అన్వేషించండి

Pilli Subhash vs Minister Venu: ఎంపీ పిల్లి ఘాటు వ్యాఖ్యలతో మరోసారి తాడేపల్లికి చేరిన రామచంద్రపురం పంచాయితీ!

Pilli Subhash Chandra Bose vs Minister Venu: రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి.

Pilli Subhash Chandra Bose vs Minister Venu: రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పంచాయితీ మరోసారి తాడేపల్లి వేదిక అయింది. పార్టీ మారతానంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది..
సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా..
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ముందే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోస్ తన వాదన వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో తన కుమారుడికి సీటు కావాలని బోస్ స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు. అయితే మరోవైపు పార్టీ పరంగా మరోసారి మంత్రి చెల్లుబోయిన వేణుకు మాత్రమే సీటు ఉంటుందని పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి వెల్లడించారు. దీనిపై సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ మారటంపై చర్చ...
మంత్రి వేణుకు మరోసారి రామచంద్రాపురం నియోజకవర్గ సీటును కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం పట్ల రాజ్యసభ ఎంపీ  పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అదే జరిగితే తాను ఇండిపెంటెండ్ గా అయినా సరే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి బరిలోకి దిగుతానని బోస్ ప్రకటించారు. దీంతో అప్రమత్తం అయిన పార్టీ నాయకత్వం ప్రస్తుత పరిస్థితులపై అంచనాలు వేస్తోంది. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న బోస్ కు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్యసభకు పంపారు. అలాంటిది ఇప్పుడు పార్టి నాయకత్వానికి వ్యతిరేకంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్ పార్టీలో కలకలం రేపుతోంది.

తాడేపల్లిలో పంచాయితీ..
బోస్ వ్యవహారంపై గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మిదున్ రెడ్డితో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమావేశం అయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్తితుల పై ఇరువురు నేతలు చర్చించారు. మంత్రి చెల్లుబోయిన వేణుకు సీటు ఇస్తే పార్టిలో కూడ ఉండబోనని, స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగుతానంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన వెనుక కారణాలు గురించి నేతలు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహరం సీరియస్ గా మారటంతో మరోసారి ముఖ్యమంత్రి జగన్ ముందే పంచాయితీ పెట్టాలని నాయకులు భావిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మూడు సార్ల శాసన సభ్యుడిగా గెలుపొందిన తోట త్రిమూర్తులు, మిథున్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయి భాద్యతలను అప్పగించారని అంటున్నారు. 

ఇలా అయితే ఎలా..
పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి నుండి నేరుగా రాజ్యసభకు సైతం పంపారు. ఎమ్మెల్సీ స్దానాలను రద్దు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తరువాత బీసీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎవ్వరూ ఊహించిన విధంగా పిల్లిని రాజ్య సభకు జగన్ ఎంపిక చేయటం సంచలనం అయ్యింది. పిల్లి వంటి సీనియర్ నేతలు, జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు విప్పటం కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget