. తనపై జరిగిన దాడి ఘటనపై సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో భారతీయ జనతా పార్టికి చెందిన నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు  మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించిన కాషాయ దళం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి తాను మాట్లాడానని, అయితే అధికారంలో ఉన్న పార్టి నేతలయినా అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడరని సత్యకుమార్ ప్రశ్నించారు. 

మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో‌ వైషమ్యాలు సృష్టించారని, సీఎం జగన్ తన విధ్వంసక రచనను‌ బీజేపీ ప్రశ్నించిందని అన్నారు. సభ నుండి తిరిగి వస్తుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారని, వారు తమ వాహనాలను ఆపారని సత్యకుమార్ అన్నారు. వెంటనే  మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టి నేతల పైకి దూసుకువచ్చి దాడికి పాల్పడ్డారని, అసభ్యంగా బూతులు తిడుతూ... కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. డీఎస్పీని ఇదేంటని అడిగినా స్పందించ లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.
పోలీసులు కూడా తమ పార్టికి చెందిన నేతలనే వెనక్కి నెట్టారని, తామంతా అటుగా వస్తున్నామనే  తెలిసి పథకం రచించారని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి‌వచ్చిన ఆదేశాలనే అమలు చేశారని, తమపై జరిగిన దాడికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మద్దతు ఉందని ఆరోపించారు.
ఇల్లు ఇక్కడే కట్టుకున్నానన్న జగన్... ఇప్పుడు ఏం చేశారు..
ఇక్కడే ఇల్లు కట్టా, అమరావతి అభివృద్ధి చేస్తా అని జగన్ చెప్పలేదా అని బీజేపీకి చెందిన నేతలు ప్రశ్నించారు. అమరావతికి మద్దతు ఇస్తే దాడి చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తెర లేపడం వారికి అలవాటేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నేత  సత్యకుమార్ మండిపడ్డారు. అమరావతికి అండగా ఉద్యమంలో బీజేపీ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ నందిగం ‌సురేష్ రాజధాని ప్రాంతంలో తిరగాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులను ‌ఖండించాల్సిన ఎంపీ, రౌడీలకు, దాడులు చేసిన వారికి మద్దతు ఇస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కనుసన్నల్లోనే ఈ‌దాడి జరిగిందని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేష్ కాల్ డేటా మొత్తం తీస్తే.. దీని వెనుక ఉన్న వాళ్ల వివరాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి స్పందించకుంటే ఆయన పాత్ర మీద సందేహించాల్సి ఉంటుందని సత్యకుమార్ అన్నారు.
ఖండించిన సోము వీర్రాజు...
బీజేపీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలిని రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఉద్దేశ పూర్వకంగానే  వైసీపీ దాడి కి పాల్పడిందని సోమువీర్రాజు ఆరోపించారు. బీజేపీ నేతలు పై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే బిజెవైఎం నేత పనతల సురేష్ పైకి దాడి చేశారని అన్నారు. దాడులకు బీజేపీ భయపడదని సోమువీర్రాజు అన్నారు.
దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గోని తిరిగి వస్తున్న భారతీయ జనతా పార్టికి చెందిన నేతల పై జరిగిన దాడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖండిచారు. ప్రశ్నిస్తే దాడులు చేయటం ఏంటని ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Embed widget