అన్వేషించండి

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు అమరావతి జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఉద్యోగుల ఉద్యమ చరిత్రలో తాము సాధించింది చారిత్రాత్మక విజయమని అమరావతి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అందుకే ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ముందుకు వచ్ఛిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సీఎస్ కు ఫిబ్రవరి 9 న ఇచ్చిన 48 డిమాండ్లతో మెమోరండం ఇస్తే అందులో 37 డిమాండ్లు ఈ 92 రోజుల ఉద్యమం ద్వారా సాధించుకున్నామని వారు పేర్కొన్నారు.

ఇంకా మిగిలి ఉన్న 11 డిమాండ్లను కూడా సాధించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. 92 రోజుల ఉద్యమకాలంలో అనేక శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగులు, మునిసిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో అనేక బాధలు గమనించామని, వాటిని విని, భవిష్యత్ లో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రధానంగా కొన్ని శాఖల్లో, వివిధ స్కీంల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం పొందక, సకాలంలో జీతాలు రాక, కనీస రాయితీలు లేక పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

ఉద్యోగులంతా కలసి రావాలి
ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యాలను ఈ సందర్బంగా  ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు వెల్లడించారు. శాఖాపరమైన సంఘాల సమస్యలు పరిష్కరించుకనేందుకు కలిసి రావాలని, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడింది, ప్రత్యేకంగా వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమేనని అన్నారు.

గ్రామ వార్డ్ సచివాలయంలోని ప్రతి ఉద్యోగి సమస్యలను బయటకు తీసుకువచ్చి, వారి కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు గతంలో కలిసి పనిచేసిన ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను దఫదఫాలు ఆహ్వానించినప్పటికీ ఎవరూ కలిసిరాలేదని అన్నారు. ఆ కారణంగా ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలుగా ఉన్న 96 డిపార్ట్మెంట్‌ సంఘాల మద్దతుతో ఉద్యోగుల పక్షాన పోరాడాలని ఫిబ్రవరి 5 న కర్నూలులో జరిగిన సమావేశంలో  నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 న 50 పేజీల మెమోరాండంలో 48 డిమాండ్లతో కూడిన ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కి ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ డిమాండ్లు సాధన కోసం మార్చ్ 9 నుండి  92 రోజుల పాటు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశల ఉద్యమ కార్యాచరణతో 48 డిమాండ్లులలో 37 సాధించుకున్నామని, ఇది ఉద్యోగుల విజయంగా అభివర్ణించారు. 92 రోజుల ఏపీజేఏసీ అమరావతి ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయాలను గురించి ఈ సందర్బంగా వెల్లడించారు.

1. అందరి ఉద్యోగులకు GPF/ Apgli/ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోలీస్ శాఖ  వారికి T.A బిల్లులకి సంబంధించి రు.3600 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయటం 
2. RTC లో  పదోన్నతులు పొందిన 2096 మందికి PRC వర్తింపజేయటం
3. RTC ఉద్యోగులకు OTS సాధించటం
4. జీతం/ పెన్షన్ రూపేణా నెలకు రు.10,000/-సంపాదనపరులకు రైస్ కార్డు,ఇతర సౌకర్యాలు కల్పించడం (FCS01-FCCSOCSS ( MISC ) 29/2021-CS-I)
5. టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చెయ్యడానికి అంగీకరించారు.
6. కారుణ్య నియమకాలు చేపట్టడం (1158 మంది RTC నందు మరియు ఇతర శాఖలలో)
7. 1/2022 సంబంధించిన DA విడుదల చెయుట. ( GO MS No 66 Fin(PC-TA) Dept,Dt:11.05.2023)
8. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ( అన్ని HODల నుండి డేటా అభ్యర్థించబడినది)
9. GSWS ఉద్యోగులకు టార్గెట్స్ రద్దుచేయటం. ( Circular No ROC No.185/F/GSWS/2023,Dt: 03-05-2023)
10. 10% CPS ఉద్యోగుల వాటా ఐన 2443 కోట్లు PRAN అకౌంటులో జమచేయడం.
11. కొత్తగా ఏర్పిడిన జిల్లా కేంద్ర కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 %  HRA వర్తింపచేయటం. (GO MS No 69 Fin(PC-TA) Dept,Dt:09.05.2023)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget