అన్వేషించండి

Amaravati Real Estate : ఏపీ రాజధానిలో రియల్ ఎస్టేట్ భూమ్ - నెలలో రెట్టింపయిన ధరలు !

Andhra Pradesh : అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటోంది. ధరలు నెలలోనే రెట్టింపు అయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.

Amaravati real estate business is booming :  ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే  అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది . కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. 

రాజధాని గ్రామాల్లో క్రయవిక్రయాలు                            

రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది.  జూన్‌ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు  మెట్ట ప్రాంతంలో  గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు అమ్మకాలు జరిగాయి.  ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది.  మాగాణి భూముల్లో పోయిన సంసంవత్సరం గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంత కాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా భారీగా  పెరుగుతున్నాయి.  తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరిగాయ. కానీ  గత  పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా కొంత మందికి  అందాల్సిన  రిటర్నబుల్ ప్లాట్లు                 
 
 2015లో   భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాలను తీసుకుంది.   రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. మూడేళ్లలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం కొంత మందికి ఇచ్చింది. వైసీపీ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఐదేళ్లుగా ప్రక్రియ ముందుకు సాగలేదు. జగన్ మూడు రాజధానుల విధానం  ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయిదంి.   భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.  టీడీపీ రావడంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. 

మంచి ధర వస్తూండటంతో అమ్ముకుంటున్నరైతులు

భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకుంటున్నారు.  మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు నివాస స్థలం,  , 200 గజాలు కమర్షియల్‌ స్థలం ఇస్తున్నారు.  రీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు  నివాస స్థలం  ‌, 250 గజాలు కమర్షియల్‌ ల్యాండ్‌ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget