అన్వేషించండి

Amaravati Land Pooling: అమరావతి మలివిడత భూసేకరణకు నిబంధనలు విడుదల, పరిహారం పూర్తి వివరాలు

అమరావతి మలివిడత భూసేకరణకు సంబంధించి పురపాలక శాఖ నిబంధనలు విడుదల చేసింది. ఎవరికి ఎంతమేర పరిహారం అందనుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amaravati land pooling scheme 2025 guidelines | ఏపీ రాజధాని అమరావతి కోసం కొత్తగా చేపట్టనున్న భూ సమీకరణకు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. రాజధాని అభివృద్ధికి సీఆర్డిఏ పరిధిలో చేయనున్న భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ  (రూపకల్పన, అమలు) నిబంధనలు 2025 గెజిట్లో నిబంధనలను నోటిఫై చేస్తూ ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జిఓ నంబర్ 118 జారీ చేశారు. రాజధాని అమరావతి పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు మినహా సి ఆర్ డి ఏ మొత్తం ప్రాంతానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2014లో అమరావతికి ప్రకటించిన నిబంధనలను దాదాపుగా తాజా భూసేకరణకు వర్తింపజేస్తున్నారు.       

ల్యాండ్ పూలింగ్ పథకం                                                                                                                                            

విమానాశ్రయాలు, ఓడరేవులు, అన్ని ఇతర అవసరమైన ప్రాజెక్టుల వంటి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి, భూమి సేకరణ విధానం స్వచ్ఛంద పథకంగా రూపొందించారు. ఇది భూ యజమానులు, రాష్ట్రం/అధికార సంస్థ మధ్య పరస్పర ఏకాభిప్రాయం ఆధారంగా ఉంటుంది. ఇది భూమి సేకరణకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ‘ల్యాండ్ పూలింగ్ పథకం’ అమలు చేస్తారు.

ల్యాండ్ పూలింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రూపొందించిన పథకం, భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం,  పారదర్శకత హక్కు చట్టం, 2013లోని సెక్షన్ 107 & 108 కింద అనుమతి కారణంగా. ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొనే భూ యజమానులు అప్పగించిన కారణంగా, AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 48(1) కింద రాష్ట్రం/అధికారికి ప్రాతినిధ్యం వహించే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన అంగీకారంతో అందించిన భూమిలోని టైటిల్ రాష్ట్రం/అధికారానికి అనుకూలంగా బదిలీ కానుంది. 

AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 43(4)(a) కింద అంగీకరించిన అభివృద్ధి పథకం ప్రకారం, పునర్నిర్మించిన ప్లాట్‌ను అదే ప్రాంతంలో లేదా ఏదైనా ఇతర సమీపంలో భూమి యజమానికి అనుకూలంగా కేటాయించనున్నారు. చట్టంలోని సెక్షన్ 43(5) & (6) ప్రకారం ల్యాండ్ పూలింగ్ పథకం కోసం ఏదైనా ప్రాంతం ఉద్దేశ్యాన్ని ప్రభుత్వమే గుర్తించి తెలియజేస్తే, అథారిటీ ఆమోదం అవసరం లేదు.

కమిషనర్ ల్యాండ్ పూలింగ్ పథకాన్ని కొనసాగించడానికి అథారిటీని గుర్తించి ఆమోదం పొందిన తర్వాత, కమిషనర్/ అధికారి చట్టంలోని సెక్షన్ 55(4) కింద తన ఉద్దేశ్యాన్ని ప్రకటించడానికి నోటిఫికేషన్ Iలో సూచించిన ఫార్మాట్‌లో సెక్షన్ 55(5) కింద అభ్యంతరాలను ఆహ్వానించారు.

- పురపాలక శాఖ పట్టా భూములు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరానికి 1000 గజాల నివాస స్థలంతో పాటు 250 గజాల కమర్షియల్ ప్లాట్‌ ఇస్తారు.  
- జామ, నిమ్మ, సపోటా వంటి పండ్ల తోటలున్న భూములకు లక్ష రూపాయలు చొప్పున కేవలం ఒక్కసారి పరిహారం చెల్లిస్తారు. 
- జరీబు భూములు ఇచ్చే వారికి ఎకరానికి 1000 చదరపు గజాల నివాసం స్థలంతో పాటు 450 చదరపు గజాల కమర్షియల్‌ ప్లాట్ స్థలం  
ఎసైన్డ్‌ భూములకు, శివాయ్ జమేదార్స్, అభ్యంతరం లేని, అభ్యంతరం ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
-  ఒకవేళ పట్టా భూములు 1954 కి ముందు, ఆ తర్వాత ఎసైన్‌ చేసిన భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములకు మాత్రమే  కౌలు చెల్లిస్తారు. మిగతా కేటగిరీల భూములకు ఎలాంటి కౌలు చెల్లించరు. 
- మెట్ట భూములకు తొలి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి ముందు ఏడాది ఇచ్చిన దాంట్లో ఏటా 10 శాతం అధికంగా చెల్లిస్తారు.  

అనధికార లేఅవుట్లలోని స్థలాలకు పరిహారం
అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65 శాతం పరిహారం గానీ, గరిష్టంగా 500 చదరపు గజాల భూమి గానీ పరిహారంగా ఇస్తారు.  సీఆర్‌డీఏ/డీటీసీపీ లేదా   వీజీటీఎం-ఉడా అనుమతితో వేసిన లేఅవుట్లతో పాటు గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్‌ సైట్‌లను తాజా భూ సేకరణ నుంచి మినహాయిస్తారు. బలహీనవర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీలను,     విస్తరించిన గ్రామ కంఠాలను మినహాయిస్తారు. అయితే భూసమీకరణ నిర్ణయం ప్రకటించే నాటికి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 

భూములు తీసుకునే గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున 10 సంవత్సరాల పాటు పింఛను ఇస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Embed widget