అన్వేషించండి

APSRTC Employees: ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ ఉద్యోగులకు అందని కొత్త జీతాలు, మరో ఉద్యమానికి రెడీ !

APSRTC Employees: ఉత్తర్వులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

APSRTC Employees: ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆనాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేగానే ఉద్యోగులు చాలా సంతోషించారు. కానీ నేడు విలీన ఫలాలు దక్కక, సరైన సమయానికి జీతాలు పెరగక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మీ సమస్యలన్నీ తీరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం నాన్చుడు ధోరణి అలంభిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి తుది గడువు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల సాధనలో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. నాటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే ఆర్టీసీ ఉద్యోగులకూ జీతాలు చెల్లించాల్సి ఉంది. 

వేతనాలు పెరిగినా ఆర్టీసీ వాళ్లకు అమలు కావట్లేదు.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరిగాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎందుకోగానీ అమలు చేయడం లేదు. సిబ్బంది ఆందోళనతో జూన్ 6వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చ్చింది. జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికీ పాత జీతాలే ఇస్తున్నారు. ఉత్తర్వులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సాంకేతిక సమస్యల పేరిట.. 
ఆర్టీసీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఎన్నో ఏళ్లుగా ఒరాకిల్ సాఫ్ట్ వేర్ ను వాడుతున్నారు. ప్రభుత్వంలో మాత్రం సీఎఫ్ఎంఎస్ ద్వారా  అందిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగులను సీఎంఎఫ్ఎస్ లో చేర్చలేదు. సాఫ్ట్ వేర్ లను లింక్ చేయాలంటూ జూన్ 6వ తేదీన, 26వ తేదీన రెండు సార్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు. అయినప్పటికీ దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో జూన్ 29వ తేదీన సీఎంఎఫ్ఎశ్ సీఈఓకు లేఖ రాశారు. అయినా ఫలితం దక్కకపోవడంతో జులై 1వ తేదీన ఉద్యోగులు పాత వేతనాలే తీసుకున్నారు. 

పదే పదే అడిగినా ఫలితం లేకుండా పోతోంది.. 
ఈ తర్వాత తీరిగ్గా రెండు సాఫ్ట్ వేర్ లను లింక్ చేయడం కుదరదని, ఆర్టీసీ ఉద్యోగులు సీఎంఎఫ్ఎస్ లోకే రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికోసం డీడీఓలు ఏర్పాటు చేయాలని తేల్చింది. ఈ మార్పు కోసం అన్నీ సిద్ధం చేసినా ఆర్థిక శాఖ పదే పదే కొర్రీలు వేయడం వల్ల ఆగస్టు 1వ తేదీన కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు రాలేదు. మొత్తం 48 మందికి స్టేట్ కేడర్ పదోన్నతులు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పీఆర్సీ ఆర్థిక శాఖ మరోసారి ఆపేయడంతో సెప్టెంబర్ 1వ తేదీన పాత జీతాలే అందుకోక తప్పలేదు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Reliance AI Data Centre At Bhogapuram: ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
ఏపీలో రిలయన్స్‌ ఏఐ డేటా సెంటర్‌!భోగాపురంలో 855 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం!
AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Mahabubnagar Crime News: తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం
తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Embed widget