News
News
X

Food Poisoning: మహబూబాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్- ఆసుపత్రిపాలైన 16మంది విద్యార్థులు

Food Poisoning: మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో గత రాత్రి భోజనం చేసినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అస్వస్థతతు గురయ్యారు.

FOLLOW US: 
Share:

Food Poisoning: మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిన్న విద్యార్థుల్లో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిందర్నీ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో గత రాత్రి భోజనం చేసినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అస్వస్థతతు గురయ్యారు. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా రియాక్ట్ కాలేదని అంటున్నారు. 

చివరకు పరిస్థితి చేయిదాటిపోతుందన్న టైంలో ఫుడ్‌ పాయిజన్ అయిన విద్యార్థులకు అక్కడే వైద్య చికిత్సలు అందించారని చెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లను కస్తూర్భా పాఠశాలలోకి పిలిపించుకొని సీక్రెట్‌గా వైద్యం అందించారని తెలుస్తోంది. 

దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో అలర్ట్‌ అయిన నిర్వాహకులు అప్పుడు ఆసుపత్రికి తరలించినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థినీలు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు. 

కొందరికి సాధారణ చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమంది విద్యార్ధినీలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరిగినా ఇంతవరకు విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. 

విద్యార్థులకు ప్రమాదం లేదని అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెబుతున్నారు వైద్యులు. కలుషిత నీరు కారణంగా ఇలా జరిగిందా.. లేకుంటే ఆహారం వల్లే ఇది జరిగిందా అనేది పిల్లలు కోలుకున్న తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. 

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత  జరిగినా తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. 


చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. భయపడాల్సిన పని లేదని వైద్యులు చికిత్స అందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. 

Published at : 09 Mar 2023 12:19 PM (IST) Tags: Mahabubabad KGBV Warangal Food Poisoning

సంబంధిత కథనాలు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్