అన్వేషించండి

Srikakulam Victory Rally : టెక్కలిలో యువగళం విజయోత్సవ ర్యాలీ - పసుపుమయం చేసిన అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు

Tekkali : టెక్కలిలో భారీగా యువగళం విజయోత్సవ ర్యాలీని అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. ఆరు కిలోమీటర్ల మేర టీడీపీ క్యాడర్ వాహనాలతో ర్యాలీ సాగింది.

Yuvagalam Victory Rally : యువగళం విజయోత్సవ ర్యాలీని టెక్కలిలో అచ్చెన్నాయుడు,  రామ్మోహన్ నాయుడు  భారీగా నిర్వహించారు.  టెక్కలి నవ శకానికి నాంది పలకాలని..ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్న పిలుపుతో సాగిన ర్యాలీలోఅచ్చెన్నతోపాటు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ముందు కదలగా.. వెనుకగా వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాగారు. 10వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ సాగింది. కోటబొమ్మాళిలో బయల్దేరి కొత్తమ్మ తల్లి  అమ్మవారిని దర్శించుకుని బయల్దేరారు. ఈ ర్యాలీ విజయవంతం కావడంతో మరోసారి అచ్చెన్న తన అడ్డాలో బల నిరూపణ చేసుకున్నారు. 

కళ్లు తిరిగిపోయే ర్యాలీ నిర్వహించిన బాబాయ్ , అబ్బాయిలు

ఆరు కిలోమీటర్ల పొడవు ఉన్న వాహన శ్రేణితో  అచ్చెన్న, రామ్మోహన్ లు శ్రేణులను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగారు. దీంతో కార్యకర్తలు, అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.  సుమారుగా 6 కిలోమీటర్ల మేర పసుపు మయమైంది. ఈ సందర్భంగా  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ పని అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జన సేనలతో ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం చేశారు. నమ్మించి వంచించడం జగన్న్కెజమని, అతని సొంత ప్రయోజనం కోసం ఎవరిన్కెనా బలి చేస్తాడని మండిపడ్డారు.  సొంత  తల్లికి, చెల్లికీ ద్రోహం చేశాడన్నారు. నమ్మిన ఎమ్మెల్యేలను.. నమ్మి ఓట్లేసిన ప్రజలను,ఉద్యోగులను.. చివరికి సొంత వాలంటీర్లకు సైతం ద్రోహం చేశాడని ఆరోపించారు. రాబోయేఎన్నికలు వైసీపీకి, రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్నాయనిటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. 

సైకో జగన్ పనైపోయింది ! 

సైకో జగన్ పనైపోయిందని  అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా తెలుగుదేశం - జనసేన ప్రభుత్వఏర్పాటు ఖాయమన్నారు.  యువగళం-నవశకం సభ ద్వారా ప్రజా చైతన్యంవెల్లువిరిసిందన్నారు. అధికారం మార్పు ఎప్పుడెప్పుడా అని ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నారని ఉద్ఘాటించారు. నారా లోకేశ్ యువగళం నవశకం సభ జరగకుండాచేయాలని సీఎం జగన్ అనేక ఇబ్బందులు పెట్టాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది  మంది ప్రజలు తరలి వచ్చి సభను విజయవంతం చేశారని అన్నారు. ఎన్నికలకు ఇంకా వందరోజుల సమయం మాత్రమే ఉందని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు ప్రతి నిమిషంఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి నిమిషం కష్టపడి పనిచేసి రాష్ట్రంలో తెలుగుదేశంజనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు.  

వంద రోజులు శ్రమిస్తే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు !   

ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కొనసాగిస్తే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించు కొని సైకోను తరిమితరిమి కొట్టబోతు న్నాం. 100రోజుల్లో దళితులు.. ఆడబిడ్డల పై జరుగుతున్న అన్యాయాలు.. అఘా యిత్యాలను కట్టడి చేయబోతున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.  100 రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవ కాశాలు కల్పించబోతున్నామన్నారు. . 100 రోజు ల్లో రైతుల ముఖాల్లో ఆనందం నింపి, వారిని రారాజుల్ని చేయబోతున్నాం. 100 రోజుల్లో బడుగుబలహీన వర్గాల్ని పైకి తీసుకురాబోతున్నాం. 100 రోజుల్లో పోల వరం పూర్తిచేయడానికి శంఖారావం ఊద బోతున్నాం.. 100 రోజుల్లో మన రాష్ట్ర రాజధాని ఇదని గర్వంగా చెప్పుకోబోతు న్నామని తెలిపారు.   క్రమ శిక్షణతో, కలిసికట్టుగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమై నా ఇబ్బంది కలిగినా.. తప్పు జరిగిందని అనిపించినా పెద్దమనస్సుతో పెద్దమనుషుల్లా క్షమించి, ఇది మన కార్యక్రమం అనుకొని సర్దుకుపోవాలని కోరారు.  

టాప్ హెడ్ లైన్స్

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget