అన్వేషించండి

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తాయి. ఉదయం 9గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. రెండు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. ఆ తర్వాత విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై శాసనసభలో చర్చించారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారిస్తే... సీఎం జగన్‌ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ  తీసుకున్నారని చెప్పారు వైసీపీ సభ్యులు. విద్యారంగం రాష్ట్ర అభివృద్ధి కీలకమన్నారు. డిజిటల్‌ విద్యాను పేదవారికి చేరువ చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని కొనియాడారు.  అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. నాడు-నేడు కింద 56 వేల స్కూళ్లను బాగుచేశారు. నాణ్యమైన చదువు అందిచడమే లక్ష్యంగా మార్పులు  తీసుకొచ్చారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయన్నారు. విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదని.. సీఎం జగన్‌ ఎన్నో  సంస్కరణలు చేశారన్నారు. దీని వల్ల పేదవాళ్లకు కూడా విద్య చేరువైందన్నారు. 

ఈరోజు రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ  ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులను శాసనసభ ముందు పెట్టనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌  కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్  2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. ఇన్నర్  రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలపై కూడా చర్చ జరగనుంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న  చర్యలపై కూడా శాసనసభలో చర్చించనున్నారు. 

ఇక, ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి. మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రానుంది. స్కిల్ స్కాంపై రెండవ రోజు  కూడా చర్చ జరగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ  మండలిలోనూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు... అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలను సభలో వివరించే అవకాశం ఉంది. ఈ కేసులో A-1 చంద్రబాబు, A-14 లోకేష్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.  ఈక్రమంలో... చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని శాసనసభ సాక్షిగా ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget