Temple Demolition Fact Check: 800 ఏళ్ల ఆలయం కూల్చివేత వార్తల్లో వాస్తవం లేదు- వరంగల్ జిల్లా కలెక్టరేట్ క్లారిటీ
వరంగల్ జిల్లా పహాడ్ల అశోక్ నగర్లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, శిథిలావస్థలో ఉన్న ఆ నిర్మాణాన్ని అదే స్థలంలో పునరుద్ధరిస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పహాడ్ల అశోక్ నగర్లో పురాతన ఆలయాన్ని కూల్చివేసినట్లు వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. మే 6వ తేదీన కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు రెవెన్యూ, పురావస్తు శాఖ (Archaeology), TGEWIDC, సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ చేపట్టారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శుభ్రం చేస్తుండగా, దట్టమైన పొదల్లో శిథిలావస్థలో ఉన్న కొన్ని నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయి. అయితే, ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లుగానీ, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.

పురావస్తు శాఖ అధికారులు ఈ కట్టడాన్ని పరిశీలించి, ఇది రక్షిత దేవాలయం కాదని మరియు పురావస్తు కట్టడాల జాబితాలో నమోదు కాలేదని తేల్చారు. కలెక్టర్ మరియు నర్సంపేట ఎమ్మెల్యే సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి, ఆ నిర్మాణానికి పురావస్తు శాఖ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చరిత్రకారుల సలహాలతో ఆ నిర్మాణాన్ని అదే ప్రదేశంలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా సమాచారాన్ని ప్రచురించే ముందు అధికారికంగా ధ్రువీకరించుకోవాలని మీడియాకు, ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అధికారిక వివరణ
— FactCheck_Telangana (@FactCheck_TG) May 8, 2026
వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్
వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, పహాడ్ల అశోక్ నగర్ గ్రామంలో, ప్రాచీన దేవాలయం కూల్చివేత జరిగిందంటూ మే 6 వ తేదీన వచ్చిన కొన్ని మీడియా కథనాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.
అధికారిక వివరాలు:
➤ ఈ విషయంలో వాస్తవాలు… pic.twitter.com/wxKJitjqQj
సోషల్ మీడియాలో ఏం పోస్టులు చేశారంటే..
సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం అని సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేశారని తెలుగు స్క్రైబ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్తో కూల్చడం అన్యాయం అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.
వరంగల్ జిల్లాలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసంపై కేంద్రం సీరియస్ అయిందని, దాంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పురావస్తు విభాగం కేసు నమోదు చేసినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదుతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ స్పందించిందని, 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ నమోదు చేశారని.. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























