అన్వేషించండి

Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌, ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యం

AP government employees : సచివాలయం, అసెంబ్లీ వంటి చోట్ల పనిచేస్తున్న ఉద్యోగులకు మేలు చేసేలా కీలక ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. వీరికి ఉచిత వసతి సదుపాయం పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

AP Government Issued Beneficial Orders To Government Employees: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు ప్రభుత్వశాఖల్లో పని చేసే అందరికీ వర్తించవు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

గతంలో ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయి. గడువు ముగియడంతో ఉచిత సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు వర్తించేలా ఆదేశించింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న వారికి 2024 జూన్‌ 27 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 26 తేదీ వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన తరువాత అనేక శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఏపీకి బదిలీ అయ్యారు. ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉన్నప్పటికీ రాజధానిని అభివృద్ధి చేసుకునే క్రమంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీ, వివిధ రాష్ట్ర స్థాయి శాఖలు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావాల్సి వచ్చింది. 

ఒక్కసారిగా హైదరాబాద్‌ నుంచి రావడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి అనేక వెసులుబాటులు కల్పించింది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పించడంతోపాటు ఐదురోజులు ఉండేందుకు అనుగుణమైన వసతి సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వమే వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేసింది. గతంలో ఇచ్చిన ఉచిత వసతికి సంబంధించిన గడువు ముగియడంతో ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఉచిత వసతికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇది అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు మేలు చేకూర్చనుంది. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 2017 నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏటా ఉద్యోగ సంఘాల నేతల వినతితో ప్రభుత్వం ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తోంది. 2022 జూన్‌లో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ ఆదేశించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్‌ చేయడంతో ఏడాదిపాటు పొడిగించారు. అప్పటి నుంచి ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. ఉద్యోగులు కోసం ప్రతిరోజూ సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు. కొందరు రోజూ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. రెండు నెలలు నుంచి ఒకటో తేదీన జీతాలను చెల్లిస్తోంది. దీని పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Ram Charan Gift To Pawan: పవన్‎కి రామ్‌ చరణ్‌ బిగ్ గిఫ్ట్, పిఠాపురంలో బాబాయ్‌ ఎన్నికల హామీని నెరవేర్చుతున్న అబ్బాయ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget