By: ABP Desam | Updated at : 16 Feb 2023 09:48 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పవన్ కల్యాణ్
Pawan Kalyan On KGH Incident : విశాఖ కేజీహెచ్ నుంచి చిన్నారి మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన సంచలనం అయింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని సీఎం... విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కన్న బిడ్డ మృతదేహాన్ని తీసుకుని 120 కిలోమీటర్లు స్కూటీపై వెళ్లిన ఆ దంపతులకు సీఎం జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాడేరు ప్రాంతంలోని కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతుల తమ బిడ్డ చనిపోయిందన్న దుఃఖాన్ని దిగమింగి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లటం చూసి ఎవరికైనా గుండె బరువెక్కుతుందన్నారు. కానీ రాతి గుండె కలిగిన వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్లో గిరిజనులకు సాయం అందించేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఈ అమానవీయ ఘటన జరిగిందన్నారు.
డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే చాలదు
రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై ప్రభుత్వ అశ్రద్ధకు ఈ ఘటన నిదర్శనం అని పవన్ కల్యాణ్ అన్నారు. కొన్ని నెలల క్రితం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడిన కష్టాన్ని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. అలాగే మచిలీపట్నం బీచ్ లో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకెళ్లారని తెలిపారు. మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని పవన్ ప్రశ్నించారు. బెంజిసర్కిల్లో అంబులెన్స్లు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసుకుని జెండా ఊపితే చాలదని పవన్ అన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని గొప్పలు చెప్పుకోవడం మాని, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆ సేవలు అందేలా చేయాలన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మాయ మాటలతో ప్రజలను మోసం చేయడమా అని పవన్ మండిపడ్డారు.
మా నిర్లక్ష్యం లేదంటున్న కేజీహెచ్ వైద్యులు
బైక్ పై చిన్నారి మృతదేహం తరలింపు ఘటనపై విశాఖ కేజీహెచ్ వైద్యులు వివరణ ఇచ్చారు. పాడేరు చెందిన దంపతులు చిన్నారి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడానికి సుమారు అరగంట సమయం పట్టిందన్నారు. గురువారం ఉదయం గం.7.50 లకు శిశువు చనిపోతే గం.8.30లకు తల్లిదండ్రులకు అప్పగించారు. వెంటనే గం.8.40లకు ఆసుపత్రిలోని ట్రైబల్ సెల్ వారికి కాల్ చేసి విషయం తెలియజేశామన్నారు. వారికి గం.9.15 లకు అంబులెన్స్ ఏర్పాటు చేశామని, ఈ లోపల గం.8.57లకు తల్లిదండ్రులు వినకుండా శిశువు మృతదేహాంతో ఆసుపత్రి నుంచి బయలుదేరిపోయారన్నారు. అయినప్పటికీ పాడేరులోని అధికారులకు విషయం తెలియజేసి, వైద్య సిబ్బందితో వారి ఆచూకీ కనుక్కొని అక్కడకు అంబులెన్స్ పంపామన్నారు. పాడేరు నుంచి వారి స్వగ్రామం కుమడకు అంబులెన్స్ లో వారిని పంపించామన్నారు. ఈ సంఘటన పూర్తిగా దురదృష్టకరమని, ఇందులో కేజీహెచ్ తరఫున ఎటువంటి నిర్లక్ష్యం లేదన్నారు. గిరిజన దంపతులకు అవగాహన లేకపోవటం వల్ల అంబులెన్స్ వచ్చే 15 నిమిషాల ముందే స్కూటీపై చిన్నారి మృతదేహం తీసుకెళ్లారని వైద్యాధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!
ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు
Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్