అన్వేషించండి

AP Bjp Amaravati Tour : అమరావతిలో పర్యటించనున్న ఏపీ బీజేపీ నేతలు - కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇస్తారా ?

శనివారం అమరావతిలో పర్యటించాలని ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించారు. జీవీఎల్ నేతృత్వంలోని బృందం నిర్మాణాలను పరిశీలించనుంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అమరావతి నిర్మాణాలను పరిశీలించాలని నిర్ణయించారు. శనివరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో బృందం పర్యటించనుంది. వారు రైతులతో సమావేశమై వివరాలు తెలుసుకుంటారు. తర్వాత గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన వాటిని ప్రత్యక్షంగా చూస్తారు. అమరావతికి భారతీయ జనతా పార్టీకి కూడా ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది.  అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టం చేస్తోంది. ఈ  క్రమంలో  బీజేపీ నేతలు ప్రత్యక్ష పర్యటనకు వస్తూండటంతో రాజధాని రైతుల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది. 

తప్పుడు రాతలు రాస్తే నా అభిమానులు ఏదైనా చెయ్యొచ్చు, యూట్యూబ్ ఛానళ్లకు మాజీ మంత్రి అనిల్ కుమార్ వార్నింగ్

జీవీఎల్ నరసింహారావు గతంలో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు సానుకూలంగా స్పందించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రానికి సంబంధం లేదన్నారు. అయితే రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలనేది తమ పార్టీ విధానమని చెబుతూ వచ్చారు. అయితే  అమరావతి రైతులు మాత్రం బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించేవారు. సాక్షాత్తూ ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతి నిర్ణయం అయిపోయిందని .. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చే విధానం ఎక్కడ ఉందని.. కేంద్రం ఎందుకు అడ్డుకోదని ప్రశ్నించేవారు. 

దత్తపుత్రుడు ఆ మాట అనగలడా? కొడుక్కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్న తండ్రిని ఎక్కడా చూడలేదు: జగన్

అనేక వివాదాలు.. ఉద్యమాలు.. ఆందోళనల తర్వాత అమరావతి రైతులు ఎట్టకేలకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. అమరావతిని నిర్మించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్మాణాలు ప్రారంభించింది. అయితే మళ్లీ మాస్టర్ ప్లాన్‌లోని ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అక్రమాలంటూ కొత్తగా కేసులు నమోదు చేసి అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారాయణ వంటి వారిని నిందితులుగా చేర్చారు. ఇది కూడా అమరావతిపై కుట్ర కోణంలోనే చేశారని అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. 

ఉమ్మడి అనంతపురంలో జేసీX పల్లె- టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

మరో వైపు అమరావతి రైతులు .. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గత  ప్రభుత్వం రాజధానిలో కేటాయించిన భూములు తీసుకున్నాయి కానీ నిర్మాణాలు ప్రారంభించలేదని.. తక్షణం వాటిని ప్రారంభించాలని కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఆ మేరకు రైతులు వినతి పత్రాలు సమర్పించి వచ్చారు. జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో వస్తున్న బీజేపీ బృందం.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలపై ఏమైనా గుడ్ న్యూస్ రైతులకు చెబుతుందన్న ఆసక్తి ఏర్పడింది. బీజేపీ మిత్రపక్షం జనసేన ఈ పర్యటనలో పాల్గొంటుందో లేదో స్పష్టత లేదు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Kisan: రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు.. పీఎం కిసాన్ యోజన అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Tripti Dimri Photos : స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
స్పిరిట్ బ్యూటీ క్యూట్ లుక్ - నేచర్ విత్ గ్లామరస్ వైబ్... షూటింగ్ అప్డేట్ ఏంటంటే?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
DK Shivakumar Cars: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! ఆయన వద్ద ఏ కార్లు ఉన్నాయో తెలిస్తే షాక్
Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!
Tata Tiago EV 2026: 4.69 లక్షలకే టాటా ఈవీ కారు! కొత్త టియాగో రేంజ్ ఇతర ఫీచర్స్‌ ఇవే!
Maruti Ethanol Car:పెట్రోల్‌కు కాలం చెల్లిందా? జూన్‌ 5న మారుతి
రూ. 4 ఖర్చు... 18 కిలోమీటర్ల మైలేజ్‌! మారుతి సుజుకి ఇథనాల్ కార్ వచ్చేస్తోంది... పూర్తి వివరాలు ఇవే!
Embed widget