తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం పరిధిలోని నిరుపయోగంగా ఉన్న ఆవ భూములను పేదలకు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారని కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన అడపా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు భూముల పంపిణీపై స్టేటస్కో ఇచ్చింది. ఆ భూములను యథా స్థానంలోనే ఉంచాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పేదలకు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములు అత్యంత లోతట్టు ప్రాంతం ఉన్నాయని, ఇక్కడ సరుగుడు మొక్కలకు తప్ప ఎందుకు పనికిరాని భూములని అడపా శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తాజాగా ఆయన నీట మునిగిన ఆవ భూముల వద్ద నిలబడి ఓ వీడియో చేశారు. తనపై ఆరోపణలు చేసినవాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు వచ్చి సమాధానం చెప్తారో అని ప్రశ్నించారు.
సీఎం జగన్ ఈ భూముల పంపిణీపై పునరాలోచించాలని కోరారు. రెండు సంవత్సరాల్లో నాలుగు సార్లు మునిగిపోయిన భూముల్లో ప్రజలు ఎలా నివాసం ఉండాలన్నారు. ఆవ భూములు 573 ఎకరాలు సేకరించిన ఈ భూములు రూ.7.25 లక్షలు ధర పలుకుతున్న భూమిని ఏకంగా రూ.40 లక్షలకు పైబడి కొనుగోలు చేశారని శ్రీనివాసరావు ఆరోపించారు. గోదావరి ఉద్ధృతి పెరిగినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ భూములు పూర్తిగా మునిగి పోయే పరిస్థితి ఉందన్నారు.
Earth Inner Core Slowing Down : భూమి ఇన్నర్ కోర్ లో ఈ మార్పులేంటీ..! | ABP Desam
200 Godavari food varities | గోదారోళ్ల మర్యాదలు మామూలుగా ఉండదు మరి
Nidadavole To Narasapuram Passenger Train | తక్కువ ధరలోనే సూపర్బ్ ట్రైన్ జర్నీ Vlog
Rajahmundry లో 45 ఏళ్లుగా బాబాయ్ చాట్ మసాలా | DNN | ABP Desam
MP Margani Bharath Interview: వైసీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి జరిగిందన్న ఎంపీ భరత్ | DNN| ABP Desam
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?