అన్వేషించండి

Maoist Damodar : మావోయిస్టులకు బిగ్‌ షాక్- ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి

Maoist Damodar Alias Bade Chokka Rao : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు.

Maoist Damodar Alias Bade Chokka Rao Killed In Encounter : మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 16 గురువారం రోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్ట్ పార్టీనే నిర్థారించింది. రెండు రోజుల క్రితం మావోలకు, భద్రతా దళాలకు జరిగిన భీకర దాడిలో చొక్కారావుతో పాటు మరో 18మంది నక్సల్స్ మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.

ఎవరీ బడే చొక్కారావు ?

బడే చొక్కారావు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఆయన.. ప్రారంభంలో మిలిటరీ చీఫ్ గా పని చేశారు. ఆ తర్వాత మావో పార్టీలో చేరి.. 30 ఏళ్లుగా నక్సల్ ఉద్యమంలో భాగమయ్యారు. వివిధ హోదాల్లోనూ పని చేశారు. కరోనాతో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ.. కేంద్ర కమిటీ బడే చొక్కారావుకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక కొంతకాలంగా పలు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా పేరొందిన చొక్కారావుపై తెలంగాణలో రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం, ల్యాండ్ మైన్ పేల్చడం వంటి ఘటనల్లోనూ చొక్కారావు కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు చొక్కారావు ఎదురుకాల్పుల్లో మరణించిగా.. ఆయన భార్య రజితను 2023లోనే అరెస్ట్ చేసినట్టు సమాచారం. చొక్కారావు అన్న బడే నాగేశ్వర్ రావు కూడా 20ఏళ్ల క్రితమే ఎన్ కౌంటర్ లో చనిపోయారు.

Also Read: నాగోబా జాతర ప్రధాన ఘట్టం పూర్తి- మెస్రం వంశీయులు గంగాజలం ఎలా సేకరిస్తారంటే..!

దద్దరిల్లుతోన్న ఛత్తీస్‌గఢ్‌ అడవులు 

2024 ప్రారంభం నుంచి  ఛత్తీస్‌గఢ్‌ అడవులు వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టు పార్టీ తొలి తరం నేత మాచర్ల ఏసోబు కూడా గతేడాది ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన పోలీసుల అన్‌స్టాపబుల్ ఆపరేషన్‌కు గత రెండేళ్లలోనే 800 మావోయిస్టులు లొంగిపోగా.. ఒక్క 2024లోనే 200మందికిపైగా సరెండర్ అయ్యారు. 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‘ఆపరేషన్‌ సమాధాన్‌’ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్‌ పెట్టుకున్నారు. 2021 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని నామ రూపాల్లేకుండా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదు. కానీ ఎలాగైనా తమ లక్ష్యాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోన్న మాట. 

Also Read : Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget