అన్వేషించండి

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

షర్మిల పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.

Green Signal To Sharmila Padayatra :  వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయవద్దు అని హైకోర్టు సూచించింది. షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని సూచిస్తూ, పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం  సృష్టించారని ఆ పిటిషన్ లో  వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్  రెడ్డి  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  వైఎస్ షర్మిల  తన పాదయాత్రలో  సీఎం  కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పెద్దలపై  వ్యక్తిగత విమర్శలు చేస్తుందని  అడ్వకేట్  జనరల్  గుర్తు  చేశారు. దీంతో  షరతులతో  కూడిన  అనుమతిని  హైకోర్టు అనుమతిని  ఇచ్చింది.    పాదయాత్రకు మరోసారి  ధరఖాస్తు  చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ  చేసింది. 

వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద పాదయాత్రపై దుండగులు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా షర్మిల పాదయాత్రను నిలిపివేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో వదిలి పెట్టారు.  పాదయాత్రకు అన్ని అనుమతులు ఉన్నాయని.. అయినా  పోలీసులు అరెస్ట్ చేశారని హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. 

మరో వైపు పాదయాత్రలో తనపై జరిగిన దాడులకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారి తీసింది.ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  షర్మిల తో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ ల నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని  షర్మిల పై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ తో ఎస్సార్ నగర్ పీఎస్ వద్దకు ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

,పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో షర్మిల ఎక్కడ పాదయాత్ర ఆగిందో మళ్లీ అక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. . అయితే మళ్లీ పాదయాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుందన్నదానిపై వైఎస్ఆర్‌టీపీ వర్గాలు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.  షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకూ మూడున్నర వేల కిలోమీటర్ల వరకూ నడిచారు.  షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా.. కొన్ని చోట్ల పాదయాత్రలో పాల్గొని తమ కుమార్తెకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 

వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget