అన్వేషించండి

KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన

తెలంగాణలో దళిత బంధు పథకం ఇవాళే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కేసీఆర్ హుజూరాబాద్‌ వెళ్లి 15 మందికి దళిత బంధు చెక్కులు ఇవ్వనున్నారు.

LIVE

Key Events
KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన

Background

తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు. ఇప్పటికే అక్కడ సభా ప్రాంగణం సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేదికపైనుంచే కేసీఆర్ 15 మందికి తొలుత దళిత బంధు చెక్కులను అందజేస్తారు. అందుకోసం ఇప్పటికే ఆ 15 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. సభా ఏర్పాట్లను ఇదివరకే మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటివారు పరిశీలించారు.

15:58 PM (IST)  •  16 Aug 2021

ఈసారి వస్తే నాకు చాయ్ పోస్తవా మరి..: కేసీఆర్

కనుకల గిద్ద గ్రామం నుంచి లబ్దిదారులుగా ఎంపికైన కొత్తూరి రాధ-కొత్తూరి మొగిలి అనే కుటుంబానికి సీఎం కేసీఆర్ తొలి దళిత బంధు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని సీఎం కేసీఆర్ అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని మహిళ చెప్పింది. దీంతో ఈసారి నేనొస్తే నాకు చాయ్ పోస్తవా మరి.. అని కేసీఆర్ తమాషాగా మాట్లాడారు. ఆ తర్వాత మొత్తం 15 మందికి కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందజేశారు.

15:52 PM (IST)  •  16 Aug 2021

వీళ్లందరి పర్యవేక్షణలోనే దళిత బంధు

‘‘ఈ దళిత బంధు ఆశామాషీ కాదు.. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సమాజంలోని పెద్దలు కూడా పర్యవేక్షణ చేస్తుంటరు. దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు వంటి 23 నుంచి 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారు. వీరు కాక దళిత బంధు కమిటీలు కూడా వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది మొత్తం కలిపి లక్షకు పైగా కమిటీ మెంబర్లు అవుతరు. 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు, ఈ లక్ష పైచిలుకు కమిటీ మెంబర్లు మొత్తం లక్షా 25 వేల మంది కలిసి ఈ పథకాన్ని పర్యవేక్షణ చేస్తారు. వీరి కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటవుతుంది. అంటే కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటయ్. దేశంలో ఇంతటి గొప్ప పథకం తొలిసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్లీ పేదరికంలోకి వచ్చే సమస్య లేనే లేదు.’’ అని కేసీఆర్ చెప్పారు. 

15:45 PM (IST)  •  16 Aug 2021

దళిత రక్షణ నిధి మిమ్మల్ని కాపాడుతుంది

‘‘అంతేకాక, దళితుల కోసం రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నం. మీకిచ్చే రూ.10 లక్షల్లో నుంచి మేం ఒక రూ.10 వేలు తీసి పక్కన పెడతం. దానికి ప్రభుత్వం కూడా అంతే కలిపి ఆ డబ్బును రక్షణ నిధి కింద ఉంచుతం. అలా ఒక్క హుజురాబాద్ నుంచే ఆ నిధి దాదాపు రూ.50 కోట్ల అవుతుంది. ఎవరికి ఏదైనా ఆపద వచ్చి మళ్లీ సంక్షోభం వస్తే ఆ నిధి మిమ్మల్ని కాపాడుతుంది.’’ అని కేసీఆర్ వివరించారు.

15:44 PM (IST)  •  16 Aug 2021

10 లక్షలు వచ్చినా ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగుతయ్

దళిత బంధు వచ్చిన అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు, మీకొచ్చే ప్రభుత్వ పథకాలన్నీ అంతే కొనసాగుతయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాక అవన్నీ అంతే కొనసాగుతయ్. ఈ పథకం కింద డబ్బులు ఇచ్చి మేం చేతులు దులుపుకోం. మీకు ప్రత్యేకమైన కార్డు ఇస్తాం. పాత అకౌంట్లో వేస్తే పాత బాకీలు పట్టుకుంటారు. ఏడాదికి లక్ష కన్నా విత్ డ్రా చేసుకోకూడదనే ఒక నిబంధన ఉంది. వాటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకొనే వీలు కలగాలంటే.. మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెడదాం. మేం ఇచ్చే కార్డు ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏం పెట్టుబడి పెట్టారనేది జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటరు. 

15:31 PM (IST)  •  16 Aug 2021

లడాయి చేస్తే పైసలు వస్తయా..

‘‘రాష్ట్రమంతా ఈ దళిత బంధు అమలుకు రూ.1.5 లక్షల కోట్లో.. రూ.1.70 లక్షల కోట్లో ఖర్చు అవుతది. అది ఒక లెక్కనే కాదు.. ఏడాదికి రూ.30 వేల కోట్లో నుంచి రూ.40 వేల కోట్లో ఖర్చు పెడితే నాలుగైదేళ్లలో దళితులందరి కల నెరవేరతది. హుజూరాబాద్ కాడ కొంత మంది లడాయి చేసిన్రని తెలిసింది నాకు.. లడాయి చేస్తే పైసలు వస్తయా.. అవసరం అయితే నేనే ఇంకో 20 రోజులకు హుజూరాబాద్ వస్తా. 20 మండలాలు తిరుగుతా. మీతో పాటు దినమంతా గడిపి.. అక్కడే పరిష్కారం చూసుకుందం.’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Andhra Pradesh: నిధులు వేటలో సీఎం చంద్రబాబు - 4న ఢిల్లీకి పయనం- కేంద్రం ముందు పెట్టే డిమాండ్లు ఇవే!
నిధులు వేటలో సీఎం చంద్రబాబు - 4న ఢిల్లీకి పయనం- కేంద్రం ముందు పెట్టే డిమాండ్లు ఇవే!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Andhra Pradesh: నిధులు వేటలో సీఎం చంద్రబాబు - 4న ఢిల్లీకి పయనం- కేంద్రం ముందు పెట్టే డిమాండ్లు ఇవే!
నిధులు వేటలో సీఎం చంద్రబాబు - 4న ఢిల్లీకి పయనం- కేంద్రం ముందు పెట్టే డిమాండ్లు ఇవే!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
Vijay Devarakonda: 'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Vijayawada: టికెట్ కౌంటర్ పక్కనే ఉద్యోగం - ఫేక్ రైల్వే వెబ్‌సైట్‌తో మోసం- ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జాగ్రత్త!
టికెట్ కౌంటర్ పక్కనే ఉద్యోగం - ఫేక్ రైల్వే వెబ్‌సైట్‌తో మోసం- ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జాగ్రత్త!
Embed widget