అన్వేషించండి

TDP Protests: ఎద్దుల స్థానంలో ఎమ్మెల్యేలు, ఎడ్ల బండి లాక్కుంటూ అసెంబ్లీకి - ఇరుక్కుపోయిన వైసీపీ లీడర్లు!

టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నారాలోకేశ్ తో ఎమ్మె్ల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడె మోసుకుంటూ లాక్కొని వెళ్లారు.

ఏపీలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. మూడో రోజు అసెంబ్లీ సందర్భంగా వారు ఎద్దుల బండ్లతో నిరసన తెలిపారు. ఎద్దుల బండ్లపై అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎద్దుల బండ్ల టైర్లలో గాలి తీసేశారు. ఎద్దులను అక్కడి నుంచి ఓ కిలో మీటరు దూరం తోలేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేశారు.

ఎద్దులు లేకపోవడంతో మందడం ఊరి నుంచి ఖాళీ ఎద్దుల బండ్లతో నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నారాలోకేశ్ తో ఎమ్మె్ల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడె మోసుకుంటూ లాక్కొని వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడ?, జగన్‌ పాలనలో క్రాప్‌ హాలిడే అమలు అవుతోంది. లాంటి నినాదాలు చేశారు. ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. మధ్యలో రోడ్డుపై పోలీసులు వలయంగా ఏర్పడి ఆపే ప్రయత్నం చేయగా, వారిని దాటుకొని అసెంబ్లీ వరకూ వెళ్లగలిగారు. 

ఈ సందర్భంగా టీడీపీ నిరసన తెలిపినందుకు ఎద్దులను, బండ్లను ఇచ్చిన రైతును తుళ్లూరు సీఐ తీవ్రంగా కొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుపై చేయిచేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపైన అసెంబ్లీలోనూ తమ నిరసన తెలుపుతామని అన్నారు. అయితే, నేటి (సెప్టెంబరు 19) అసెంబ్లీలో రైతులు సమస్యలపై చర్చ జరపాలని టీడీపీ నేతలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.

మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రైతుల నిరసన సెగ
మరోవైపు, నేడు ఉదయం ఏపీ సచివాలయం వద్ద రైతులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడ దూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి రైతులు ప్రయత్నించారు. రైతు ఆందోళనతో అసెంబ్లీ - సచివాలయం మార్గంలో ట్రాఫిక్ బాగా ఆగిపోయింది. దీంతో ఆ ట్రాఫిక్ లోనే పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు ఉండిపోయాయి. పోలీసులు రైతుల్ని అరెస్టు చేసి తీసుకెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసే వరకూ అసెంబ్లీకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డు నుంచి ఈడ్చుకు వెళ్లి రైతులను కారు, ఆటోలలో రైతులను పోలీసులు తరలించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget