By: ABP Desam | Updated at : 23 May 2022 04:37 PM (IST)
ఏపీ పెవిలియన్లో టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానితో సీఎం జగన్ భేటీ
విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ప్రస్తుతం దావోస్లో పర్యటిస్తున్న జగన్... వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సులో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు.
రెండో రోజు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానితో భేటీ అయిన జగన్... రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని రిక్వస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు వివరించారు.
సీఎంతో భేటీ అనంతరం మాట్లాడిన సీపీ గుర్నాని.. పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్తో మంచి సమావేశం జరిగిందన్నారు. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని వివరించారు..
టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ బైట్.#APatWEF22 #AndhraPradesh #CMYSJaganInDavos pic.twitter.com/zv8F17pB8l
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరినట్టు సీపీ గుర్నాని వివరించారు. ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారన్నారు.
సీపీ గుర్నాని , టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ:
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
ముఖ్యమంత్రిగారితో మంచి సమావేశం జరిగింది.
విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారు.
నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. 1/2 pic.twitter.com/bUUuHbHEnP
ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రావర్శిటీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు సీపీ గుర్నాని ప్రకటించారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంలెటిజెన్స్కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని ఆయన సంకల్పంతో ఉన్నారు.
— YSR Congress Party (@YSRCParty) May 23, 2022
ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తాం. 2/2
జపాన్ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్ భేటీ కానున్నారు. హీరోమోటార్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎండీ పవన్ ముంజల్తో సమావేశం కానున్నారు. ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ సీఎం డిస్కషన్ చేయనున్నారు.
Guntur News : వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్క పిల్ల మృతి, రోడ్డుపై బైఠాయించిన ఓ కుటుంబం
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Chandrababu Letter : సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై సీఐడీ వేధింపులు, డీజీపీకి చంద్రబాబు లేఖ
TS TET Results 2022: తెలంగాణ టెట్లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి
Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్కు సీఎం జగన్పైనే తొలి ఫిర్యాదు !
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్