అన్వేషించండి

AP Employees DA: ఏపీ ఉద్యోగుల డీఏ బకాయిలి ఎలా, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి: బొప్పరాజు డిమాండ్

Bopparaju Venkateswarlu: ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, అందుకే ప్రభుత్వం కూడా ముందుకు వస్తోందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju Venkateswarlu: డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని అందుకే ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న 27వ మహాసభ కార్యక్రమ పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొప్పరాజు వెంకటేశ్వర్లు.. పీఆర్సీ బకాయిలను, నాలుగు డీఏ బకాయిలను ఎలా చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల మిగతా డిమాండ్లపైనా చర్చ జరగాలని, వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం కొనసాగుతోందని, నాలుగో దశ ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. 27వ తేదీన ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించబోతున్నట్లు గుర్తు చేశారు. ఆ సదస్సుకు ఉద్యోగులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమం చేస్తుంటేనే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని బొప్పరాజు సూచించారు.

ఏపీలో మూడేళ్ల క్రితం కొన్ని డిమాండ్లపై తాము చేసుకున్న ఒప్పందంలో చేర్చిన అంశాలను సర్కారు ఇప్పటికీ పరిష్కరించలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సారీ చాయ్, బిస్కెట్ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమ బాట పట్టిన తర్వాతే కారుణ్య నియామకాలు వచ్చాయని, ఉద్యమ ఫలితంగానే పోలీసులకు 525 కోట్ల రూపాయలు సరెండర్ లీవులు ఇచ్చారని గుర్తు చేశారు. తాము ఒప్పందం చేసుకున్న మిగిలిన అంశాలపై ఏపీ సర్కారు నిర్ణయం తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. మిగిలిన డిమాండ్లపై తాము ఏపీ చీఫ్ సెక్రటరీని కలిశామని, ప్రధాన ఆర్థిక డిమాండ్లపై చర్చించాలని కోరామని చెప్పారు. నాలుగు డీఏలు ఇవ్వాలని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ రికమండెడ్ పే స్కేళ్లు బయటపెట్టి.. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కూడా బొప్పరాజు డిమాండ్ చేశామని తెలిపారు. 

ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభలు ఈనెల 24న విజయావడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 9 వేల మంది మహాసభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు రవాణా శాఖా మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ హాజరు అవుతారని, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు కూడా ఈ మహాసభలో జరుగుతాయని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి వలిశెట్టి దామోదర్ తెలిపారు. మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో ఈ నెల 27వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget