అన్వేషించండి

Tenali Politics : తెనాలిలో వెనక్కి తగ్గని ఆలపాటి రాజా - పాదయాత్ర ! జనసేనతో చిక్కులు తప్పవా ?

Tenali Seat : తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం ఉన్నా టీడీపీ నేత ఆలపాటి రాజా పాదయాత్ర చేస్తున్నారు. దీంతో ఈ సీటుపై రెండు పార్టీల్లో వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

Alapati Raja :  టీడీపీ, జనసేన మధ్య పొత్తులో  మొదటగా తెనాలి  సీటును టీడీపీ వదులుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ నెంబర్ టు నాదెండ్ల మనోహర్  నియోజకవర్గం అదే. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి 30 వేల ఓట్ల వరకూ తెచ్చుకున్నారు. కానీ అక్కడ టీడీపీ బలంగా ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని పని చేసుకుంటున్నారు. ఆయన సీటును త్యాగం చేయడనికి సిద్ధంగా లేరు. 

నాదెండ్ల తెనాలి అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్                        

తెనాలిలో జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు ఆరు నెలల క్రితమే ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు.టిడిపి టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ సిద్ధమవుతున్నట్టు ప్రచార ం జరుగుతోంది.  టిడిపి నుంచి ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుపై ఎలాంటి ప్రకటన రాకపోయినా నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉండటం, ఆలపాటికి ప్రత్యామ్నాయం గురించి టిడిపి అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఆలపాటి గ్రూపు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తూ ప్రతిపక్షంలో చురుకైనపాత్ర పోషిస్తున్నా ప్రాతినిధ్యం కల్పించకపోతే ఎలాగని టిడిపి శ్రేణులు అంటున్నాయి. 
 
అనుచరులతో వరుస సమావేశాలు                  

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ గత మూడు రోజులుగా వరుసగా అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.    తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటికి ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని వారికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సర్ది చెప్పారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని చెప్పారు.  తర్వాత తెనాలిలో టిడిపి కార్యకర్తలతో రాజేంద్రప్రసాద్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నాదెండ్ల మనోహర్ కు కేటాయించవద్దని డిమాండ్ డిమాండ్ 

తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న ఇరు పార్టీలు                  

టిడిపి నిర్వహించిన సర్వేలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గెలుపు అవకాశాలున్నాయని నివేదికలొచ్చినట్లు చెబుతున్నారు. అయితే జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తరువాత అన్ని తానై చూస్తూ నంబరు-2గా పేరొందిన నాదెండ్ల మనోహర్‌కే ఆదిలోనే సమస్యలు ప్రారంభం అయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుపై ఎన్నికలకు ముందుగానే అంతర్గత కలహాలు పెరుగుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా చోటుచేసుకుంటాయోనే ఉత్కంఠ నెలకొంది.                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget