అన్వేషించండి

Amaravati Land Pooling: అమరావతి మలివిడత భూసేకరణకు నిబంధనలు విడుదల, పరిహారం పూర్తి వివరాలు

అమరావతి మలివిడత భూసేకరణకు సంబంధించి పురపాలక శాఖ నిబంధనలు విడుదల చేసింది. ఎవరికి ఎంతమేర పరిహారం అందనుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amaravati land pooling scheme 2025 guidelines | ఏపీ రాజధాని అమరావతి కోసం కొత్తగా చేపట్టనున్న భూ సమీకరణకు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. రాజధాని అభివృద్ధికి సీఆర్డిఏ పరిధిలో చేయనున్న భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ  (రూపకల్పన, అమలు) నిబంధనలు 2025 గెజిట్లో నిబంధనలను నోటిఫై చేస్తూ ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జిఓ నంబర్ 118 జారీ చేశారు. రాజధాని అమరావతి పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు మినహా సి ఆర్ డి ఏ మొత్తం ప్రాంతానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2014లో అమరావతికి ప్రకటించిన నిబంధనలను దాదాపుగా తాజా భూసేకరణకు వర్తింపజేస్తున్నారు.       

ల్యాండ్ పూలింగ్ పథకం                                                                                                                                            

విమానాశ్రయాలు, ఓడరేవులు, అన్ని ఇతర అవసరమైన ప్రాజెక్టుల వంటి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి, భూమి సేకరణ విధానం స్వచ్ఛంద పథకంగా రూపొందించారు. ఇది భూ యజమానులు, రాష్ట్రం/అధికార సంస్థ మధ్య పరస్పర ఏకాభిప్రాయం ఆధారంగా ఉంటుంది. ఇది భూమి సేకరణకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ‘ల్యాండ్ పూలింగ్ పథకం’ అమలు చేస్తారు.

ల్యాండ్ పూలింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రూపొందించిన పథకం, భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం,  పారదర్శకత హక్కు చట్టం, 2013లోని సెక్షన్ 107 & 108 కింద అనుమతి కారణంగా. ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొనే భూ యజమానులు అప్పగించిన కారణంగా, AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 48(1) కింద రాష్ట్రం/అధికారికి ప్రాతినిధ్యం వహించే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన అంగీకారంతో అందించిన భూమిలోని టైటిల్ రాష్ట్రం/అధికారానికి అనుకూలంగా బదిలీ కానుంది. 

AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 43(4)(a) కింద అంగీకరించిన అభివృద్ధి పథకం ప్రకారం, పునర్నిర్మించిన ప్లాట్‌ను అదే ప్రాంతంలో లేదా ఏదైనా ఇతర సమీపంలో భూమి యజమానికి అనుకూలంగా కేటాయించనున్నారు. చట్టంలోని సెక్షన్ 43(5) & (6) ప్రకారం ల్యాండ్ పూలింగ్ పథకం కోసం ఏదైనా ప్రాంతం ఉద్దేశ్యాన్ని ప్రభుత్వమే గుర్తించి తెలియజేస్తే, అథారిటీ ఆమోదం అవసరం లేదు.

కమిషనర్ ల్యాండ్ పూలింగ్ పథకాన్ని కొనసాగించడానికి అథారిటీని గుర్తించి ఆమోదం పొందిన తర్వాత, కమిషనర్/ అధికారి చట్టంలోని సెక్షన్ 55(4) కింద తన ఉద్దేశ్యాన్ని ప్రకటించడానికి నోటిఫికేషన్ Iలో సూచించిన ఫార్మాట్‌లో సెక్షన్ 55(5) కింద అభ్యంతరాలను ఆహ్వానించారు.

- పురపాలక శాఖ పట్టా భూములు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరానికి 1000 గజాల నివాస స్థలంతో పాటు 250 గజాల కమర్షియల్ ప్లాట్‌ ఇస్తారు.  
- జామ, నిమ్మ, సపోటా వంటి పండ్ల తోటలున్న భూములకు లక్ష రూపాయలు చొప్పున కేవలం ఒక్కసారి పరిహారం చెల్లిస్తారు. 
- జరీబు భూములు ఇచ్చే వారికి ఎకరానికి 1000 చదరపు గజాల నివాసం స్థలంతో పాటు 450 చదరపు గజాల కమర్షియల్‌ ప్లాట్ స్థలం  
ఎసైన్డ్‌ భూములకు, శివాయ్ జమేదార్స్, అభ్యంతరం లేని, అభ్యంతరం ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
-  ఒకవేళ పట్టా భూములు 1954 కి ముందు, ఆ తర్వాత ఎసైన్‌ చేసిన భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములకు మాత్రమే  కౌలు చెల్లిస్తారు. మిగతా కేటగిరీల భూములకు ఎలాంటి కౌలు చెల్లించరు. 
- మెట్ట భూములకు తొలి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి ముందు ఏడాది ఇచ్చిన దాంట్లో ఏటా 10 శాతం అధికంగా చెల్లిస్తారు.  

అనధికార లేఅవుట్లలోని స్థలాలకు పరిహారం
అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65 శాతం పరిహారం గానీ, గరిష్టంగా 500 చదరపు గజాల భూమి గానీ పరిహారంగా ఇస్తారు.  సీఆర్‌డీఏ/డీటీసీపీ లేదా   వీజీటీఎం-ఉడా అనుమతితో వేసిన లేఅవుట్లతో పాటు గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్‌ సైట్‌లను తాజా భూ సేకరణ నుంచి మినహాయిస్తారు. బలహీనవర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీలను,     విస్తరించిన గ్రామ కంఠాలను మినహాయిస్తారు. అయితే భూసమీకరణ నిర్ణయం ప్రకటించే నాటికి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 

భూములు తీసుకునే గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున 10 సంవత్సరాల పాటు పింఛను ఇస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget