అన్వేషించండి

Temple Demolition Fact Check: 800 ఏళ్ల ఆలయం కూల్చివేత వార్తల్లో వాస్తవం లేదు- వరంగల్ జిల్లా కలెక్టరేట్ క్లారిటీ

వరంగల్ జిల్లా పహాడ్ల అశోక్ నగర్‌లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, శిథిలావస్థలో ఉన్న ఆ నిర్మాణాన్ని అదే స్థలంలో పునరుద్ధరిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పహాడ్ల అశోక్‌ నగర్‌లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. మే 6వ తేదీన కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు రెవెన్యూ, పురావస్తు శాఖ (Archaeology), TGEWIDC, సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శుభ్రం చేస్తుండగా, దట్టమైన పొదల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయి. అయితే, ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లుగానీ, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.


Temple Demolition Fact Check: 800 ఏళ్ల ఆలయం కూల్చివేత వార్తల్లో వాస్తవం లేదు- వరంగల్ జిల్లా కలెక్టరేట్ క్లారిటీ

పురావస్తు శాఖ అధికారులు ఈ కట్టడాన్ని పరిశీలించి, ఇది రక్షిత దేవాలయం కాదని మరియు పురావస్తు కట్టడాల జాబితాలో నమోదు కాలేదని తేల్చారు. కలెక్టర్ మరియు నర్సంపేట ఎమ్మెల్యే సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి, ఆ నిర్మాణానికి పురావస్తు శాఖ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చరిత్రకారుల సలహాలతో ఆ నిర్మాణాన్ని అదే ప్రదేశంలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు అధికారికంగా ధ్రువీకరించుకోవాలని మీడియాకు, ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో ఏం పోస్టులు చేశారంటే..

సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేశారని తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్‌తో కూల్చడం అన్యాయం అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. 

వరంగల్ జిల్లాలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసంపై కేంద్రం సీరియస్ అయిందని, దాంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురావస్తు విభాగం కేసు నమోదు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ స్పందించిందని, 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ నమోదు చేశారని.. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
Kothagudem Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
IMD Alert In Telangana And Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
తెలంగాణ, ఏపీలో వాన బీభత్సం!హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్‌! పలు జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Embed widget