By: ABP Desam | Updated at : 27 Sep 2023 01:10 PM (IST)
స్కిల్ స్కామ్లో ఉండవల్లి పిల్ వేరే బెంచ్కు బదిలీ-నాట్ బిఫోర్ మి అన్న హైకోర్టు న్యాయమూర్తి
చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలువుతున్నాయి. అటు ఏపీ హైకోర్టు.. ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు.. ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇవి చాలవన్నట్టు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కూడా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు. అయితే ఈ పిల్పై విచారణ జరిపేందుకు హైకోర్టు సీజే బెంచ్ అభ్యంతరం తెలిపింది. మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆదేశించింది. దీంతో ఉండవల్లి అరుణ్కుమార్ వేసిన పిల్ మరో బెంచ్కు బదిలీ అవుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 22న ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. ఈ పిటిషన్ హైకోర్టు సీజే బెంచ్ ముందు వచ్చింది. కానీ... సీజే బెంచ్లోని జస్టిస్ రఘునందన్రావు నాట్ బిఫోర్ మి అన్నారు. దీంతో.. మరో బెంచ్కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు సీజే. దీంతో.. పిల్ మరో బెంచ్కు బదిలీ కాబోతుంది. అయితే.. ఏ బెంచ్కు బదిలీ చేస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది మాత్రమే కాదని... రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అంటున్నారు. ఆర్థిక పరమైన నేరంతోపాటు జీఎస్టీ ఎగవేత, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ కేసును ఇప్పటికే ఈడీ విచారిస్తున్న విషయాన్ని కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్కుమార్. ఇది.. పెద్ద స్కామ్ కనుక సీఐడీతో కాకుండా... సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని ఆయన కోరుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబును ఈనెల 9న అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబుకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబుకు బెయిల్ ఇప్పించేందుకు ఆయన తరపు లాయర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని టీడీపీ, చంద్రబాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల సొమ్ము తినాల్సి అవసరం తమకు లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. జైల్లో చంద్రబాబు సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. మరోవైపు టీడీపీ ఆరోపణలను వైఎస్ఆర్సీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఇక... స్కిల్ స్కామ్లో ఏపీ హైకోర్టులో పిల్ వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టును అభ్యర్థిస్తున్నారు.
Trains Cancelled: విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు
RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>