అన్వేషించండి

Nagar kurnool News: అక్కరకు రాని ఐదు ప్రభుత్వాసుపత్రులు- ప్రసవ వేదనతో 124 కిలోమీటర్ల ప్రయాణం- తల్లీబిడ్డ మృతి!

Nagar kurnool News: నిండు చూలాలు. ఇంకాసేపట్లో బిడ్డకు జన్మనివ్వబోతూ పంటిబిగువునే ప్రసవ వేదనను భరించింది. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల లేమితో ఐదు దవాఖానాలకు తిప్పారు. అదే వారిపాలిట శాపంగా మారింది. 

Nagar kurnool News: తాను తల్లి కాబోతున్నట్లు తెలిసినప్పటి నుంచి కడుపులో ఉన్న బిడ్డ గురించి అనేక కలలు కనింది. రోజులు, నెలలు ఆ బిడ్డ కోసమే ఆలోచిస్తూ తనలో తానే మురిసిపోయింది. మరికొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆనందం ఓ వైపు ప్రసవ వేదన ఎలా ఉంటుందోనన్న భయం మరోవైపు. అయినా సరే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు ఎంత కష్టమైనా పడాలనుకుంది.

తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. పంటి బిగువున నొప్పి అదిమి పెట్టి ధైర్యంగా ఆస్పత్రికి బయలు దేరింది.  కాన్పు క్లిష్టమయ్యేలా ఉందని అక్కడి వైద్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వాళ్లు మరో ఆస్పత్రిని, అక్కడికి చేరాకా వాళ్లు ఇంకో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఇలా మొత్తం ఐదు ఆస్పత్రులకు తీసుకెళ్లగా... సాధారణ ప్రసవం చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బిడ్డను ప్రసవించిన కాసేపటికే తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు. 

అసలేం జరిగిందంటే..?

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఎల్మపల్లికి చెందిన 24 ఏళ్ల చారగొండ స్వర్ణ నిండు గర్భిణీ. మొదటి కాన్పు కావడంతో పదర మండలం వంకేశ్వరంలోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమెకు ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు 108 అంబులెన్స్ ద్వారా 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న పదర హీహెచ్సీ కి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి ప్రసవం క్లిష్టమయ్యేలా ఉందని చెప్పారు. 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి వైద్య సిబ్బంది కూడా తమ వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అయితే అక్కడ ప్రాథమిక వైద్య సేవలు అందించిన సిబ్బంది.. బీపీ అదుపులోకి రాకపోవడంతో మరో 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. 

అక్కడ కూడా ఆమె పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరో 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకు వెళ్లమని చెప్పారు. ఇక చేసేదేం లేక ప్రసవ వేదనతో కన్నీళ్లు పెడుతున్న కూతురును అక్కడి నుంచి మహబూబ్ నగర్ దవాఖానకు తరలించారు. రాత్రి రెండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. వెంటనే వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె కుమారుడికి జన్మనిచ్చిన అనంతరం ఫిట్స్ వచ్చి స్వర్ణ మృతి చెందింది. మరికాసేపటికే శిశువు కూడా చనిపోయింది. కాన్పు కోసం కష్టపడి 124 కిలో మీటర్ల దూరం వెళ్లినా తల్లీబిడ్డలు దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయిదు ఆస్పత్రులు తిరిగినా సరైన సౌకర్యాలు లేకే తల్లీబిడ్డ మృతి చెందారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన కాన్పులు చేసేందుకు అసరమైన పరికరాలు, వసతులు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి కేసులను వేరే ఆస్పత్రులకు పంపిస్తున్నామని అమ్రాబాద్ వైద్యాధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ కూడా ఇక్కడ అందుబాటులో లేదని చెప్పారు. ప్రత్యేక వైద్యులు కూడా లేరని వివరించారు. స్వర్ణను ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమెకు హైబీపీ ఉందని చెప్పారు. కాన్పు కష్టమయ్యే అవకాశం ఉండడం వల్ల ఆమెను అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అమ్రాబాద్ లో కేవలం సాధారణ కాన్పులు మాత్రమే చేస్తున్నామని డాక్టర్ నాగరాజు వివరించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Best Haleem Spots In Hyderabad : హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Embed widget