అన్వేషించండి

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తాయి. ఉదయం 9గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభమైంది. రెండు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. ఆ తర్వాత విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై శాసనసభలో చర్చించారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారిస్తే... సీఎం జగన్‌ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ  తీసుకున్నారని చెప్పారు వైసీపీ సభ్యులు. విద్యారంగం రాష్ట్ర అభివృద్ధి కీలకమన్నారు. డిజిటల్‌ విద్యాను పేదవారికి చేరువ చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని కొనియాడారు.  అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. నాడు-నేడు కింద 56 వేల స్కూళ్లను బాగుచేశారు. నాణ్యమైన చదువు అందిచడమే లక్ష్యంగా మార్పులు  తీసుకొచ్చారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయన్నారు. విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదని.. సీఎం జగన్‌ ఎన్నో  సంస్కరణలు చేశారన్నారు. దీని వల్ల పేదవాళ్లకు కూడా విద్య చేరువైందన్నారు. 

ఈరోజు రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ  ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులను శాసనసభ ముందు పెట్టనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌  కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్  2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. ఇన్నర్  రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలపై కూడా చర్చ జరగనుంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న  చర్యలపై కూడా శాసనసభలో చర్చించనున్నారు. 

ఇక, ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి. మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రానుంది. స్కిల్ స్కాంపై రెండవ రోజు  కూడా చర్చ జరగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ  మండలిలోనూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు... అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలను సభలో వివరించే అవకాశం ఉంది. ఈ కేసులో A-1 చంద్రబాబు, A-14 లోకేష్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.  ఈక్రమంలో... చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని శాసనసభ సాక్షిగా ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget