అన్వేషించండి

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్ రైల్వే లైన్ పనుల్లో మరో ముందడుగు- టెండర్లు ఆహ్వానిస్తున్న అధికారులు!

Amaravati-Hyderabad:అమరావతి-హైదరాబాద్‌ మధ్య మరో రైల్వే లైన్ పనులు ఊపందుకుంటున్నాయి. భూసేకరణ పూర్తి చేస్తున్న అధికారులు ఇప్పుడు పనులకు టెండర్లు పిలవబోతున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభంకానున్నాయి.

Amaravati-Hyderabad: తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత పెంచేందుకు కీలకమైన ముందడుగు పడింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుసంధానాన్ని బలపరచేందుకు ఒక ముఖ్యమైన స్టెప్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది. ఇప్పుడు పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

హైదరాబాద్‌- అమరావతి మధ్య ఏర్పాటు చేసే రైల్వే లైన్‌ ప్రాజెక్టులో భాగంగా, కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించాల్సి ఉంది. దీని కోసం విడివిడగా టెండర్లు పిలవనున్నారు. ఈ టెండర్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 2025 నాటికి పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. 2025లో ప్రారంభించే ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. 

ఈ లైన్‌ను పిడుగురాళ్ల మీదుగా నిర్మించే ఆలోచన చేశారు. కానీ తాజాగా రైల్వే నిపుణుల సలహాల కాజీపేట-విజయవాడ ముఖ్య రైల్వే లైన్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఈ కొత్త మార్గం ఎర్రుపాలెం స్టేషన్‌ నుంచి ప్రారంభమై, పెద్దాపురం, పరిటాల,చెన్నారావుపాలెం, అమరావతి, కొప్పురావూరు గ్రామాల మీదుగా చివరిగా నంబూరు స్టేషన్‌లో గుంటూరు-విజయవాడ లైన్‌తో అనుసంధానమవుతుంది. దీని విస్తీర్ణం సుమారు 58 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. 

ఈ రైలు మార్గం పూర్తైతే సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే రైలు, కాజీపేట, ఖమ్మం, ఎర్రుపాలెం వరకు ప్రస్తుత లైన్‌లో పయనించి, అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మారి, పెద్దాపురం, పరిటాల గ్రామాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. ఈ మార్గం నంబూరు వద్ద గుంటూరు-విజయవాడ లైన్‌తో కలిసిపోయి, విజయవాడ వరకు సాగుతుంది. 

కృష్ణా నదిపై వంతెన: ఈ రైల్వే మార్గంలో కృష్ణా నదిపై భారీ వంతెన నిర్మించనున్నారు. ఈ వంతెన అమరావతి- పరిటాల సెక్షన్‌ మధ్య నిర్మిస్తారు. ఇది సుమారు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వంతెన 60 స్పాన్స్‌తో రూపొందుతుంది. 

ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణానికి మొత్తం రూ.2400 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు రైల్వే శాఖ ప్లాన్‌లు సిద్ధం చేసింది. ఫేజ్-1 దశలో నంబూరు నుంచి కొప్పురావూరు వరకు 6 కిలోమీటర్ల మార్గం, కొప్పురావూరు నుంచి అమరావతి వరకు 14 కిలోమీటర్ల మార్గం నిర్మించనున్నారు. 

ఫేజ్-2 దశలో ఎర్రుపాలెం నుంచి పెద్దాపురం వరకు 5.5 కిలోమీటర్లు, పెద్దాపురం నుంచి చెన్నరావుపాలెం వరకు 5 కిలోమీటర్లు, చెన్నరావుపాలెం నుంచి పరిటాల, అక్కడి నుంచి అమరావతి వరకు 22 కిలోమీటర్ల మార్గం నిర్మాణం జరుగుతుంది.  

ఈ మార్గంలో 35 పెద్ద వంతెనలు, 95 చిన్న వంతెనలు, మూడు రోడ్‌ఓవర్ బ్రిడ్జెస్ (ఆర్‌ఓబీలు), 12 రోడ్‌అండర్ బ్రిడ్జెస్ (ఆర్‌యూబీలు) నిర్మించాలని భావిస్తున్నారు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్‌లను తొలగించే లక్ష్యంతో, ఈ మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్‌లు ఉండకుండా చూసేందుకు రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget