అన్వేషించండి

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్ రైల్వే లైన్ పనుల్లో మరో ముందడుగు- టెండర్లు ఆహ్వానిస్తున్న అధికారులు!

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్‌ మధ్య మరో రైల్వే లైన్ పనులు ఊపందుకుంటున్నాయి. భూసేకరణ పూర్తి చేస్తున్న అధికారులు ఇప్పుడు పనులకు టెండర్లు పిలవబోతున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభంకానున్నాయి.

Amaravati-Hyderabad: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెంచేందుకు కీలకమైన ముందడుగు పడింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని బలపరచేందుకు ఒక ముఖ్యమైన స్టెప్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. ఇప్పుడు పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

హైదరాబాద్‌- అమరావతి మధ్య ఏర్పాటు చేసే రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా, కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. దీని కోసం విడివిడగా టెండర్లు పిలవనున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2025 నాటికి పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. 2025లో ప్రారంభించే ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. 

ఈ లైన్‌ను పిడుగురాళ్ల మీదుగా నిర్మించే ఆలోచన చేశారు. కానీ తాజాగా రైల్వే నిపుణుల సలహాల కాజీపేట-విజయవాడ ముఖ్య రైల్వే లైన్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఈ కొత్త మార్గం ఎర్రుపాలెం స్టేషన్‌ నుంచి ప్రారంభమై, పెద్దాపురం, పరిటాల,చెన్నారావుపాలెం, అమరావతి, కొప్పురావూరు గ్రామాల మీదుగా చివరిగా నంబూరు స్టేషన్‌లో గుంటూరు-విజయవాడ లైన్‌తో అనుసంధానమవుతుంది. దీని విస్తీర్ణం సుమారు 58 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. 

ఈ రైలు మార్గం పూర్తైతే సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే రైలు, కాజీపేట, ఖమ్మం, ఎర్రుపాలెం వరకు ప్రస్తుత లైన్‌లో పయనించి, అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మారి, పెద్దాపురం, పరిటాల గ్రామాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. ఈ మార్గం నంబూరు వద్ద గుంటూరు-విజయవాడ లైన్‌తో కలిసిపోయి, విజయవాడ వరకు సాగుతుంది. 

కృష్ణా నదిపై వంతెన: ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన అమరావతి- పరిటాల సెక్షన్‌ మధ్య నిర్మిస్తారు. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన 60 స్పాన్స్‌తో రూపొందుతుంది. 

ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి మొత్తం రూ.2400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్‌లు సిద్ధం చేసింది. ఫేజ్-1 దశలో నంబూరు నుంచి కొప్పురావూరు వరకు 6 కిలోమీటర్ల మార్గం, కొప్పురావూరు నుంచి అమరావతి వరకు 14 కిలోమీటర్ల మార్గం నిర్మించనున్నారు. 

ఫేజ్-2 దశలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం వరకు 5.5 కిలోమీటర్లు, పెద్దాపురం నుంచి చెన్నరావుపాలెం వరకు 5 కిలోమీటర్లు, చెన్నరావుపాలెం నుంచి పరిటాల, అక్కడి నుంచి అమరావతి వరకు 22 కిలోమీటర్ల మార్గం నిర్మాణం జరుగుతుంది.  

ఈ మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, మూడు రోడ్‌ఓవర్ బ్రిడ్జెస్ (ఆర్‌ఓబీలు), 12 రోడ్‌అండర్ బ్రిడ్జెస్ (ఆర్‌యూబీలు) నిర్మించాలని భావిస్తున్నారు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను తొలగించే లక్ష్యంతో, ఈ మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్‌లు ఉండకుండా చూసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget