అన్వేషించండి

Amaravati Land Pooling: అమరావతి మలివిడత భూసేకరణకు నిబంధనలు విడుదల, పరిహారం పూర్తి వివరాలు

అమరావతి మలివిడత భూసేకరణకు సంబంధించి పురపాలక శాఖ నిబంధనలు విడుదల చేసింది. ఎవరికి ఎంతమేర పరిహారం అందనుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amaravati land pooling scheme 2025 guidelines | ఏపీ రాజధాని అమరావతి కోసం కొత్తగా చేపట్టనున్న భూ సమీకరణకు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు విడుదల చేసింది. రాజధాని అభివృద్ధికి సీఆర్డిఏ పరిధిలో చేయనున్న భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూ సమీకరణ  (రూపకల్పన, అమలు) నిబంధనలు 2025 గెజిట్లో నిబంధనలను నోటిఫై చేస్తూ ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జిఓ నంబర్ 118 జారీ చేశారు. రాజధాని అమరావతి పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు మినహా సి ఆర్ డి ఏ మొత్తం ప్రాంతానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. 2014లో అమరావతికి ప్రకటించిన నిబంధనలను దాదాపుగా తాజా భూసేకరణకు వర్తింపజేస్తున్నారు.       

ల్యాండ్ పూలింగ్ పథకం                                                                                                                                            

విమానాశ్రయాలు, ఓడరేవులు, అన్ని ఇతర అవసరమైన ప్రాజెక్టుల వంటి అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి, భూమి సేకరణ విధానం స్వచ్ఛంద పథకంగా రూపొందించారు. ఇది భూ యజమానులు, రాష్ట్రం/అధికార సంస్థ మధ్య పరస్పర ఏకాభిప్రాయం ఆధారంగా ఉంటుంది. ఇది భూమి సేకరణకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ‘ల్యాండ్ పూలింగ్ పథకం’ అమలు చేస్తారు.

ల్యాండ్ పూలింగ్ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రూపొందించిన పథకం, భూసేకరణ, పునరావాసం, పునరావాసంలో న్యాయమైన పరిహారం,  పారదర్శకత హక్కు చట్టం, 2013లోని సెక్షన్ 107 & 108 కింద అనుమతి కారణంగా. ల్యాండ్ పూలింగ్ పథకంలో పాల్గొనే భూ యజమానులు అప్పగించిన కారణంగా, AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 48(1) కింద రాష్ట్రం/అధికారికి ప్రాతినిధ్యం వహించే కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన అంగీకారంతో అందించిన భూమిలోని టైటిల్ రాష్ట్రం/అధికారానికి అనుకూలంగా బదిలీ కానుంది. 

AP CRDA చట్టం, 2014లోని సెక్షన్ 43(4)(a) కింద అంగీకరించిన అభివృద్ధి పథకం ప్రకారం, పునర్నిర్మించిన ప్లాట్‌ను అదే ప్రాంతంలో లేదా ఏదైనా ఇతర సమీపంలో భూమి యజమానికి అనుకూలంగా కేటాయించనున్నారు. చట్టంలోని సెక్షన్ 43(5) & (6) ప్రకారం ల్యాండ్ పూలింగ్ పథకం కోసం ఏదైనా ప్రాంతం ఉద్దేశ్యాన్ని ప్రభుత్వమే గుర్తించి తెలియజేస్తే, అథారిటీ ఆమోదం అవసరం లేదు.

కమిషనర్ ల్యాండ్ పూలింగ్ పథకాన్ని కొనసాగించడానికి అథారిటీని గుర్తించి ఆమోదం పొందిన తర్వాత, కమిషనర్/ అధికారి చట్టంలోని సెక్షన్ 55(4) కింద తన ఉద్దేశ్యాన్ని ప్రకటించడానికి నోటిఫికేషన్ Iలో సూచించిన ఫార్మాట్‌లో సెక్షన్ 55(5) కింద అభ్యంతరాలను ఆహ్వానించారు.

- పురపాలక శాఖ పట్టా భూములు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో ఎకరానికి 1000 గజాల నివాస స్థలంతో పాటు 250 గజాల కమర్షియల్ ప్లాట్‌ ఇస్తారు.  
- జామ, నిమ్మ, సపోటా వంటి పండ్ల తోటలున్న భూములకు లక్ష రూపాయలు చొప్పున కేవలం ఒక్కసారి పరిహారం చెల్లిస్తారు. 
- జరీబు భూములు ఇచ్చే వారికి ఎకరానికి 1000 చదరపు గజాల నివాసం స్థలంతో పాటు 450 చదరపు గజాల కమర్షియల్‌ ప్లాట్ స్థలం  
ఎసైన్డ్‌ భూములకు, శివాయ్ జమేదార్స్, అభ్యంతరం లేని, అభ్యంతరం ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
-  ఒకవేళ పట్టా భూములు 1954 కి ముందు, ఆ తర్వాత ఎసైన్‌ చేసిన భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములకు మాత్రమే  కౌలు చెల్లిస్తారు. మిగతా కేటగిరీల భూములకు ఎలాంటి కౌలు చెల్లించరు. 
- మెట్ట భూములకు తొలి ఏడాదికి ఎకరానికి రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేల చొప్పున కౌలు చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి ముందు ఏడాది ఇచ్చిన దాంట్లో ఏటా 10 శాతం అధికంగా చెల్లిస్తారు.  

అనధికార లేఅవుట్లలోని స్థలాలకు పరిహారం
అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65 శాతం పరిహారం గానీ, గరిష్టంగా 500 చదరపు గజాల భూమి గానీ పరిహారంగా ఇస్తారు.  సీఆర్‌డీఏ/డీటీసీపీ లేదా   వీజీటీఎం-ఉడా అనుమతితో వేసిన లేఅవుట్లతో పాటు గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్‌ సైట్‌లను తాజా భూ సేకరణ నుంచి మినహాయిస్తారు. బలహీనవర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీలను,     విస్తరించిన గ్రామ కంఠాలను మినహాయిస్తారు. అయితే భూసమీకరణ నిర్ణయం ప్రకటించే నాటికి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 

భూములు తీసుకునే గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు నెలకు రూ.5 వేల చొప్పున 10 సంవత్సరాల పాటు పింఛను ఇస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget