Corona Update: ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు.
ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృ కొవిడ్తో మరో ముగ్గురు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నుంచి మరో 162 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 35,071 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 20,72,376 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మెుత్తం 14,471 మంది మరణించారు.
#COVIDUpdates: 15/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,72,376 పాజిటివ్ కేసు లకు గాను
*20,56,084 మంది డిశ్చార్జ్ కాగా
*14,471 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,821#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/CG4JxVWcS1
దేశంలో కేసులు
దేశంలో కొత్తగా 6,984 కోరనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,10,628కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,562కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- కొత్త కేసులు: 6,984
- మొత్తం రికవరీలు: 8,168
- కొత్త మరణాలు: 247
మొత్తం మరణాల సంఖ్య 4,76,135కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది. తాజాగా తెలంగాణలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని డీహెచ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించారు. బాధితుడిని నేరుగా టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
Also Read: Tirupati: పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets