అన్వేషించండి

TDP Mahanadu : మహానాడు నిర్వహణకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది-చంద్రబాబు ఫైర్

TDP Mahanadu : మహానాడు నిర్వహణకు ముందు నుంచి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. అయినా ప్రజల మద్దతు, పార్టీ కార్యకర్తలతో మహానాడు సక్సెస్ చేస్తాని ధీమా వ్యక్తం చేశారు.

TDP Mahanadu : 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించేలా మహానాడు నిర్వహించ‌నున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం పంపుతున్నామ‌ని అన్నారు. రెండో రోజు అదే ప్రాగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామ‌ని ఆయ‌న వెల్లడించారు. మహానాడు నిర్వహణకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పండుగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. 40 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని చెప్పారు. ఇదే సమయంలో భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్దేశం చేసేలా కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడుకు ఉండబోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

27,28 తేదీల్లో మహానాడు 

ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించారు. ఆయా కమిటీల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు వివరించారు. రెండో రోజు జరిగే బహిరంగ సభను లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.

మహానాడుకు అడ్డంకులు! 

ఒంగోలులో మహానాడు ఏర్పాటు నిర్ణయం తీసుకున్న రోజు నుంచీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొదట ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం, తరువాత కూడా పలు అడ్డంకులు సృష్టిస్తుందని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మహానాడుకు వాహనాలు సమకూర్చుకునే విషయంలో రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని నేతలు చెప్పారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కావొచ్చు, ప్రభుత్వంలోని వ్యక్తులు కావొచ్చు వీటికి భవిష్యత్ లో మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని ఆయన అన్నారు. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ ఈ సారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. మహానాడుకు సౌకర్యాలు, వేదిక నిర్మాణం, భోజన, వసతి  కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి దర్పణం అని చంద్రబాబు అన్నారు. తన రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదన్నారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇకపోతే మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసే ప‌నిలో ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget