అన్వేషించండి

Amaravati Supreme Court : ఏపీ రాజధానిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ - ప్రభుత్వం నమ్మకంగా ఉందా ?

ఏపీ రాజధానిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని తరలింపునకు అనుమతి లభిస్తుందని సుప్రీంకోర్టు నమ్మకంతో ఉంది.

Amaravati Supreme Court :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన పటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు గతేడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో నిర్ణీత కాలంలోపు రాజధానిని నిర్మించాలన్న ఆదేశాలపై స్టే విధించింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే నిరాకరించింది. జనవరి 31న అన్ని అంశాలను విచారిస్తామని స్పష్టం చేసింది. ప్రతీవాదులందరికీ నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదించింది. 

ప్రతివాదులకు ఇటీవలే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు పలువురు అధికారులు మొత్తం 261 మందికి  ఈ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. ఈ ప్రతివాదుల వాదలను సుప్రీంకోర్టు విననుంది. కేంద్ర ప్రభుత్వంకూడా అమరావతి విషయంలో తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది. మరో వైపు  ఏపీ రాజధాని అంశం పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు. వస్తాన్ వలీ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి రాజధాని కేసును కూడా సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.  
  
మరో వైపు ప్రభుత్వం , మంత్రులు మాత్రం సుప్రీంకోర్టులో విచారణ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తున్నామన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సబ్ జ్యూడిస్ అవుతుదని తెలిసినా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ  ..  ప్రతీ వారం ఓ మంత్రి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ ను తరలిస్తామని చెబుతున్నరు. ముందుగా ఎం క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాకుండా.. వివిదశాఖల కార్యాలాయలను కూడా తరలిస్తామని చెబుతున్నారు. మరో వైపు రైతులు అమరావతి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని రైతులు ధీమాగా ఉన్నారు. అందుకే మంగళవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణ ఏపీరాజధాని విషయంలో కీలకం కానుంది. 

అయితే ప్రతి వాదులు వందల్లో ఉండటంతో వారి వాదనలు వినాలంటే.. ఎక్కువ సమయం పడుతుందని అందుకే.. మంగళవారం విచారణలో కీలకమైన నిర్ణయాలేమీ .. సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం...విచారణ కొనసాగించినా పర్వాలేదని.. కానీ కార్యాలయాల తరలింపుపై మాత్రం స్టే ఎత్తివేస్తే చాలని కోరుకుంటోంది.   ీఈ అంశంపైనే  ప్రభుత్వ లాయర్  ప్రధానంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. యాధృచ్చికంగా అయినా ముఖ్యమంత్రి జగన్ ఈ వాదనలు జరుగుతున్న సమయంలో ఢిల్లీలోనే ఉండనున్నారు.               

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget