అన్వేషించండి

KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన

తెలంగాణలో దళిత బంధు పథకం ఇవాళే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కేసీఆర్ హుజూరాబాద్‌ వెళ్లి 15 మందికి దళిత బంధు చెక్కులు ఇవ్వనున్నారు.

LIVE

Key Events
Telangana Live News Updates CM KCR Tour to Huzurabad to Start Dalitha Bandhu KCR Live Updates: లడాయి చేస్తే పైసలు వస్తయా? ఆ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తిస్తది, కానీ.. సీఎం కేసీఆర్ ప్రకటన
కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Background

తెలంగాణలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవం ఇవాళ (ఆగస్టు 16) అధికారికంగా జరగనుంది. హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారు. ఇప్పటికే అక్కడ సభా ప్రాంగణం సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేదికపైనుంచే కేసీఆర్ 15 మందికి తొలుత దళిత బంధు చెక్కులను అందజేస్తారు. అందుకోసం ఇప్పటికే ఆ 15 మంది లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. సభా ఏర్పాట్లను ఇదివరకే మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటివారు పరిశీలించారు.

15:58 PM (IST)  •  16 Aug 2021

ఈసారి వస్తే నాకు చాయ్ పోస్తవా మరి..: కేసీఆర్

కనుకల గిద్ద గ్రామం నుంచి లబ్దిదారులుగా ఎంపికైన కొత్తూరి రాధ-కొత్తూరి మొగిలి అనే కుటుంబానికి సీఎం కేసీఆర్ తొలి దళిత బంధు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కొత్తూరి రాధను.. ఈ డబ్బుతో ఏం చేస్తారని సీఎం కేసీఆర్ అడగ్గా.. డెయిరీ ఫాం పెట్టుకుంటానని మహిళ చెప్పింది. దీంతో ఈసారి నేనొస్తే నాకు చాయ్ పోస్తవా మరి.. అని కేసీఆర్ తమాషాగా మాట్లాడారు. ఆ తర్వాత మొత్తం 15 మందికి కేసీఆర్ దళిత బంధు చెక్కులను అందజేశారు.

15:52 PM (IST)  •  16 Aug 2021

వీళ్లందరి పర్యవేక్షణలోనే దళిత బంధు

‘‘ఈ దళిత బంధు ఆశామాషీ కాదు.. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో పాటు దళిత సమాజంలోని పెద్దలు కూడా పర్యవేక్షణ చేస్తుంటరు. దళిత సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు వంటి 23 నుంచి 25 వేల మంది దళిత ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నారు. వీరు కాక దళిత బంధు కమిటీలు కూడా వేస్తున్నాం. ప్రతి ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకు 24 మంది మొత్తం కలిపి లక్షకు పైగా కమిటీ మెంబర్లు అవుతరు. 25 వేల దళిత ప్రజా ప్రతినిధులు, ఈ లక్ష పైచిలుకు కమిటీ మెంబర్లు మొత్తం లక్షా 25 వేల మంది కలిసి ఈ పథకాన్ని పర్యవేక్షణ చేస్తారు. వీరి కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటవుతుంది. అంటే కొన్ని వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల రక్షణ కోసం బ్యాంకుల్లో ఉంటయ్. దేశంలో ఇంతటి గొప్ప పథకం తొలిసారి జరుగుతుంది. కాబట్టి మీరు మళ్లీ పేదరికంలోకి వచ్చే సమస్య లేనే లేదు.’’ అని కేసీఆర్ చెప్పారు. 

15:45 PM (IST)  •  16 Aug 2021

దళిత రక్షణ నిధి మిమ్మల్ని కాపాడుతుంది

‘‘అంతేకాక, దళితుల కోసం రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నం. మీకిచ్చే రూ.10 లక్షల్లో నుంచి మేం ఒక రూ.10 వేలు తీసి పక్కన పెడతం. దానికి ప్రభుత్వం కూడా అంతే కలిపి ఆ డబ్బును రక్షణ నిధి కింద ఉంచుతం. అలా ఒక్క హుజురాబాద్ నుంచే ఆ నిధి దాదాపు రూ.50 కోట్ల అవుతుంది. ఎవరికి ఏదైనా ఆపద వచ్చి మళ్లీ సంక్షోభం వస్తే ఆ నిధి మిమ్మల్ని కాపాడుతుంది.’’ అని కేసీఆర్ వివరించారు.

15:44 PM (IST)  •  16 Aug 2021

10 లక్షలు వచ్చినా ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగుతయ్

దళిత బంధు వచ్చిన అందరికీ రేషన్ కార్డులు, నెల నెలా బియ్యం, పింఛన్లు, మీకొచ్చే ప్రభుత్వ పథకాలన్నీ అంతే కొనసాగుతయ్. మీరు సంపాదించి గొప్పవాళ్లు అయ్యేదాక అవన్నీ అంతే కొనసాగుతయ్. ఈ పథకం కింద డబ్బులు ఇచ్చి మేం చేతులు దులుపుకోం. మీకు ప్రత్యేకమైన కార్డు ఇస్తాం. పాత అకౌంట్లో వేస్తే పాత బాకీలు పట్టుకుంటారు. ఏడాదికి లక్ష కన్నా విత్ డ్రా చేసుకోకూడదనే ఒక నిబంధన ఉంది. వాటిని అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకొనే వీలు కలగాలంటే.. మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెడదాం. మేం ఇచ్చే కార్డు ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏం పెట్టుబడి పెట్టారనేది జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంటరు. 

15:31 PM (IST)  •  16 Aug 2021

లడాయి చేస్తే పైసలు వస్తయా..

‘‘రాష్ట్రమంతా ఈ దళిత బంధు అమలుకు రూ.1.5 లక్షల కోట్లో.. రూ.1.70 లక్షల కోట్లో ఖర్చు అవుతది. అది ఒక లెక్కనే కాదు.. ఏడాదికి రూ.30 వేల కోట్లో నుంచి రూ.40 వేల కోట్లో ఖర్చు పెడితే నాలుగైదేళ్లలో దళితులందరి కల నెరవేరతది. హుజూరాబాద్ కాడ కొంత మంది లడాయి చేసిన్రని తెలిసింది నాకు.. లడాయి చేస్తే పైసలు వస్తయా.. అవసరం అయితే నేనే ఇంకో 20 రోజులకు హుజూరాబాద్ వస్తా. 20 మండలాలు తిరుగుతా. మీతో పాటు దినమంతా గడిపి.. అక్కడే పరిష్కారం చూసుకుందం.’’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijaya Sai Reddy Latest News:మాట మార్చిన విజయ సాయి రెడ్డి   అప్రూవర్ గా మారుతున్నారా?
మాట మార్చిన విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారుతున్నారా?
CM Revanth Reddy:  స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
స్టేచర్ కాదు స్ట్రెచర్ అక్కడ్నుంచి మార్చురీ - రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
YSRCP Foundation Day: జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…?
HMDA Latest News : హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 
TDP Latest News: టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
టిడిపికి ఓ ట్రబుల్ షూటర్ కావలెను, కాంగ్రెస్ ప్లాన్ టిడిపిలో వర్కౌట్ అవుతుందా?
Telangana Latest News : ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
ఏప్రిల్‌ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్‌- ఎవరితో అంటే?
Anantapur News: గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
గిరిజనుల భూములు కబ్జా చేసిన బీజేపీ నేతపై సీఎంకు ఫిర్యాదు - చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ !
Embed widget