అన్వేషించండి

Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మరో పథకం

Solar Pumps For Farmers: తెలంగాణలో రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు బిగించనున్నట్లు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జిని విరివిగా వినియోగించుకుంటామన్నారు.

Telangana News: తెలంగాణలో రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు(Solar Pump Sets) అందించనున్నట్లు  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramaka) తెలిపారు. ప్రపంచం మొత్తం  గ్రీన్ ఎనర్జీ చుట్టూ తిరుగుతోందని....కాబట్టి  మనమూ దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్ట్‌గా  25 గ్రామాల్లో రైతులకు సోలార్ పంపుసెట్లు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. 
 
రోజురోజుకు పెరుగుతున్న కర్బన్ ఉద్గారాలను నిరోధించడంతోపాటు ..విద్యుత్ డిమాండ్‌ను తగ్గించేందకు గ్రీన్‌ఎనర్జీని(Green Energy) వీలైనంత వరకు వాడుకోవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశం మొత్తం  సోలార్‌(Solar Power), పవన్ విద్యుత్‌(Wind Power) వినియోగం దిశగా  అడుగులు వేస్తోందన్న ఆయన.....తెలంగాణ(Telangana) సైతం గ్రీన్‌ ఎనర్జీ వినియోగాన్ని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గత పదేళ్లుగా  రాష్ట్రంలో కొత్త ఎనర్జీ పాలసీనే  తీసుకురాలేదని ఆయన విమర్శించారు. అలాగే దేశంలోనూ ఇంధనరంగానికి సంబంధించిన సరైన పాలసీ  లేకపోవడంతో సోలార్‌,ఫ్లోటింగ్‌,పంప్‌ స్టోరేజ్‌, హైడ్రోజన్ పవర్‌ వంటి రకరకాలుగా  గ్రీన్‌ ఎనర్జీ లభిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త  ఎనర్జీ పాలసీని తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.
 
 
తెలంగాణలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం కానీ...భవిష్యత్‌లో తెలంగాణ విద్యుత్ డిమాండ్‌  22,400 మెగావాట్లకు పెరిగే  అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటిలో కల్పించాల్సిన  మౌలిక వసతులకు తోడు...ఎత్తిపోతల పథకాలకు భారీగా విద్యుత్ అవసరం కానుందన్నారు. వచ్చే పదేళ్లలో పెరిగే అవసరాలను  దృష్టిలో ఉంచుకుని  31వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు భట్టి వెల్లడించారు.  2035 కల్లా 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా  అడుగులు ముందుకు వేస్తున్నామని  వివరించారు. ఉచిత విద్యుత్ కోసమే  ప్రతినెలా విద్యుత్‌శాఖకు రూ.148 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపిన  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క....ఈ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు విద్యుత్ డిమాండ్‌ను తగ్గించేందుకు రైతుల మోటార్లకు సోలార్‌ పంపుసెట్లు బిగిస్తున్నట్లు  వెల్లడించారు.
 
TGNPDCL సంస్థలో ఎంపికైన జూనియర్‌ అసిస్టెంట్ అభ్యర్థులకు ఆయన హైదరాబాద్‌లో నియామకపత్రాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేకంగా దృష్టిసారించామని  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 56వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేసినట్లు భట్టి గుర్తు చేశారు. విద్య, మౌలిక  వసతుల కల్పనకు  కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీఆర్‌ఎస్(BRS) పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని....గ్రూప్‌ పరీక్షలంటేనే హాస్యాస్పందంగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నా...యువతకు కనీసం ఉపాధి కల్పించలేకపోయారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు  లభిస్తాయని భావించే....యువత కాంగ్రెస్‌ పక్షాన నిలిచిందని  భట్టి విక్రమార్క అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న ఆయన...క్రమం తప్పకుండా  ఉద్యోగ క్యాలెండర్‌ను అనుసరించి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేట్‌రంగంలోనూ పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా  ఉద్యోగం,ఉపాధి లభించేలా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Also Read: హైదరాబాద్లో రూ. 3,500 కోట్లతో ఏఐ బేస్డ్ డేటా సెంటర్ - రెండో రోజు సింగపూర్ లో పర్యటించిన సీఎం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Embed widget