అన్వేషించండి

Gadwal: డెలివరీ మధ్యలోనే వదిలేసిపోయిన డాక్టర్? ఆస్పత్రి ముందు బంధువుల రచ్చ

బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. కాన్పు కాకముందే డాక్టర్ నర్మద వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.

Jogulamba Gadwal News: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటేనే ఎక్కువ మంది ప్రజలకు ఓ రకమైన భయం ఉండే సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చయినా సరే మంచి వైద్యం అందుతుందనే నమ్మకంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. కానీ, అసలు డబ్బు పెట్టే స్తోమత లేని వారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం పొందుతూ ఉంటున్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో కూడా వైద్యులు చక్కని వైద్యాన్ని ఉచితంగా అందించి, మందులు కూడా ఫ్రీగానే ఇస్తుంటారు. కానీ, కొన్ని చోట్ల ఒక్కోసారి జరిగే తప్పిదాలు మొత్తం ప్రభుత్వ ఆస్పత్రులంటేనే భయపడే తప్పుడు సంకేతాలను ఇస్తున్నాయి. అలాంటిదే తాజాగా ఇంకో ఘటన జరిగింది.

ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సరైన వ్యవధిలో చికిత్స అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శిశువు చనిపోయింది. ఈ ఘటన ఆదివారం (నవంబరు 20) జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal District) జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన ఖలీఫా తొలి ప్రసవం కోసం ఈ నెల 16న జిల్లా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. నార్మల్ డెలివరీ (Normal Delivery) అయ్యేలా చూస్తామని డాక్టర్లు కుటుంబ సభ్యులతో చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో డాక్టర్ నర్మద, వైద్య సిబ్బంది ప్రసవం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. 

ఈ క్రమంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి కాన్పు కాకముందే వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందువల్లే పసికందు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో బంధువులంతా కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో డాక్టర్ నర్మద బంధువులకు సమాధానం ఇచ్చారు. శిశువు ఉమ్మ నీరు తాగిందని చెప్పారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆపరేషన్‌ చేయాలని చెప్పినా కుటుంబ సభ్యులు వినిపించుకోలేదని చెప్పారు. కాన్పు కాకముందే తాను వెళ్లిపోయానని కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. 

తన డ్యూటీ సమయం అయిపోయినా సరే, డెలివరీ కోసం తాను విధులు నిర్వహించానని చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ (Jogulamba District Collector) వల్లూరి క్రాంతి కూడా జోక్యం చేసుకున్నారు. పసికందు మృతిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్‌ తెలిపారు. విచారణలో డాక్టర్ల తప్పు ఉందని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజలకు మంచి చికిత్స అందించడం ప్రభుత్వం లక్ష్యం అని, అందుకు అనుగుణంగా డాక్టర్లు పని చేయాలని నిర్దేశించారు. 

గతంలోనూ ఈ డాక్టర్ డాక్టర్‌ నర్మద ఓసారి వైద్య తప్పిదం జరిగిన ఘటనలో కొన్నాళ్లు సస్పెండ్ అయినట్లు సమాచారం. థరూర్‌ మండలం (Tharur Mandal) జాంపల్లికి చెందిన ఓ గర్భిణికి డెలివరీ చేసే సమయంలో నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి (Baby Death) చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. దీంతో అప్పటి కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget