అన్వేషించండి

Bapatla News: మంత్రి కార్యక్రమానికి వెళ్లిన మహిళలకు చేదు అనుభవం, దారుణం అంటూ ఆగ్రహం

ఎవరు డుమ్మా కొట్టిన పర్యవసానం తీవ్రంగా‌ ఉంటుందని స్థానిక మహిళకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గం పరిదిలోని డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరికి చేదు అనుభవం ఎదురైంది.

ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాల పంపిణీకి వెళ్లడం.. ఆపై అసలైన వ్యక్తి రాలేదంటూ సామాన్యుల్ని బలవంతంగా అక్కడే ఉంచడం తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. బాపట్ల జిల్లాలో ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన మహిళలకు చుక్కలు కనిపించాయి. కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్దామని ప్రయత్నిస్తే గేట్లకు తాళాలు సైతం వేయడంతో కొందరు అలాగే ఉండిపోగా, మరికొందరు గేట్లు, గోడలు దూకి కార్యక్రమం నుంచి బయటపడ్డారు. కార్యక్రమానికి వచ్చిన వారికి ఆహారం పెట్టలేదు, కనీసం బాత్రూమ్ కు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని దారుణం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే.. 
బాపట్ల జిల్లా భట్టిప్రోలులో‌ అసరా పథకం చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గం పరిధిలో డ్వాక్ర మహిళలు రావాలని హుకూం జరీ చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గెస్ట్ గా స్థానిక శాసన సభ్యుడు మంత్రి మేరుగు నాగార్డున అటెండ్ అవుతారని తెలిపారు. ఎవరు డుమ్మా కొట్టిన పర్యవసానం తీవ్రంగా‌ ఉంటుందని స్థానిక మహిళకు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గం పరిదిలోని డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రాంగణం భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ కు డ్వాక్రా మహిళలను మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు.

ఆసరా చెక్కుల పంపిణీకి హాజరైన మహిళలకు భయానక అనుభవం ఎదురైంది. డ్వాక్రా మహిళలకు, కార్యక్రమానికి వెళ్లిన మహిళకు తాగు నీరు కూడా సరిగా అందించదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలం అని కూడా చూడకుండా, తమకు కనీస ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. సభ నుంచి వెళ్లిపోదామని ప్రయత్నించిన వారిని గ్రహించి గేట్లకు తాళాలు వేసి లోపలికి పంపించివేశారు. కనీసం బాత్రూమ్ కు వెళ్లేందుకు అయినా అనుమతించాలని కోరినా కార్యక్రమ నిర్వాహకులు అంగీకరించలేదట. డ్వాక్రా మహిళలు మంత్రి మేరుగు నాగార్జున రాక ముందే బయటకు వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో గేట్లు కూడా మూసి వేసి యామినేటర్లను కాపలా పెట్టారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. తాగడానికి నీళ్లు ఇవ్వలేదు, బాత్రూమ్ కు పంపడం లేదు, బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా గేట్లకు తాళాలు వేశారు. బయటకు వెళ్లే ప్రయత్నం చేసిన మహిళల్ని బెదిరించారని సైతం తెలిపారు. ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇక ఉండలేక, ఈ ఇబ్బందులు తట్టుకోలేక కొంత మంది మహిళలు గేట్లు దూకి వెళ్లిపోయారు. ఒంటి గంటలకు కార్యక్రమం అని చెప్పి మహిళలను రప్పించగా.. చివరకు మంత్రి మేరుగు నాగార్జున తీరికగా 5 గంటలకు వచ్చారు అని కొందరు మహిళలు వెల్లడించారు. ఇలాగేనా కార్యక్రమం నిర్వహించేది, అందులోనూ మహిళలపై బెదిరింపులకు పాల్పడటం దారుణం అన్నారు.

ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి, చాలా పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు వస్తారు. జగన్ మోహన్ రెడ్డి కూడా వస్తారు. కానీ ప్రజల కోసం పాటుపడిన నేత జగన్ అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్న వ్యక్తి నేత జగన్, బిడ్డలను స్కూళ్లకు పంపితే తల్లుల ఖాతాల్లో నగదు వేశామన్నారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు.  రైతన్నల కష్టాన్ని చూడలేక నేరుగా ప్రభుత్వం ధాన్యం కొంటుందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ తీసుకొస్తే ఆ తరువాత వచ్చిన సీఎంలు ఎన్నో వ్యాధులకు ట్రీట్మెంట్ తీసేయగా.. జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కొత్త వ్యాధులకు చికిత్స ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget