అన్వేషించండి

రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలా? మండిపడుతోన్న ఏపీ బీజేపి

పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపి నేతలు తలపెట్టిన ఆందోళనకు పోలీసులు అడుగడుగునా బ్రేక్‌లు వేశారు. కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు నేతలను అడ్డుకున్నారు.


కేంద్రం నిధులు ఇస్తే వైసీపీ నేతలు తమ ఫోటోలు వేసుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపి నేతలు మరోసారి మండిపడ్డారు. వైసీపీ చర్యలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

పశ్చిమలో బీజేపి ఆందోళనలు...

పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపి నేతలు తలపెట్టిన ఆందోళనకు పోలీసులు అడుగడుగునా బ్రేక్‌లు వేశారు. కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బిజెపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీని వల్ల కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పాస్ పుస్తకాలపై మీ బొమ్మలేంటి అంటూ బిజెపి శ్రేణులు నినాదాలు చేశారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. భీమవరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

రైతు వ్యతిరేక వైఖరితో ధాన్యం కొనుగోలు చేయకుండా, ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు సోమువీర్రాజు. తేమ ఉందని ధాన్యం కొనుగోలు చేయకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తోందని, సివిల్ సప్లై కమిటీ ఛైర్మన్‌గా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే తండ్రిని నియమించడం దారుణమని కామెంట్‌ చేశారు. వైసీపీ మిల్లర్ల ప్రభుత్వం, తక్షణం సివిల్ సప్లై కమిటీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేసి తొలగించాలని డిమాండ్ చేశారు. పాసుబుక్‌లపై సీఎం జగన్ ఫోటో పెట్టడం పనికి మాలిన ఆలోచన అని వ్యాఖ్యానించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయని ఫైర్ అయ్యారు.

మాండౌస్ తుపాన్ ప్రాంత రైతులను ఆదుకోవాలి 

అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలలోని రైతులకు మాండౌస్ తుపాన్ తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని బీజేపి ప్రదాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి  అన్నారు. చేతికందిన పంట తుపాన్ ధాటికి నీట మునిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పంట నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. సంబంధిత జిల్లాల మంత్రులతో, ఇంఛార్జి మంత్రులతో, వ్యవసాయ అధికారులతో పంట నష్టపరిహారానికి సంబంధించిన కమిటీని వెంటనే వేయాలని, కమిటీ వెంటనే ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, రైతులకు, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు.

ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, కోతలు పూర్తి చేసుకుని ఆరబోసిన ధాన్యం భీకరమైన వర్షాలకు తడిసి మొలకలొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నారు. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి వంటి ఉద్యాన పంటలలో చెట్లు నేలకొరిగాయని తెలిపారు. కంది, మిరప, టమాటా వంటి వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. మొత్తంమీద లక్షన్నర ఎకరాలలో వివిధ రకాల పంటలను నష్టపోయారని,నష్టపరిహారాన్ని వీలయినంత త్వరగా అందించి బాధితులను ఆదుకోవాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Advertisement

వీడియోలు

WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Maoist Commander Hidma Encounter in AP  | ఏపీలో భారీ ఎన్‌కౌంటర్ | ABP Desam
KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్  సంచలన కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
Supritha Naidu: అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
Puttaparthi Sathya Sai Baba: పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
పుట్టపర్తిలో సెలబ్రిటీల సందడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్యరాయ్ ఫొటోలు చూశారా
Embed widget