అన్వేషించండి

APSRTC Employees: ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ ఉద్యోగులకు అందని కొత్త జీతాలు, మరో ఉద్యమానికి రెడీ !

APSRTC Employees: ఉత్తర్వులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

APSRTC Employees: ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆనాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పేగానే ఉద్యోగులు చాలా సంతోషించారు. కానీ నేడు విలీన ఫలాలు దక్కక, సరైన సమయానికి జీతాలు పెరగక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. మీ సమస్యలన్నీ తీరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం నాన్చుడు ధోరణి అలంభిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి తుది గడువు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల సాధనలో భాగంగా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. నాటి నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న విధంగానే ఆర్టీసీ ఉద్యోగులకూ జీతాలు చెల్లించాల్సి ఉంది. 

వేతనాలు పెరిగినా ఆర్టీసీ వాళ్లకు అమలు కావట్లేదు.. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరిగాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎందుకోగానీ అమలు చేయడం లేదు. సిబ్బంది ఆందోళనతో జూన్ 6వ తేదీన ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చ్చింది. జూలై నుంచి పెంచిన వేతనాలు అందుతాయని ఆశపడ్డారు. మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికీ పాత జీతాలే ఇస్తున్నారు. ఉత్తర్వులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సాంకేతిక సమస్యల పేరిట అధికారులు తాత్సారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సాంకేతిక సమస్యల పేరిట.. 
ఆర్టీసీలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఎన్నో ఏళ్లుగా ఒరాకిల్ సాఫ్ట్ వేర్ ను వాడుతున్నారు. ప్రభుత్వంలో మాత్రం సీఎఫ్ఎంఎస్ ద్వారా  అందిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉద్యోగులను సీఎంఎఫ్ఎస్ లో చేర్చలేదు. సాఫ్ట్ వేర్ లను లింక్ చేయాలంటూ జూన్ 6వ తేదీన, 26వ తేదీన రెండు సార్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు. అయినప్పటికీ దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో జూన్ 29వ తేదీన సీఎంఎఫ్ఎశ్ సీఈఓకు లేఖ రాశారు. అయినా ఫలితం దక్కకపోవడంతో జులై 1వ తేదీన ఉద్యోగులు పాత వేతనాలే తీసుకున్నారు. 

పదే పదే అడిగినా ఫలితం లేకుండా పోతోంది.. 
ఈ తర్వాత తీరిగ్గా రెండు సాఫ్ట్ వేర్ లను లింక్ చేయడం కుదరదని, ఆర్టీసీ ఉద్యోగులు సీఎంఎఫ్ఎస్ లోకే రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనికోసం డీడీఓలు ఏర్పాటు చేయాలని తేల్చింది. ఈ మార్పు కోసం అన్నీ సిద్ధం చేసినా ఆర్థిక శాఖ పదే పదే కొర్రీలు వేయడం వల్ల ఆగస్టు 1వ తేదీన కూడా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు రాలేదు. మొత్తం 48 మందికి స్టేట్ కేడర్ పదోన్నతులు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పీఆర్సీ ఆర్థిక శాఖ మరోసారి ఆపేయడంతో సెప్టెంబర్ 1వ తేదీన పాత జీతాలే అందుకోక తప్పలేదు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget