అన్వేషించండి

Mothers Day Gift : మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ గిఫ్ట్, మదర్స్ డే నాడు ఉచిత ప్రయాణం!

Mothers Day Gift : మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ కానుక ప్రకటించింది. మదర్స్ డే సందర్భంగా అమ్మలకు ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చింది.

Mothers Day Gift : టీఎస్ఆర్టీసీ మదర్స్ డే నాడు అమ్మలకు సూపర్ గిఫ్ట్ ఇస్తుంది. మాతృమూర్తులందరికీ మే 8న ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చింది. ఇటీవల టీఎస్ఆర్టీసీ సంస్కరణల బాటపట్టింది. సజ్జనార్ ఎండీ అయినప్పటి నుంచి ఆర్టీసీ నిర్వహణలో మార్పులు చోటుచేసుకున్నాయి. యూపీఐ పేమెంట్స్ లో చెల్లింపులతో పాటు పలు సంస్కరణలకు సజ్జనార్ శ్రీకారం చుట్టారు. పండగల సమయంలో చిన్నారుల ఫ్రీ ఆఫర్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పాస్ లలో రాయితీ ఇచ్చింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లులకు ఉచిత ప్రయాణం గిఫ్ట్ ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

మదర్స్ డే గిఫ్ట్ 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మాతృమూర్తులకు మదర్స్ డే గిఫ్ట్ ఇస్తుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఈనెల 8న ఆదివారం పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులు రాష్ట్రంలోని అన్నీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకే ఈ అవకాశం వర్తిస్తుందని వెల్లడించింది. మదర్స్‌ డే సందర్భంగా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ మ‌ద‌ర్శ్ డే శుభాకాంక్షలు చెబుతూ మాతృమూర్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌, ఎండీ వి.సి.స‌జ్జనార్‌ మాట్లాడుతూ అమ్మ అంటే త్యాగానికి ప్రతిరూపం అన్నారు. తను ఎన్నో త్యాగాలు చేసిన మన జీవితాలను నిర్మిస్తుందన్నారు. అలాంటి మాతృమూర్తులకు ఇలాంటి అవకాశం కల్పించడం ఆర్టీసీ సంస్థ గొప్పగా భావిస్తుందన్నారు. 

ప్రజలకు చేరువయ్యేందుకు  

ఆర్టీసీ సామాజిక స్పృహతో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక సమయాల్లో ఇలాంటి రాయితీలు క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించామన్నారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్ లలో 20 శాతం రాయితీ ప్రకటించామని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని కోరుతుంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ తరహా రాయితీలు, ఉచిత ప్రయాణాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget