అన్వేషించండి

Vijayawada News : దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం - అమ్మవారి నివేదన అపవిత్రం !

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరో అపవిత్రం చోటు చేసుకుంది. అమ్మవారి నివేదన వంటశాలలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడమే కాదు ముందుగానే ప్రసాదం తినేశారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vijayawada News :   విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి  నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన  తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల   ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది. 

సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన అధికారులు

దీని పై విచారణ చేపట్టిన అధికారులు ఈవో కు నివేదిక ఇచ్చారు. నివేదక ప్రకారం ఈవో వైదిక కమిటిలో ఉన్న అర్చకులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  వివరణ తీసుకున్న తరువాత చర్యలు ఉంటాయని అంటున్నారు. మరో వైపున విషయం బయటకు రావటంతో రాత్రికి రాత్రే నివేదన శాలలో సంప్రోక్షణలు చేసినట్లుగా చెబుతున్నారు. దీని పై దేవస్దానంలో ఉన్న సీసీ కెమేరాల వీడియోలు   ఈవో సేకరించారని, వాటిని బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నివేదన వంటశాళలోకి అర్చకుకూ ప్రవేశం ఉండదు.. ప్రైవేటు వ్యక్తులెలా వెళ్లారు ? 

ఇంద్రకీలాద్రి పై అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన తయారు చేసేందుకు స్పెషల్ వంటశాల ఉంటుంది. అమ్మవారి నివేదన శాల లో వంటకాలు చేసేందుకు బ్రాహ్మణ అర్చకులు తెల్లవారు జాము నుండే కార్యకలాపాలు సాగిస్తుంటారు. రోజుకు మూడు పూటలా అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నివేదనగా సమర్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీ కూడ ఉంటుంది. వైదిక కమిటిలో ని అర్చకులు నివేదన సమర్ఫణ కు కావాల్సిన కార్యకలాపాలను పరిశీలిస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నివేదన శాలలోకి ఇతరులను అనుమతించరు. దేవస్దానంలో పని చేసే సిబ్బంది, అర్చకులు కూడ నివేదన శాలలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. అంతే కాదు అర్చకులు నివేదన శాలలోకి రావాలన్నా   అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి వేరొక వ్యక్తిని తీసుకురావటం సంచలనం రేకెత్తించింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో సదరు అర్చక స్వాములకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు     

ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్దానంలో సిబ్బంది మధ్య వర్గ విభేదాల కారణంగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఘటన పై అధికారులు ముందస్తుగా సీసీ కెమేరాల వీడియోలను సేకరించినట్లుగా చెబుతున్నారు. నివేదన శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు రావటం, అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకోవటం, అక్కడే తిని చేతులు  కడుక్కోవటం వంటి వీడియోలు సైతం రికార్డయ్యాయని అంటున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, ఇష్టాను సారంగా వ్యవహరించటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు. వ్యవహరం బయటకు రావటంతో ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించారని, అంతా జరిగిన తరువాత ఇప్పుడు దిద్దు బాటు చర్యలు చేపట్టటం పై   విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
Embed widget