అన్వేషించండి

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్ రైల్వే లైన్ పనుల్లో మరో ముందడుగు- టెండర్లు ఆహ్వానిస్తున్న అధికారులు!

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్‌ మధ్య మరో రైల్వే లైన్ పనులు ఊపందుకుంటున్నాయి. భూసేకరణ పూర్తి చేస్తున్న అధికారులు ఇప్పుడు పనులకు టెండర్లు పిలవబోతున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభంకానున్నాయి.

Amaravati-Hyderabad: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెంచేందుకు కీలకమైన ముందడుగు పడింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని బలపరచేందుకు ఒక ముఖ్యమైన స్టెప్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. ఇప్పుడు పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

హైదరాబాద్‌- అమరావతి మధ్య ఏర్పాటు చేసే రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా, కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. దీని కోసం విడివిడగా టెండర్లు పిలవనున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2025 నాటికి పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. 2025లో ప్రారంభించే ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. 

ఈ లైన్‌ను పిడుగురాళ్ల మీదుగా నిర్మించే ఆలోచన చేశారు. కానీ తాజాగా రైల్వే నిపుణుల సలహాల కాజీపేట-విజయవాడ ముఖ్య రైల్వే లైన్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఈ కొత్త మార్గం ఎర్రుపాలెం స్టేషన్‌ నుంచి ప్రారంభమై, పెద్దాపురం, పరిటాల,చెన్నారావుపాలెం, అమరావతి, కొప్పురావూరు గ్రామాల మీదుగా చివరిగా నంబూరు స్టేషన్‌లో గుంటూరు-విజయవాడ లైన్‌తో అనుసంధానమవుతుంది. దీని విస్తీర్ణం సుమారు 58 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. 

ఈ రైలు మార్గం పూర్తైతే సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే రైలు, కాజీపేట, ఖమ్మం, ఎర్రుపాలెం వరకు ప్రస్తుత లైన్‌లో పయనించి, అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మారి, పెద్దాపురం, పరిటాల గ్రామాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. ఈ మార్గం నంబూరు వద్ద గుంటూరు-విజయవాడ లైన్‌తో కలిసిపోయి, విజయవాడ వరకు సాగుతుంది. 

కృష్ణా నదిపై వంతెన: ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన అమరావతి- పరిటాల సెక్షన్‌ మధ్య నిర్మిస్తారు. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన 60 స్పాన్స్‌తో రూపొందుతుంది. 

ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి మొత్తం రూ.2400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్‌లు సిద్ధం చేసింది. ఫేజ్-1 దశలో నంబూరు నుంచి కొప్పురావూరు వరకు 6 కిలోమీటర్ల మార్గం, కొప్పురావూరు నుంచి అమరావతి వరకు 14 కిలోమీటర్ల మార్గం నిర్మించనున్నారు. 

ఫేజ్-2 దశలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం వరకు 5.5 కిలోమీటర్లు, పెద్దాపురం నుంచి చెన్నరావుపాలెం వరకు 5 కిలోమీటర్లు, చెన్నరావుపాలెం నుంచి పరిటాల, అక్కడి నుంచి అమరావతి వరకు 22 కిలోమీటర్ల మార్గం నిర్మాణం జరుగుతుంది.  

ఈ మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, మూడు రోడ్‌ఓవర్ బ్రిడ్జెస్ (ఆర్‌ఓబీలు), 12 రోడ్‌అండర్ బ్రిడ్జెస్ (ఆర్‌యూబీలు) నిర్మించాలని భావిస్తున్నారు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను తొలగించే లక్ష్యంతో, ఈ మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్‌లు ఉండకుండా చూసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget