![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్
AP Flood Affected Areas: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
![CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్ AP News CM Jagan conducts video conference over flood affected victims in andhra pradesh new CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/7741bcc59f719a64c92138ce55ac97451701861248311234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Review on Flood Areas: వరద బాధితుల స్థానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో అలాంటి సాయాన్నే బాధితులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను వల్ల కలిగిన నష్టం, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి. రూ.10లు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి. పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కాని, క్యాంపులనుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలోకాని వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి. రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు.
పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి. అన్నిరకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వారు అధైర్యపడాల్సిన పనిలేదు. ప్రతి రైతునూ ఆదుకుంటుంది. పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ఉంటుంది.
యుద్ధప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి. దీన్నికూడా ప్రాధాన్యంగా తీసుకోండి. వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టండి. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వాలంటీర్ల దగ్గరనుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అని సీఎం జగన్ సూచనలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)