అన్వేషించండి

Amaravati JAC: ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నాం, ఇది చారిత్రక విజయం - అమరావతి జేఏసీ

ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు అమరావతి జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఉద్యోగుల ఉద్యమ చరిత్రలో తాము సాధించింది చారిత్రాత్మక విజయమని అమరావతి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అందుకే ఈ 92 రోజుల ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ముందుకు వచ్ఛిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సీఎస్ కు ఫిబ్రవరి 9 న ఇచ్చిన 48 డిమాండ్లతో మెమోరండం ఇస్తే అందులో 37 డిమాండ్లు ఈ 92 రోజుల ఉద్యమం ద్వారా సాధించుకున్నామని వారు పేర్కొన్నారు.

ఇంకా మిగిలి ఉన్న 11 డిమాండ్లను కూడా సాధించుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని అన్నారు. 92 రోజుల ఉద్యమకాలంలో అనేక శాఖల్లో పనిచేసే చిరు ఉద్యోగులు, మునిసిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులలో అనేక బాధలు గమనించామని, వాటిని విని, భవిష్యత్ లో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రధానంగా కొన్ని శాఖల్లో, వివిధ స్కీంల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం పొందక, సకాలంలో జీతాలు రాక, కనీస రాయితీలు లేక పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

ఉద్యోగులంతా కలసి రావాలి
ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యాలను ఈ సందర్బంగా  ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్  పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు వెల్లడించారు. శాఖాపరమైన సంఘాల సమస్యలు పరిష్కరించుకనేందుకు కలిసి రావాలని, మన సమస్యలు మనం పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయాలని ప్రతి సందర్భంలో గొంతెత్తి మాట్లాడింది, ప్రత్యేకంగా వారి కోసం ఒక రోజు ధర్నా నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి మాత్రమేనని అన్నారు.

గ్రామ వార్డ్ సచివాలయంలోని ప్రతి ఉద్యోగి సమస్యలను బయటకు తీసుకువచ్చి, వారి కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు గతంలో కలిసి పనిచేసిన ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను దఫదఫాలు ఆహ్వానించినప్పటికీ ఎవరూ కలిసిరాలేదని అన్నారు. ఆ కారణంగా ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాలుగా ఉన్న 96 డిపార్ట్మెంట్‌ సంఘాల మద్దతుతో ఉద్యోగుల పక్షాన పోరాడాలని ఫిబ్రవరి 5 న కర్నూలులో జరిగిన సమావేశంలో  నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 9 న 50 పేజీల మెమోరాండంలో 48 డిమాండ్లతో కూడిన ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కి ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ డిమాండ్లు సాధన కోసం మార్చ్ 9 నుండి  92 రోజుల పాటు ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశల ఉద్యమ కార్యాచరణతో 48 డిమాండ్లులలో 37 సాధించుకున్నామని, ఇది ఉద్యోగుల విజయంగా అభివర్ణించారు. 92 రోజుల ఏపీజేఏసీ అమరావతి ఉద్యమం ద్వారా సాధించుకున్న విజయాలను గురించి ఈ సందర్బంగా వెల్లడించారు.

1. అందరి ఉద్యోగులకు GPF/ Apgli/ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పోలీస్ శాఖ  వారికి T.A బిల్లులకి సంబంధించి రు.3600 కోట్ల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయటం 
2. RTC లో  పదోన్నతులు పొందిన 2096 మందికి PRC వర్తింపజేయటం
3. RTC ఉద్యోగులకు OTS సాధించటం
4. జీతం/ పెన్షన్ రూపేణా నెలకు రు.10,000/-సంపాదనపరులకు రైస్ కార్డు,ఇతర సౌకర్యాలు కల్పించడం (FCS01-FCCSOCSS ( MISC ) 29/2021-CS-I)
5. టైపింగ్ క్వాలిఫికేషన్ రద్దు చెయ్యడానికి అంగీకరించారు.
6. కారుణ్య నియమకాలు చేపట్టడం (1158 మంది RTC నందు మరియు ఇతర శాఖలలో)
7. 1/2022 సంబంధించిన DA విడుదల చెయుట. ( GO MS No 66 Fin(PC-TA) Dept,Dt:11.05.2023)
8. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ( అన్ని HODల నుండి డేటా అభ్యర్థించబడినది)
9. GSWS ఉద్యోగులకు టార్గెట్స్ రద్దుచేయటం. ( Circular No ROC No.185/F/GSWS/2023,Dt: 03-05-2023)
10. 10% CPS ఉద్యోగుల వాటా ఐన 2443 కోట్లు PRAN అకౌంటులో జమచేయడం.
11. కొత్తగా ఏర్పిడిన జిల్లా కేంద్ర కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16 %  HRA వర్తింపచేయటం. (GO MS No 69 Fin(PC-TA) Dept,Dt:09.05.2023)

టాప్ హెడ్ లైన్స్

Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget