అన్వేషించండి

Minister Erraballi: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

వరంగల్ జిల్లా రాయపర్తిలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుట్టు శిక్షణ కేంద్రాలతో మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు.

టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన సమర్థవంత నాయకుడు అని, కేటీఆర్ వల్లే రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు వచ్చాయని, పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుట్టు శిక్షణ కేంద్రాలతో మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తున్నామని అన్నారు. దీనిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ నెల 8న తొర్రూరు పట్టణంలో నిర్వహించే సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. డీఆర్డీవో సంపత్‌రావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కుమార్‌గౌడ్‌, ఎంపీడీవో కిషన్‌నాయక్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

కేటీఆర్ పర్యటన
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వత గిరి మండలం, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణానికి మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 

మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ హెలి ప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్ లను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను అధికారులతో మంత్రి చర్చించారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 8వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ స్క్రీనింగ్ ని మహిళలు ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి, బోయిన పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ సూచించారు.

పాలకుర్తి నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటనలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా తొర్రూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

మహిళలతో భారీ బహిరంగ సభ
పలు కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం 20 వేల మంది మహిళలతో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభలో కేటీఆర్ కొన్ని కీలక విషయాలపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. అదే సందర్భంగా డ్వాక్రా మహిళలకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పే అవకాశం ఉందని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. సభ పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి, హెలిప్యాడ్, బహిరంగ సభా స్థలం, పార్కింగ్ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి కావాల్సిన మరిన్ని నిధులు, అవసరాల గురించి మంత్రి ఎర్రబెల్లి చర్చించారు. కేటీర్ పర్యటన సందర్భంగా అధికారులు, పార్టీ శ్రేణులకు అంశాల వారీగా బాధ్యతలు అప్పగించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget