అన్వేషించండి

Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయ రగడ - ఇక కలగానే మిగులనుందా?

Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇరు పక్షాల వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. 

Warangal News: రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు బీఆర్ఎస్ నాయకులు. సౌత్​ సెంట్రల్ రైల్వేలోని కీలక జంక్షన్లలో ఒకటి కాజీపేట రైల్వే జంక్షన్. ఈ జంక్షన్​ కేంద్రంగా వరంగల్ లో ప్రస్తుతం రాజకీయ రగడ మొదలైంది. కొన్నేళ్ల క్రితం కాజీపేటకు మంజూరైన రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది. ఆ తరువాత వచ్చిన వ్యాగన్​ వీల్​ తయారీ కేంద్రం కూడా రాజకీయ కారణాలతో మరో చోటుకు తరలించారు. ప్రస్తుతం కాజీపేటకు పీవోహెచ్​ వర్క్ షాప్ మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి. కానీ పనులు మొదలు కావడంపై మాత్రం రాజకీయ కొట్లాట నడుస్తోంది. 


Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయ రగడ - ఇక కలగానే మిగులనుందా?

బీఆర్ఎస్ నేతల నిరసనల పర్వం..

కేంద్రంలోని బీజేపీ కాజీపేటకు కోచ్​ ఫ్యాక్టరీ కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు. విభజన హామీల్లోని కోచ్​ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని బీజేపీని ఎండగడుతున్నారు. కోచ్​ ఫ్యాక్టరీ పేరుతో స్థానిక బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కేంద్రం చెప్పిన విధివిధానాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోచ్​ ఫ్యాక్టరీ తరలిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కోచ్​ ఫ్యాక్టరీ, వ్యాగన్​ వీల్​ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రం దాటిపోగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్లతో మరో రైల్వే ప్రాజెక్టు పీవోహెచ్​ను కాజీపేటకు మంజూరు చేసింది. ఈ వర్క్​ షాపునైనా ప్రారంభిస్తే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రాజెక్టు మంజూరై ఆరేళ్లు గడుస్తున్నా వర్క్​ షాపు పనులు మాత్రం ఇంత వరకు పట్టాలెక్కలేదు. పీవోహెచ్ ఏర్పాటుకు 160 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా.. 158.17 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు మూడు విడతల్లో అప్పగించింది. మరో ఎకరానికి పైగా స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంది. రైల్వేశాఖకు అందించిన స్థలానికి రహదారి నుంచి దారి లేకపోవడంతోనే ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. అయితే దారి కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు యజమాని సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయ రగడ - ఇక కలగానే మిగులనుందా?

కోచ్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఎదురు దాడి

పీవోహెచ్​ పనులు ప్రారంభమైతే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ అడ్డుపడుతూ.. ఎప్పుడో తరలిపోయిన కోచ్​ ఫ్యాక్టరీ పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సైతం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో వరంగల్ ప్రజలు ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోచ్​ ఫ్యాక్టరీ నినాదం వదిలి యువతకు ఉపాధినిచ్చే పీవోహెచ్​ వర్క్​ షాపు పనులు ప్రారంభించి చిత్తశుద్ధి చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేని కోచ్​ ఫ్యాక్టరీ పేరుతో బీజేపీని ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే వినయ్​ భాస్కరే  పీవోహెచ్​ పనులకు అడ్డుపడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. పీవోహెచ్​ వర్క్​ షాపు దారి కోసం బడ్జెట్​ కూడా అందుబాటులో ఉంది. అవసరమైన స్థలాన్ని సేకరించి వర్క్​ షాపు ప్రారంభానికి వినయ్ భాస్కర్ బాటలు వేస్తారో.. లేదా ఉపాధినిచ్చే ప్రాజెక్టును రాజకీయ వివాదంలో చిక్కుకుని మరో చోటుకు తరలిపోతుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget