అన్వేషించండి

Vijayawada News : దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం - అమ్మవారి నివేదన అపవిత్రం !

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరో అపవిత్రం చోటు చేసుకుంది. అమ్మవారి నివేదన వంటశాలలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడమే కాదు ముందుగానే ప్రసాదం తినేశారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vijayawada News :   విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి  నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన  తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల   ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది. 

సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన అధికారులు

దీని పై విచారణ చేపట్టిన అధికారులు ఈవో కు నివేదిక ఇచ్చారు. నివేదక ప్రకారం ఈవో వైదిక కమిటిలో ఉన్న అర్చకులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  వివరణ తీసుకున్న తరువాత చర్యలు ఉంటాయని అంటున్నారు. మరో వైపున విషయం బయటకు రావటంతో రాత్రికి రాత్రే నివేదన శాలలో సంప్రోక్షణలు చేసినట్లుగా చెబుతున్నారు. దీని పై దేవస్దానంలో ఉన్న సీసీ కెమేరాల వీడియోలు   ఈవో సేకరించారని, వాటిని బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నివేదన వంటశాళలోకి అర్చకుకూ ప్రవేశం ఉండదు.. ప్రైవేటు వ్యక్తులెలా వెళ్లారు ? 

ఇంద్రకీలాద్రి పై అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన తయారు చేసేందుకు స్పెషల్ వంటశాల ఉంటుంది. అమ్మవారి నివేదన శాల లో వంటకాలు చేసేందుకు బ్రాహ్మణ అర్చకులు తెల్లవారు జాము నుండే కార్యకలాపాలు సాగిస్తుంటారు. రోజుకు మూడు పూటలా అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నివేదనగా సమర్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీ కూడ ఉంటుంది. వైదిక కమిటిలో ని అర్చకులు నివేదన సమర్ఫణ కు కావాల్సిన కార్యకలాపాలను పరిశీలిస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నివేదన శాలలోకి ఇతరులను అనుమతించరు. దేవస్దానంలో పని చేసే సిబ్బంది, అర్చకులు కూడ నివేదన శాలలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. అంతే కాదు అర్చకులు నివేదన శాలలోకి రావాలన్నా   అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి వేరొక వ్యక్తిని తీసుకురావటం సంచలనం రేకెత్తించింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో సదరు అర్చక స్వాములకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు     

ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్దానంలో సిబ్బంది మధ్య వర్గ విభేదాల కారణంగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఘటన పై అధికారులు ముందస్తుగా సీసీ కెమేరాల వీడియోలను సేకరించినట్లుగా చెబుతున్నారు. నివేదన శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు రావటం, అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకోవటం, అక్కడే తిని చేతులు  కడుక్కోవటం వంటి వీడియోలు సైతం రికార్డయ్యాయని అంటున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, ఇష్టాను సారంగా వ్యవహరించటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు. వ్యవహరం బయటకు రావటంతో ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించారని, అంతా జరిగిన తరువాత ఇప్పుడు దిద్దు బాటు చర్యలు చేపట్టటం పై   విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget