అన్వేషించండి

YS Sharmila: వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే ఆ ఫైలుపైనే తొలి సంతకం - వైఎస్ షర్మిల

YS Sharmila Praja Prasthanam Padayatra: రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ఉద్యోగాలు, సున్నా వడ్డీకే రుణాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, పోడు పట్టాల పంపిణీ జరగలేదని కేసీఆర్ పాలపై షర్మిల విమర్శలు గుప్పించారు.

YS Sharmila Praja Prasthanam Padayatra వరంగల్ : బంగారు పళ్ళెంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే 9 ఏళ్లలో 4.80 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టారని.. ఇన్ని అప్పులు చేసి ఏ కుటుంబానికి న్యాయం చేయని సీఎం కేసీఆర్ 420 అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ద్వజమెత్తారు. దొర ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని.. లేకుంటే ఫామ్ హౌజ్ కి పరిమితం అవుతారని అన్నారు. కేసీఆర్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 231వ రోజు జనగాం జిల్లాలో కొనసాగింది. మధ్యాహ్నం 3.30గంటలకు స్టేషన్ ఘనపూర్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల ఘనపూర్ మండల పరిధిలోని చాగల్,శివారెడ్డి పల్లి, రాఘవపూర్, రఘునాథ్ పల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి, కొమ్మాల మీదుగా 12 కిలోమీటర్ల పాటు సాగింది.అడుగడుగునా వైఎస్ షర్మిల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందడం లేదని, తాము ఎలా బ్రతుకుతున్నమో కూడా పట్టించుకొనే వాళ్ళు లేరు అంటూ షర్మిల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. 

అధికారంలోకి వస్తే తొలి సంతకం అదే..
YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే ఉంటుందని.. ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తో పాటు, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి పూర్వ వైభవం తెస్తామని.. గతంలో వైఎస్సార్ అమలుచేసిన ప్రతి పథకం అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు. కొమ్మాల టోల్ గేట్ దాటిన అనంతరం నేడు రాత్రికి అక్కడే బస చేయనున్న షర్మిల.. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 10న రఘునాథ్ పల్లి, దాసన్నగుడెం, ఖిలా షాపూర్, మక్కలగట్టు మీదుగా జనగాం నియోజక వర్గంలో అడుగు పెట్టనున్నారు.

కేసీఆర్ మోసాల చిట్ట చదివితే తెల్లారుతుందని ఎద్దేవా..
రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ఉద్యోగాలు, సున్నా వడ్డీకే రుణాలు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, పోడు పట్టాల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసాల చిట్ట తెల్లారుతుందని షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీ కాక బ్యాంకుల వద్ద 16 లక్షల మంది రైతులు డీ ఫాల్టర్లు గా మారారని.. ఉద్యోగాలు అని చెప్పి 65 వేల ఉద్యోగాలు కూడా నింపలేక పోయారని.. దీంతో రాష్ట్రంలో 8 వేల మంది రైతులతో పాటు వందలాదిగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ గా మార్చారని.. అప్పుల తెలంగాణ - ఆత్మహత్యల తెలంగాణగా మారిందని అన్నారు. 
"ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. సీఎం కేసీఆర్ మళ్ళీ వచ్చి పిట్ట కథలు చెప్తాడు. ఇప్పుడు దళిత బంధు అని చెప్పి మోసం చేస్తున్నాడు. ఈ సారి బిసి బంధు అంటాడు. ఎస్టీ బంధు అంటాడు. ఆకాశంలో చందమామ కిందకు దించుత అంటాడు. మళ్ళీ మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మితే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. ఈ సారి కెసిఆర్ వస్తె కర్రు కాల్చి వాత పెట్టండి. మీకోసం పాటు పడే వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అవకాశం ఇవ్వండి " అని షర్మిల అన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget