అన్వేషించండి

Warangal Politics: వరంగల్‌లో కొత్త రాజకీయం - కత్తులు నూరిన నేతలే పార్టీ మారుతున్నారు!

Warangal Politics: ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య.. ఒకరు బీఆర్ఎస్ పార్టీని దూషించి వీడి తిరిగి అదే పార్టీలోకి వస్తున్నారు.

Kadiyam Srihari to join Congress and T Rajaiah ready join BRS: వరంగల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కత్తులు నూరిన నేతలే ఆ పార్టీలో చేరుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీపై దుమ్మెత్తి పోసిన నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేత తిరిగి అదే పార్టీలో చేరబోతున్నారు. వారిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. అంతకుమించి వీరిద్దరూ ఓకే నియోజకవర్గంలో 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు. 

ఒకరు కాంగ్రెస్‌పై, మరొకరు బీఆర్ఎస్‌పై విమర్శలు 
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఒకరు పార్టీని ముందు వీడితే. మరొకరు ఒక్కరోజు ముందు పార్టీకి దూరమయ్యారు. వీరిలో ఒకరైన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ప్రతినిత్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన తరువాత నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో, సంవత్సరంలో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ చర్చకు దారి తీశారు. ఇంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిపాలన విధానాలపై అసెంబ్లీలో తన మాటల దాడిని కొనసాగించారు. జనాల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా మారారు కడియం శ్రీహరి. కానీ తన శ్రేణులను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. 

బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కూతురు కడియం కావ్య ను పోటీ నుంచి తప్పించి కాంగ్రెస్ కడువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య రాకను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ ఇంఛార్జి సింగపురం ఇందిరా కడియం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి అనగదొక్కిన కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకోవద్దని ఇందిరా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వరంగల్ పార్లమెంట్ టికెట్ కడియం కుటుంబీకులకు ఇవ్వవద్దని బహిరంగంగానే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు.

బీఆర్ఎస్‌ను వీడుతూ సంచలన వ్యాఖ్యలు
ఇక మరో నేత తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్య నేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవడంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్లు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోకి రావడానికి పెద్దగా వ్యతిరేకత లేదని చెప్పవచ్చు. వరంగల్ పార్లమెంటు టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తప్ప తాటికొండ రాజయ్యను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు దీంతో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తుంది.

ఏది ఏమైనా ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఒకరు బీఆర్ఎస్ పార్టీని దూషించి వీడి తిరిగి అదే పార్టీలోకి వస్తున్నారు. మరొకరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ఓ రేంజ్ లో దూషించి.. అదే పార్టీలో చేరడానికి సిద్ధం కావడంతో వరంగల్ రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget