అన్వేషించండి

AP High Court: ఏపీ సర్కార్‌కు మరోసారి హైకోర్టు షాక్! అందుకు ఒప్పుకోని ధర్మాసనం

AP High Court: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను అర్ధాంతరంగా రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత విద్యార్థుల పదో తరగతి పూర్తయ్యే వరకూ స్కూళ్లను కొనసాగించాలని ఆదేశించింది.

AP High Court News: ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను అర్ధాంతరంగా రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత విద్యార్థుల పదో తరగతి పూర్తయ్యే వరకూ స్కూళ్లను కొనసాగించాలని ఆదేశించింది. మాల మహానాడు నేతలు ప్రభుత్వం తీసుకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (Best Available Schools Scheme) నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో (AP High Court News) పిటిషన్ వేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభ కనబర్చిన వారికి కార్పొరేట్ స్కూళ్లలో చదువు కోసం ప్రభుత్వం ఈ పథకం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒకటి, ఐదో తరగతుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ చేర్చుతోంది.  1995లో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. పిల్లల విద్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తాజాగా హైకోర్టు (AP High Court Orders) ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఉల్లంఘన కింద ఆగ్రహం
మరో కేసు విషయంలో హై కోర్టు (AP High Court News) ఆదేశించినా కేసులో విచారణకు హాజరు కాని, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.జవహా రెడ్డిపై (K Jawahar Reddy IAS)  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో సమావేశం ఉందని కోర్టుకు హాజరు కావడం మానుకుంటారా? అని ప్రశ్నించింది. కనీసం కోర్టుకు హాజరయ్యే సమయం కూడా లేదా అంటూ నిలదీసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాల్లోనే పాల్గొంటారా అంటూ ప్రశ్నించింది.

ఆ మేరకు రోజులకు ఎన్నిగంటలు మీటింగుల్లో పాల్గొంటారో సీఎం పేషీ నుంచి నివేదిక తెప్పించుకొని చూస్తాం అని చెప్పింది. స్వాతంత్ర్య సమర యోధులు గాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌ తదితర మహోన్నతులే కోర్టుల ఆదేశాలను గౌరవించారని, మీరు అంతకన్నా గొప్పవారా? అంటూ  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన తన హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఐఏఎస్‌ జవహర్‌రెడ్డి (K Jawahar Reddy IAS) దాఖలు చేసిన అఫిడవిట్ లో సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎప్పటికి ముగుస్తుందనే కనీస వివరాలు లేవని తప్పుబట్టింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తిస్తే వివరణ తీసుకోకుండానే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దయచేసి న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోతే ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని హితవు పలికింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana:  బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana:  బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
Embed widget