అన్వేషించండి

Andhra Pradesh: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌, ఏడాది పాటు ఉచిత వసతి సౌకర్యం

AP government employees : సచివాలయం, అసెంబ్లీ వంటి చోట్ల పనిచేస్తున్న ఉద్యోగులకు మేలు చేసేలా కీలక ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. వీరికి ఉచిత వసతి సదుపాయం పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

AP Government Issued Beneficial Orders To Government Employees: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు ప్రభుత్వశాఖల్లో పని చేసే అందరికీ వర్తించవు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

గతంలో ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయి. గడువు ముగియడంతో ఉచిత సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు వర్తించేలా ఆదేశించింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న వారికి 2024 జూన్‌ 27 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 26 తేదీ వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన తరువాత అనేక శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఏపీకి బదిలీ అయ్యారు. ఉమ్మడి రాజధాని పదేళ్లపాటు ఉన్నప్పటికీ రాజధానిని అభివృద్ధి చేసుకునే క్రమంలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సచివాలయం, అసెంబ్లీ, వివిధ రాష్ట్ర స్థాయి శాఖలు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావాల్సి వచ్చింది. 

ఒక్కసారిగా హైదరాబాద్‌ నుంచి రావడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి అనేక వెసులుబాటులు కల్పించింది. వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పించడంతోపాటు ఐదురోజులు ఉండేందుకు అనుగుణమైన వసతి సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వమే వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేసింది. గతంలో ఇచ్చిన ఉచిత వసతికి సంబంధించిన గడువు ముగియడంతో ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా ఉచిత వసతికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఇది అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు మేలు చేకూర్చనుంది. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 2017 నుంచి ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏటా ఉద్యోగ సంఘాల నేతల వినతితో ప్రభుత్వం ఈ మేరకు సదుపాయాన్ని కల్పిస్తోంది. 2022 జూన్‌లో ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలని జీఏడీ ఆదేశించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్‌ చేయడంతో ఏడాదిపాటు పొడిగించారు. అప్పటి నుంచి ఏటా పొడిగిస్తూ వస్తున్నారు. ఉద్యోగులు కోసం ప్రతిరోజూ సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలును నడుపుతున్నారు. కొందరు రోజూ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. రెండు నెలలు నుంచి ఒకటో తేదీన జీతాలను చెల్లిస్తోంది. దీని పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Ram Charan Gift To Pawan: పవన్‎కి రామ్‌ చరణ్‌ బిగ్ గిఫ్ట్, పిఠాపురంలో బాబాయ్‌ ఎన్నికల హామీని నెరవేర్చుతున్న అబ్బాయ్

టాప్ హెడ్ లైన్స్

Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Breaking News: రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. 10న ఎన్డీయే సీఎం, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరు
E85 Fuel India: ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
ప్రతి కారు లేదా బైక్‌లో E85 ఇంధనాన్ని వాడవచ్చా? మైలేజీపై ప్రభావం చూపుతుందా..
India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
Embed widget