Ind vs NZ 3rd T20 Highlights | టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
న్యూజిలాండ్ పై టీమిండియా టీ20 ( India vs New Zealand ) సిరీస్ కైవసం చేసుకుంది. మూడవ T20 మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మరో 10 ఓవర్లు ఉండగానే టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలవడంతో 3-0తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్. మరో 2 టీ20లు ఉండగానే భారత్ సిరీస్ నెగ్గడం విశేషం.
చేజింగ్ కు దిగిన భారత్ కు తోలి బాల్ కె ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ( Sanju Samson ) డకౌట్ అయ్యాడు. వన్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) 13 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
కివీస్ టాప్ ఆర్డర్ను పవర్ప్లేలోనే భారత్ దెబ్బకొట్టింది. హర్షిత్ రాణా ( Harshit Rana ) తొలి ఓవర్లోనే కాన్వేను అవుట్ చేయగా, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్ నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది కివీస్ జట్టు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా, బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.























