అన్వేషించండి

Vijayawada News : దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం - అమ్మవారి నివేదన అపవిత్రం !

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో మరో అపవిత్రం చోటు చేసుకుంది. అమ్మవారి నివేదన వంటశాలలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించడమే కాదు ముందుగానే ప్రసాదం తినేశారు. ఈ వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vijayawada News :   విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి  నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన  తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల   ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది. 

సీసీ కెమెరా దృశ్యాలు సేకరించిన అధికారులు

దీని పై విచారణ చేపట్టిన అధికారులు ఈవో కు నివేదిక ఇచ్చారు. నివేదక ప్రకారం ఈవో వైదిక కమిటిలో ఉన్న అర్చకులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.  వివరణ తీసుకున్న తరువాత చర్యలు ఉంటాయని అంటున్నారు. మరో వైపున విషయం బయటకు రావటంతో రాత్రికి రాత్రే నివేదన శాలలో సంప్రోక్షణలు చేసినట్లుగా చెబుతున్నారు. దీని పై దేవస్దానంలో ఉన్న సీసీ కెమేరాల వీడియోలు   ఈవో సేకరించారని, వాటిని బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నివేదన వంటశాళలోకి అర్చకుకూ ప్రవేశం ఉండదు.. ప్రైవేటు వ్యక్తులెలా వెళ్లారు ? 

ఇంద్రకీలాద్రి పై అమ్మవారికి ప్రత్యేకంగా నివేదన తయారు చేసేందుకు స్పెషల్ వంటశాల ఉంటుంది. అమ్మవారి నివేదన శాల లో వంటకాలు చేసేందుకు బ్రాహ్మణ అర్చకులు తెల్లవారు జాము నుండే కార్యకలాపాలు సాగిస్తుంటారు. రోజుకు మూడు పూటలా అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నివేదనగా సమర్పిస్తుంటారు. ఇందుకు గాను ప్రత్యేక కమిటీ కూడ ఉంటుంది. వైదిక కమిటిలో ని అర్చకులు నివేదన సమర్ఫణ కు కావాల్సిన కార్యకలాపాలను పరిశీలిస్తుంటారు. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నివేదన శాలలోకి ఇతరులను అనుమతించరు. దేవస్దానంలో పని చేసే సిబ్బంది, అర్చకులు కూడ నివేదన శాలలోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. అంతే కాదు అర్చకులు నివేదన శాలలోకి రావాలన్నా   అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి వేరొక వ్యక్తిని తీసుకురావటం సంచలనం రేకెత్తించింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావటంతో సదరు అర్చక స్వాములకు ఈవో సంజాయిషీ నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు     

ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్దానంలో సిబ్బంది మధ్య వర్గ విభేదాల కారణంగా జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఘటన పై అధికారులు ముందస్తుగా సీసీ కెమేరాల వీడియోలను సేకరించినట్లుగా చెబుతున్నారు. నివేదన శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు రావటం, అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకోవటం, అక్కడే తిని చేతులు  కడుక్కోవటం వంటి వీడియోలు సైతం రికార్డయ్యాయని అంటున్నారు. అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి, ఇష్టాను సారంగా వ్యవహరించటం వలన భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు. వ్యవహరం బయటకు రావటంతో ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమాలు కూడ నిర్వహించారని, అంతా జరిగిన తరువాత ఇప్పుడు దిద్దు బాటు చర్యలు చేపట్టటం పై   విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Embed widget