అన్వేషించండి

Pawan Kalyan: రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది, జూన్ 4న జనసేన కార్యక్రమాలు

Andhra Pradesh News | సుపరిపాలన మొదలై ఏడాది... పీడ విరగడై ఏడాది అనే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వేడుకలపై డిజిటల్ క్యాంపెయిన్ చేయాలన్నారు.

Janasena Party News | మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది పూర్తికావొస్తుంది. ఈ క్రమంలో సుపరిపాలన మొదలై ఏడాది... పీడ విరగడై ఏడాది.. కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. అరాచక పాలన సాగించిన వైసీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో... రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది పూర్తయింది. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం మన వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రీణులకి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సంక్రాంతి- దీపావళి (Diwali) పండుగను కలిపి చేసుకుందాము. ఈ వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయాలని, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని Pawan Kalyan దిశా నిర్దేశం చేశారు.


Pawan Kalyan: రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది, జూన్ 4న జనసేన కార్యక్రమాలు

ఏపీలో వైసీపీ పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలనీ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని జనసేన శ్రేణులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘గత ప్రభుత్వ హయాంలో చతికిలబడ్డ అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించే విధంగా కూటమి పాలన సాగుతుంద’ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా వాకపల్లి దేవి సూర్యప్రకాశ్, వైస్ ఛైర్మన్ గా గాది రాజాబాబు, డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాం కనుక ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అందుకు తగ్గట్టే ఆయన తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పన, రైల్వే వంతెనలు ఇలా అని పనులను శరవేగంగా చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. దళిత మహిళ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ గారికి ఈ రోజు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట

కూటమి పాలనలో అన్నదాతల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు నాదెండ్ల. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ. 1674 కోట్లు ధాన్యం బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే వాటిని చెల్లించింది. భారతదేశ చరిత్రలోనే మొట్ట మొదటసారిగా రూ.12,400 కోట్ల విలువైన ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 లక్షల మంది రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.

ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందు రోజే అంటే నిన్నే 68 లక్షల మందికి పెన్షన్లు అందించాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. రూ.13 వేలు వేతనం అందుకుంటున్నారని వైసీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల రేషన్ కార్డులు కోత పెట్టారు. కూటమిలోని మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో కలిసి పని చేయడం అనేది అంత సులువు కాదు. కానీ మూడు పార్టీలు కలసికట్టుగా ఉంటేనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget