దేశం అడుగుతోంది: ఉత్తుత్తి పెట్రోల్ మంటలు.. అసలు సెగ జనం జేబులకే
చమురు ధరలను ఆకాశానికి తీసుకెళ్లి.. జనాలకు చుక్కలు చూపించిన కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఓ నీటి చుక్కను రాల్చినట్లు.. కొంత తగ్గించి.. ఇక దీపావళి పండుగ చేసుకోమంది. సరే మంచికో.. చెడుకో.. ఆ కాస్తైనా తగ్గింది అదే భాగ్యమని కొన్ని జనాలు సరిపెట్టుకోగా.. కేంద్రం తగ్గించిన దానికి మరికొన్ని రాష్ట్రాలు మరికాస్త తగ్గించి.. ఉపశమనం కల్పించాయి. అయితే.. కేంద్రం కాస్త తగ్గించి దీపావళి పండుగ చేసుకోమంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పండుగ అయిపోయాక.. పెట్రో బాంబులు పేల్చుతున్నారు.. సీఎంలు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు బంకుకు వెళితే.. అక్కడ మీటరులో రీడింగ్ ఎలా పెరుగుతుందో.. దానిని చూసి సామాన్యడి పల్స్ రేటు కూడా అంతే పెరుగుతోంది. అసలు వారం రోజులు వచ్చే.. మొత్తం.. ఇప్పుడు మూడు రోజులకు పడిపోయింది. ఆఫీసులకు వెళ్లే వాళ్లు.. రోజువారీ వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఏమైపోతారు. అందరూ అడుగుతున్నారు..దేశం అడుగుతోంది.. 'ఏబీపీ దేశం' అడుగుతోంది..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets