అన్వేషించండి

BRS MLA: ఆందోళన చెందవద్దు, రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

MLA BajiReddy Goverdhan: ఇది ప్రకృతి వైపరీత్యం. ఇలా జరగడం బాధాకరం... రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Baji Reddy Goverdhan: - ఆందోళన చెందకండి... కేసీఆర్‌ ఎకరాకు పదివేల పరిహారం ఇస్తున్నారు
- ఇది ప్రకృతి వైపరీత్యం.. అకాల వర్షాలతో పంట నష్టం చాలా బాధాకరం
- తడిచిన ధాన్యాన్ని కొనమని పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ఆదేశాలిచ్చాం
- ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా

నోటికాడికి వచ్చిన పంట వర్షార్పణం కావడం పట్ల సీఎం కేసీఆర్, మేము చాలా బాధ పడుతున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం. ఇలా జరగడం బాధాకరం... రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. వడగళ్ల వానలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల పరిహారం అందిస్తుందని, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండానే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పరిహారాన్ని ఇప్పటికే ఇప్పించి ఉన్నారని, త్వరలో రూరల్ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు అందుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రూరల్ నియోజకవర్గం లో ఏడు మండలాల పరిధిలో 6వేల ఎకరాల పంట నష్టం జరిగిందని, వెంటనే దీనికి పరిహారం ఇప్పిస్తామని అన్నారు. తడిచిన ధాన్యం కొనుకోలు చేయాలని పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు ఆదేశాలిచ్చామని, దీనికోసం ట్రాన్స్పోర్ట్, గన్నీ బ్యాగుల ఏర్పాటు కూడా చేశామన్నారు. ప్రతిసారి ఇదే విధంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ గమనించారని, అందుకే ఇకపై యాసంగి పంటలు మార్చి నెలాఖరులోగా కోతలకు వచ్చేలా నాట్లు తొందరగా వేసుకునేలా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారన్నారు. ఈ మేరకు వ్యవసాయాధికారులు కూడా ప్రతి ఏడాది మాదిరిగా కాకుండా ఓ నెల ముందు నుంచే విత్తనాలు, నాట్లు వేసుకోవడం వల్ల పంట మార్చి నెలాఖరు వరకు చేతికొస్తుందని, ఆ తర్వాత వచ్చే అకాల వర్షాలతో రైతు నష్టపోడని సూచించారు. 

తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడతామని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని.. రైతు నష్టపోకుండా చూస్తాడని, వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించి రైతును రాజు చేయడమే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌ పాలన యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. రైతులెవ్వరూ దిగులు చెందొద్దని ఆయన కోరారు.

మే 3 వరకు తెలంగాణలో వర్షాలు 
తెలంగాణలో మే మూడో తేదీ వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి చల్లని వాతావరణమే ఉంటుందంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్‌, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మె7దక్‌, కామారెడ్డిలో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ఇవాళ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఎల్లో అలర్ట్ ఇచ్చిన జిల్లాలు సూర్యపేట, మహబూబ్‌నగర్‌, యాదాద్రి భవనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్‌లో ఇదే పరిస్థితి ఇవాళ రేపు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget