అన్వేషించండి

Telangana Letter to KRMB: 'సాగర్ ప్రాజెక్టు వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించండి' - కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

Telangana News: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు.

Telangana Letter to Krishna River Board on Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) వద్ద నీటి విడుదలకు సంబంధించి ఇటీవల ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ కేఆర్ఎంబీని (KRMB) మరోసారి కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్ డ్యాంను తెలంగాణనే నియంత్రించాలని లేఖలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అప్పటి పరిస్థితిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. డ్యాం వద్ద కేంద్ర బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని, ఏపీ ప్రభుత్వం (AP Government) సైతం తగిన చర్యలు తీసుకునేలా వెంటనే స్పందించాలని లేఖలో కేఆర్ఎంబీని కోరారు.

అసలు వివాదం ఏంటంటే.?

ఇటీవల సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఏపీ పోలీసులు నవంబర్ 29 (బుధవారం) అర్ధరాత్రి ఆ రాష్ట్ర భూభాగంలోని 13 గేట్లను స్వాధీనం చేసుకుని కంచె వేశారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు రైట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై ఏపీ పోలీసులు దాడి చేశారని డ్యాం వద్ద భద్రతా సిబ్బంది, తెలంగాణ అధికారులు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనడంతో కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్టుల నీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో డ్యాం వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. 

ఈ నెల 6న మళ్లీ సమావేశం

ఇందులో భాగంగా ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర జల సంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్లు ఆ తర్వాత రోజు సమావేశమయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై సుమారు గంట పాటు సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్ కు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు వర్చువల్ గా హాజరయ్యారు. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఏపీ అధికారులు వివరించారు. అయితే, తెలంగాణలో డిసెంబర్ 3న (ఆదివారం) ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని ఆ రాష్ట్ర అధికారుల అభ్యర్థన మేరకు ఈ నెల 6న (బుధవారం) మరోసారి సమావేశం కానున్నారు. కాగా, అప్పటివరకూ సాగర్ నీటి విడుదల కొనసాగుతుండగా, కేఆర్ఎంబీ అభ్యర్థన మేరకు ఏపీ అధికారులు నీటి విడుదలను ఆపేశారు.

పోటా పోటీ కేసులు

అటు, ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల పోలీసులు పోటా పోటీగా కేసులు నమోదు చేసుకున్నారు. ఏపీ పోలీసులు తమపై దాడి చేసి సాగర్ డ్యాంపైకి అక్రమంగా చొరబడ్డారని తెలంగాణ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని, ఏపీ ఇరిగేషన్ అధికారులపైనా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ 2 కంప్లైంట్స్ పై నాగార్జున సాగర్ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Also Read: Trains Rush: సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్ - చాంతాడంత వెయిటింగ్ లిస్ట్, ప్రత్యేక రైళ్ల కోసం పెరుగుతున్న డిమాండ్

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget