అన్వేషించండి

TS News Developments Today: తెలంగాణకు కొత్త డీజీపీ వస్తారా? లేక తాత్కాలిక డీజీపీని నియమిస్తారా?

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలిచేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపటిలో సీబీఐ ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నేడు ముచ్చింతల్‌కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. ఘన స్వాగతం పలకనున్న చిన్నజీయర్ స్వామి..

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. దేశానికే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం అంగరంగ వైభవంగా ముస్తాబై రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తుంది. కట్టుదిట్టమైన పోలీసు బలగాల భద్రత ఏర్పాట్ల మధ్య ముచ్చింతలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణలో పర్యటన భాగంగా గురువారం ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. తర్వాత రిఫ్రిస్మెంట్ పూర్తి చేసుకొని అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు చేరుకుంటారు. అక్కడ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మును వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియచేస్తారు.- ఆ తర్వాత 216 అడుగుల రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుంచి రామానుజ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. చివరకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో చూసిన తరువాత సందర్శకులని, భక్తులని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు, సందర్శకులు పోలీసులకు, ఆలయ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నేడు సిబిఐ ఏం చేస్తుంది? ఉత్కంఠగా ఎమ్మెల్యేల ఎర కేసు

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసును సిట్ నుంచి సిబిఐ కి బదిలిచేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. తీర్పు కాపీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపటిలో సిపిఐ ఈ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 98 పేజీల తీర్పు కాపీ అందుకున్న సిబిఐ ఈ కేసులో ఏం చేయబోతుంది? ఏవర్ని విచారించనుంది అనేది ఉత్కంఠగా మారింది. 

నేడు డీజీపీ వార్షిక నివేదిక.. కొత్త డీజీపీ ఏవరు?

ఈ ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలు, అదే విధంగా పోలీసుల పనితీరుపై డీజీపీ మహేందర్ రెడ్డి వార్షిక నివేదిక ఈ రోజు విడుదల చేయనున్నారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో కొత్త డీజీపీగా ఎవరు వస్తారనేది పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ పదవికాలం ముగుస్తుంది. సినియార్టీ ప్రకారం కొత్త డీజీపీ నియమిస్తారా? లేక తాత్కలిక డీజీపీ ని నియమిస్తారా? అనేది ఇవాళ, రేపటిలో తెలియనుంది. 

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా.. సీట్లకు నేడు వెబ్‌ కౌన్సిలింగ్‌

ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ సీట్ల భర్తీకి కాను నేడు రెండవ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మొదటి విడత తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి బుధవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 28న బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 29న గురువారం సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యు డబ్ల్యు. కెఎన్‌ఆర్‌ యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget