అన్వేషించండి

Ambati Rambabu: చంద్రబాబు అన్నిసార్లూ తప్పించుకోలేడు, పవన్ పీకే కాదు కేకే: మంత్రి అంబటి

Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరో సారి విమర్శలు ఎక్కుపెట్టారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దొంగ అన్సి సార్లు తప్పించుకోలేడని, అది చంద్రబాబు అరెస్ట్ విషయంలో రుజువైందన్నారు.

Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ.. దొంగ అన్సి సార్లు తప్పించుకోలేడని, అది చంద్రబాబు అరెస్ట్ విషయంలో రుజువైందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ స్కిల్‌ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు రిమాండ్‌కు వెళ్లిన క్షణం నుంచి టీడీపీ, వారి ఎల్లో మీడియా రాతలు, వాదనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. చంద్రబాబు నేరస్తుడు కాదు అని మాత్రం వాదించడం లేదు. పీసీ యాక్ట్‌ 17ఏ ప్రకారం అరెస్టు జరగలేదు అంటారు. చంద్రబాబును గవర్నర్‌ పర్మిషన్‌ తీసుకుని అరెస్ట్‌ చేయలేదు అంటారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం లేదంటూ బాధపడుతున్నారు. కానీ ఏ చట్టం ముందైనా, విచారణకైనా నిలబడతాం అనే ధైర్యం మాత్రం చేయడం లేదు’ అని విమర్శించారు.
 
లొసుగులను అడ్డం పెట్టుకుని పారిపోయే యత్నం
‘చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని పారిపోవాలనే చంద్రబాబు 32 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విచారణ జరిగితే తమ బండారం అంతా బయటపడుతుందని అనే భయంతో విచారణకు సిద్ధంగా లేరు. 
ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టులో కూడా అదే వాదన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.120 కోట్లు ఆయన పీఏ ద్వారా లంచం తీసుకున్నారనే సమాచారం తమ వద్ద ఉందని, సమాధానం చెప్పాలని  ఇన్‌కం టాక్స్‌ శాఖ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏనాడూ ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ కంపెనీ అంటోంది. రూ.3000 కోట్ల పెట్టుబడులు తాము పెట్టలేదని, ఎలాంటి సాఫ్ట్‌వేర్, పరికరాలు తమ వద్ద నుంచి వెళ్లదని సీమెన్స్ కంపెనీ స్పష్టంగా  చెప్పింది. ఈ కేసులో అడ్డంగా దొరికిన బాబు 17ఏని పట్టుకుని తప్పుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. 

అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్
‘చంద్రబాబుకు కేసులు కొత్తేం కాదు. గతంలో లక్ష్మీపార్వతి, ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌, వైఎస్‌ విజయమ్మ, ఇప్పుడు టీడీపీలో ఉన్న లక్ష్మీ నారాయణ కేసు ఫైల్‌ చేశారు. ఆధారాలతో సహా అవినీతిని కోర్టు ముందు పెడితే టెక్నికల్‌ అంశాలను చూపి మేనేజ్‌ చేసుకుని కొట్టేయించుకున్నాడు. అనేక సార్లు విచారణ నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి. నేరంలో స్పష్టంగా దొరికిపోయాడు. మరో పక్క ఈడీ ఇదే కేసులో నలుగురిని అరెస్టు చేసింది. 1400 మంది సాక్షులను విచారించారు. అనేక డాక్యుమెంట్లు వారి వద్ద ఉన్నాయి. అరెస్టయిన వారు 164 స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. అన్ని ఆధారాలు తీసుకుని చంద్రబాబు నేరం చేశారనే నిర్ణయానికి వచ్చాకే సీబీసీఐడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది’ అని అంబటి అన్నారు.

తప్పించుకునేందుకు లోకేష్ యత్నం
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? ఆయన కుమారుడు కూడా మేశాడు. రింగు రోడ్డులో అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చావు? ఎవరికి లబ్ధి జరిగిందని ప్రశ్నిస్తే లోకేష్ సమాధానం చెప్పడు. మీ హెరిటేజ్‌ భూములు అక్కడే ఎందుకు కొన్నారు చెప్పమంటే రింగ్‌ రోడ్డే లేదుగా అంటాడు. అసలు రాజధానే లేదు కదా.. అంతా గ్రాఫిక్స్‌ కదా అంటున్నాడు. చంద్రబాబు అరెస్టుతో జైళ్లో ఉన్నాడు. లోకేష్ అరెస్ట్‌ చేయకుండానే ఓపెన్‌ జైళ్లో ఉన్నాడు. మొన్నొక రోజు వచ్చి కన్పించి పోయాడు. నేడు విచారణకు హాజరయ్యాడు. విచారణలో కూడా తప్పుకుపోడానికే ప్రయత్నం చేస్తాడని భావిస్తున్నా’ అని రాంబాబు విమర్శించారు. 

పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడు
‘ఎన్టీఆర్‌ను అందరూ సమిష్టిగా వెన్నుపోటు పొడిచారు. పురందేశ్వరి కాంగ్రెస్‌ ఉన్నా, బీజేపీలో ఉన్నా ఆమె లక్ష్యం మరిదిని కాపాడడమే. టీడీపీ మొత్తాన్ని బీజేపీలో కలిపేస్తామని పురందేశ్వరి రాయబారానికి వెళ్లారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి ఇష్టారీతిన మాట్లాడితే కనీసం ఖండించడానికి కూడా మనసు రాలేదు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడంలో ప్రబుద్ధుడు దత్తపుత్రుడు. ఆయన ఎవరిని కాపాడటానికి పార్టీ పెట్టాడో తెలియదు. ఆయన పీకే కాదు.. కిరాయి కోటిగాడు (కేకే). కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఆయన మాట్లాడే మాటలతో టీడీపీ మరింతగా పతనమయ్యే పరిస్థితి వచ్చింది.  పవన్ పార్టీ జనసేన కాదు, బాబు సేన’ అంటూ అంబటి మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Embed widget