అన్వేషించండి

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

CLP Leader Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

CLP Leader Bhatti Vikramarka: వరంగల్ : తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కానీ ఆ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాడుకోవడానికి అవకాశం ఉన్న నది గోదావరి. ఈ గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న నీటిని దశాబ్దాలుగా కరువు ప్రాంతాలుగా ఉన్న జనగామ ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు తీసుకువని వచ్చి.. ఇక్కడ కరువుకాటకాలు లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్యగారు నీటిపారుదల శాఖామంత్రిగా తలపెట్టిన జలయగ్నంలో అతిముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం అన్నారు. 

దేవాదుల ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని రావాలని దశాబ్దా కాలం పాటు అనేకమంది నాయకులు పోరాటం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆనాటి ముఖ్యమంత్రులను కలిశారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చారు. అందులో నాటి ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు కూడా1984-85లో దరఖాస్తులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసి దరఖాస్తులు ఇచ్చిన వ్యక్తే తరువాత కాలంలో నీటిపారుద శాఖామంత్రిగా పనిచేసి ఈ ప్రాజెక్టును తీసుకురావడం పొన్నాల అదృష్టం అన్నారు భట్టి.
కబ్జా చేయడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం!
ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి జనగామ ప్రజల కంటే.. ఇక్కడ భూముల మీదే ప్రేమ ఉందని తనను కలిసిన ప్రతిఒక్కరూ చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం, బలవంతంగా రాపిచ్చుకోవడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం చేస్తున్నారు. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు అందించే ప్రాజెక్టు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కరువుకాటకాలతో అల్లాడిపోయే ప్రజానీకానికి నీళ్లు ఇచ్చే గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కట్టడం కూడా పూర్తిచేసింది. అందులో భాగంగా 5 లిఫ్ట్ పాయింట్లు పెట్టడంతో పాటు అదనంగా 6 రిజర్వాయర్లను కూడా నిర్మించడం పూర్తి చేసి అందులో నీళ్లను కూడా నింపాము. అందులో భాగంగానే పది చిన్నచిన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచి వాటిని నీళ్లతో నింపాం అన్నారు. 

పాత చెరువులైన భీమ్ లింగాపూర్, రామప్ప, సాలివాగు, నగరం, పులిగుర్తి, ధర్మసాగర్ చెరువులు పెంచడంతో పాటు.. పైన గండి రామారం, బొమ్మకూర్, తపాస్ పల్లి, జల్లగూడెం, చెట్టకోడూర్, అశ్వరావు పల్లి, ఘన్ పూర్ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గోదావరి, క్రిష్ణా బేసిన్ లను వేరు చేసేలా అత్యంత ఎత్తయిన ప్రదేశంలో తపాస్ పల్లివద్ద రిజర్వాయర్ కట్టాము. అక్కడనుంచి అన్ని ప్రాంతాలను నీటిని డిస్ట్రిబ్యూట్ చేసేలా డిజైన్ చేశాము. వీటన్నింటిని పూర్తి నీళ్లు ఇచ్చే సమయానికి ప్రత్యేక పోరాటం రావడం, విభజన జరగడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఈ కట్టిన ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కాలువులు కూడా తవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులా నిద్రపోతోంది. కట్టిన ప్రాజెక్టులకు కాలువలు తవ్వింటే ఈ రోజు లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చేదన్నారు భట్టి విక్రమార్క.

పెంచిన చెరువులకు ఉన్న కాలువులను పెంచినా అదనపు భూమి సాగులోకి వచ్చేది. వీటిని పట్టించుకోక ఈ ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేసింది. దాదాపు రూ. 9వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేశాము. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు నిండుకుండలా ప్రాజెక్టులను తెచ్చి పెడితే.. ఆ నీటిని పంచకుండా అడ్డుపడి ఈ ప్రభుత్వం అతిపెద్ద నేరం చేసింది. ఆదిలాబాద్ నుంచి చూస్తే ఇక్కడి వరకూ అనేక నేరాలను ఈ ప్రభుత్వం చేసింది. రాష్ట్రం తెచ్చుకున్న ఉద్దేశం నెరవేరకుండా.. కరవు కాటకాలతో అదేవిధంగా అల్లాడేలా, ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తున్న భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ ను విమర్శించారు.

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ 365 రోజులు గోదావరి నుంచి నీటిని నింపడం కోసం, గోదావరిలో వాటర్ లెవెల్స్ మెయింటెన్స్ చేయడం కోసం కాంతానపల్లి వద్ద బ్యారేజ్ డిజైన్ చేసి అనుమతులు మంజూరు చేశామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంతానపల్లిని ఖతం చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కు అవసరముండే విద్యుత్ ను కూడా కాంతానపల్లి బ్యారేజ్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశాము. ఈ రోపు తుపాలగూడెం ప్రాజెక్టు లేదు.. ఇక్కడ పవర్ ప్రాజెక్టు లేకుండా అయింది. ఈ పాదయాత్ర పూర్తయిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకుని  కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులను సందర్శించేందకు బస్సు యాత్ర చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

500 కిలోమీర్ల పాదయాత్ర పూర్తి.. 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొర్రి తాండా వద్ద విశ్రాంతి బసలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేయించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget