News
News
X

AP Phone Tapping : అధికార పార్టీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, రంగంలోకి హోంశాఖ!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సాధించింది. ఎమ్మెల్యే కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. 

FOLLOW US: 
Share:

అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పటికే ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ అంశం పెద్ద ఎత్తున వివాదానికి దారి తీయడంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా విచారణ చెయ్యాలని జగన్ సర్కార్ భావిస్తుంది. దీంతో హోం శాఖ అధికారులు సచివాలయంలో ఈ వ్యవహరంపై అంతర్గంగా సమావేశం అయ్యారు. కోటంరెడ్డి చేసిన ఆరోపణలు, బయటకి వచ్చిన ఆడియో టేపుల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అటు పార్టీ పరంగా కోటంరెడ్డికి కౌంటర్ అటాక్ ఇవ్వడంతో పాటు, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై కూడా అధికార యంత్రాంగంతో కూడా విచారణ చేయించడం ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తుంది.

అవసరమైతే థర్డ్ పార్టీ విచారణ:

అటు ప్రభుత్వాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దలతో పాటు అటు అధికార యంత్రాంగంతో ఆరాతీయించే పనిలో ఉన్నారు. కోటంరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు పరిశీలించడంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోలు కూడా క్షుణ్నంగా పరిశీలించి, ఫోన్ ట్యాపింగ్ పేరుతో  ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీలో చేరతానంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ రికార్డింగ్ లు బయటికి రావడంతో కుట్రలో భాగమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. విచారణలో థర్డ్ పార్టీతో ఎంకైరీ  చెయ్యించాలని, అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ చెయ్యించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇవి అన్నిసాధ్యం కానీ పక్షంలో కేంద్ర ప్రభుత్వంలో పదవీ విమరణ చేసిన అధికారులతో నైనా ఈ విషయంపై అంతర్గతంగా విచారణ చేయిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని కుట్రలో ఎవరి భాగం ఎంత అన్నది కూడా తెలుస్తుందని సర్కార్ సీరియస్ గా పరిశీలిస్తుంది.

సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజు రోజు కు కోటంరెడ్డి దూకుడు పెంచడంతో సీఎంవో నుంచి కూడా ఈ అంశంపై ఆరాతీస్తున్నారు. మంత్రులతో పాటు కేంద్ర పార్టీ కార్యాలయం వేదికగా నేతలతో సీఎంవో అధికారులు మాట్లాడడంతో పాటు పోలీస్, నిఘా వర్గాల నుంచి కూడా సీఎంవో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా గా కోటంరెడ్డి ఐఏఎస్ అధికారులను  కూడా ఇన్వాల్వ్ చెయ్యడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేస్తుంది.

Published at : 01 Feb 2023 02:28 PM (IST) Tags: YSRCP AP News AP Politics Kotamreddy TDP ap updates PHONE TAPING

సంబంధిత కథనాలు

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న

వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

Rajahmundry Bridge : రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి మరమ్మత్తులు, వాహన రాకపోకలు నిలిపివేత

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

MP R Krishnaiah :  ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?