అన్వేషించండి

Pawan Kalyan : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్, ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక - పవన్ కల్యాణ్

Pawan Kalyan : పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక అని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు.

Pawan Kalyan : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తుందని పవన్‌ అన్నారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు పట్టభద్రులు మార్గదర్శకులు అన్నారు పవన్. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలు పట్టభద్రులు తమ ఓటుతో కనువిప్పు కలిగించారన్నారు. ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు సందిగ్ధంలో ఉన్నవారికి ఓ దారి చూపించారన్నారు. ఏపీని అధోగతిపాల్జేస్తున్న వైసీపీకి పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఏపీలో ఇలాంటి వ్యతిరేక ఫలితాలే ఉంటాయన్నారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.  ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 

టీడీపీతో జనసేన జతకడుతుందా?    

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై స్పష్టంగా కనపడే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా మూడు స్థానాలు గెలిచిన టీడీపీ హుషారుగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను చీలిపోకుండా చేయగలిగితే ప్రతిపక్షాలకు స్కోప్ ఉందనే నమ్మకం జనసేనకు వచ్చింది. పొత్తులపై అటు ఇటు ఆలోచిస్తున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు హుషారుగా జతకలిసే సమయం వచ్చింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉన్నా.. పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తామని ఇదివరకే చాలాసార్లు చెప్పింది. దమ్ముంటే ఒంటరిగా రండి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పండి అంటూ సవాళ్లు విసురుతున్నారు వైసీపీ నేతలు. వారు రెచ్చగొట్టినా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం విడివిడిగా ఎన్నిసీట్లలో పోటీ చేస్తామనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. బీజేపీ ఇంకా జనసేనతో పొత్తులోనే ఉన్నామంటోంది. జనసేనతో కలిపి అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, విజయం సాధిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. వారి సత్తా ఏంటో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయింది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత మాధవ్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. సో ఇక మిగిలింది టీడీపీ, జనసేన. జనసేనకు ఇప్పటికే బీజేపీ సత్తా ఏంటో ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ప్రతి ఉపఎన్నిక విషయంలో కూడా బీజేపీ తమ పంతమే నెగ్గించుకుంది కానీ పవన్ మాట వినలేదు. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా కూడా వద్దని వారించారు బీజేపీ నేతలు. ఇటీవల ఆవిర్భావ సభలో కూడా ఇవే విషయాలు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు పవన్. సో.. ఆయనకు టీడీపీతో కలిసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమనే చెప్పాలి.

జనసేనానికి టీడీపీతో కలవాలని ఉన్నా.. జనసైనికులకు మాత్రం ఎక్కడో కాస్త సంశయం ఉంది. టీడీపీతో కలిసి వెళ్తే లాభమా, టీడీపీతో ఉంటే పోటీచేసే సీట్ల విషయంలో కోతపడుతుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ పవన్ మాత్రం మొదటి నుంచీ ఒకేమాట చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తే విజయం మనదేనంటున్నారు. జనసేనకు నష్టం లేకుండా పొత్తుల గురించి ఆలోచిస్తామంటున్నారు. ఇప్పుడు టీడీపీ విజయం జనసేనలో కూడా హుషారుని తెప్పించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBI Entry In Telangana: తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు లైన్ క్లియర్
తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు లైన్ క్లియర్
Sudan Landslide: సూడాన్‌లో తీవ్ర విషాదం, కొండ చరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి, బతికింది ఒక్కడే
సూడాన్‌లో తీవ్ర విషాదం, కొండ చరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి
KCR and Harish Rao Get Relief: కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట.. చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, సీబీఐ విచారణకు బ్రేక్!
కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట.. చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, సీబీఐ విచారణకు బ్రేక్!
Pookie Title Controversy: బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
Advertisement

వీడియోలు

Loss to BCCI | కేంద్రం డెసిషన్‌తో ఇండియన్ క్రికెట్‌కి 7వేల కోట్ల నష్టం
Sanju Samson vs Gambhir | కేసీఎల్‌లో పరుగులు సునామీ సృష్టిస్తున్న సంజూ శాంసన్
Dark Matter Dark Energy Explained in Telugu | శాస్త్రవేత్తలకు నేటికి అంతుచిక్కని ఈ చీకటి పదార్థాలు ఏంటి.? | ABP Desam
Kavitha Sensational Comments on Harish Rao | ట్రబుల్ లో ట్రబుల్ షూటర్..గురి పెట్టిన పేల్చిన కవిత
MLC Kavitha Sensational Comments | హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI Entry In Telangana: తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు లైన్ క్లియర్
తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు లైన్ క్లియర్
Sudan Landslide: సూడాన్‌లో తీవ్ర విషాదం, కొండ చరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి, బతికింది ఒక్కడే
సూడాన్‌లో తీవ్ర విషాదం, కొండ చరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి
KCR and Harish Rao Get Relief: కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట.. చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, సీబీఐ విచారణకు బ్రేక్!
కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట.. చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, సీబీఐ విచారణకు బ్రేక్!
Pookie Title Controversy: బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
బూతు బూతు... తెలుగులో మీనింగ్ చూడరా? ఆ టైటిల్ ఏంటి?
Weight Loss : వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుని 143 నుంచి 74 కిలోలు తగ్గిన మహిళ.. ఇండియాలో ఈ సర్జరీ కాస్ట్ ఎంతంటే
వెయిట్ లాస్ సర్జరీ చేయించుకుని 143 నుంచి 74 కిలోలు తగ్గిన మహిళ.. ఇండియాలో ఈ సర్జరీ కాస్ట్ ఎంతంటే
Ashu Reddy Pawan Kalyan Tattoo: అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ పేరు చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
అషు రెడ్డి ఒంటిపై పచ్చబొట్టు... పవన్ పేరు చూపించిన బిగ్ బాస్ బ్యూటీ
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్
ఏపీలో విజిలెన్స్ దాడులు- 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వాధీనం, 191 కేసులు నమోదు
విజిలెన్స్ దాడులు- 2,845 మెట్రిక్ టన్నుల ఎరువులు స్వాధీనం, 191 కేసులు నమోదు
Embed widget