అన్వేషించండి

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

CLP Leader Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

CLP Leader Bhatti Vikramarka: వరంగల్ : తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కానీ ఆ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాడుకోవడానికి అవకాశం ఉన్న నది గోదావరి. ఈ గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న నీటిని దశాబ్దాలుగా కరువు ప్రాంతాలుగా ఉన్న జనగామ ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు తీసుకువని వచ్చి.. ఇక్కడ కరువుకాటకాలు లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్యగారు నీటిపారుదల శాఖామంత్రిగా తలపెట్టిన జలయగ్నంలో అతిముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం అన్నారు. 

దేవాదుల ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని రావాలని దశాబ్దా కాలం పాటు అనేకమంది నాయకులు పోరాటం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆనాటి ముఖ్యమంత్రులను కలిశారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చారు. అందులో నాటి ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు కూడా1984-85లో దరఖాస్తులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసి దరఖాస్తులు ఇచ్చిన వ్యక్తే తరువాత కాలంలో నీటిపారుద శాఖామంత్రిగా పనిచేసి ఈ ప్రాజెక్టును తీసుకురావడం పొన్నాల అదృష్టం అన్నారు భట్టి.
కబ్జా చేయడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం!
ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి జనగామ ప్రజల కంటే.. ఇక్కడ భూముల మీదే ప్రేమ ఉందని తనను కలిసిన ప్రతిఒక్కరూ చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం, బలవంతంగా రాపిచ్చుకోవడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం చేస్తున్నారు. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు అందించే ప్రాజెక్టు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కరువుకాటకాలతో అల్లాడిపోయే ప్రజానీకానికి నీళ్లు ఇచ్చే గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కట్టడం కూడా పూర్తిచేసింది. అందులో భాగంగా 5 లిఫ్ట్ పాయింట్లు పెట్టడంతో పాటు అదనంగా 6 రిజర్వాయర్లను కూడా నిర్మించడం పూర్తి చేసి అందులో నీళ్లను కూడా నింపాము. అందులో భాగంగానే పది చిన్నచిన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచి వాటిని నీళ్లతో నింపాం అన్నారు. 

పాత చెరువులైన భీమ్ లింగాపూర్, రామప్ప, సాలివాగు, నగరం, పులిగుర్తి, ధర్మసాగర్ చెరువులు పెంచడంతో పాటు.. పైన గండి రామారం, బొమ్మకూర్, తపాస్ పల్లి, జల్లగూడెం, చెట్టకోడూర్, అశ్వరావు పల్లి, ఘన్ పూర్ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గోదావరి, క్రిష్ణా బేసిన్ లను వేరు చేసేలా అత్యంత ఎత్తయిన ప్రదేశంలో తపాస్ పల్లివద్ద రిజర్వాయర్ కట్టాము. అక్కడనుంచి అన్ని ప్రాంతాలను నీటిని డిస్ట్రిబ్యూట్ చేసేలా డిజైన్ చేశాము. వీటన్నింటిని పూర్తి నీళ్లు ఇచ్చే సమయానికి ప్రత్యేక పోరాటం రావడం, విభజన జరగడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఈ కట్టిన ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కాలువులు కూడా తవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులా నిద్రపోతోంది. కట్టిన ప్రాజెక్టులకు కాలువలు తవ్వింటే ఈ రోజు లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చేదన్నారు భట్టి విక్రమార్క.

పెంచిన చెరువులకు ఉన్న కాలువులను పెంచినా అదనపు భూమి సాగులోకి వచ్చేది. వీటిని పట్టించుకోక ఈ ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేసింది. దాదాపు రూ. 9వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేశాము. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు నిండుకుండలా ప్రాజెక్టులను తెచ్చి పెడితే.. ఆ నీటిని పంచకుండా అడ్డుపడి ఈ ప్రభుత్వం అతిపెద్ద నేరం చేసింది. ఆదిలాబాద్ నుంచి చూస్తే ఇక్కడి వరకూ అనేక నేరాలను ఈ ప్రభుత్వం చేసింది. రాష్ట్రం తెచ్చుకున్న ఉద్దేశం నెరవేరకుండా.. కరవు కాటకాలతో అదేవిధంగా అల్లాడేలా, ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తున్న భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ ను విమర్శించారు.

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ 365 రోజులు గోదావరి నుంచి నీటిని నింపడం కోసం, గోదావరిలో వాటర్ లెవెల్స్ మెయింటెన్స్ చేయడం కోసం కాంతానపల్లి వద్ద బ్యారేజ్ డిజైన్ చేసి అనుమతులు మంజూరు చేశామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంతానపల్లిని ఖతం చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కు అవసరముండే విద్యుత్ ను కూడా కాంతానపల్లి బ్యారేజ్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశాము. ఈ రోపు తుపాలగూడెం ప్రాజెక్టు లేదు.. ఇక్కడ పవర్ ప్రాజెక్టు లేకుండా అయింది. ఈ పాదయాత్ర పూర్తయిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకుని  కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులను సందర్శించేందకు బస్సు యాత్ర చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

500 కిలోమీర్ల పాదయాత్ర పూర్తి.. 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొర్రి తాండా వద్ద విశ్రాంతి బసలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేయించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget