అన్వేషించండి

Amaravati Real Estate : ఏపీ రాజధానిలో రియల్ ఎస్టేట్ భూమ్ - నెలలో రెట్టింపయిన ధరలు !

Andhra Pradesh : అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటోంది. ధరలు నెలలోనే రెట్టింపు అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.

Amaravati real estate business is booming :  ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే  అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది . కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. 

రాజధాని గ్రామాల్లో క్రయవిక్రయాలు                            

రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది.  జూన్‌ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు  మెట్ట ప్రాంతంలో  గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు అమ్మకాలు జరిగాయి.  ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది.  మాగాణి భూముల్లో పోయిన సంసంవత్సరం గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంత కాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా భారీగా  పెరుగుతున్నాయి.  తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరిగాయ. కానీ  గత  పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా కొంత మందికి  అందాల్సిన  రిటర్నబుల్ ప్లాట్లు                 
 
 2015లో   భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాలను తీసుకుంది.   రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. మూడేళ్లలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం కొంత మందికి ఇచ్చింది. వైసీపీ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఐదేళ్లుగా ప్రక్రియ ముందుకు సాగలేదు. జగన్ మూడు రాజధానుల విధానం  ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయిదంి.   భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.  టీడీపీ రావడంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. 

మంచి ధర వస్తూండటంతో అమ్ముకుంటున్నరైతులు

భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకుంటున్నారు.  మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు నివాస స్థలం,  , 200 గజాలు కమర్షియల్‌ స్థలం ఇస్తున్నారు.  రీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు  నివాస స్థలం  ‌, 250 గజాలు కమర్షియల్‌ ల్యాండ్‌ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget