అన్వేషించండి

Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత

బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు ఉన్నారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై క్లారిటీ లేకపోవడంతో గ్రేటర్ లో పలు నియోజకవర్గాల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.


Telangana Elections 2023 : తెలంగాణ బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 35 మంది అభ్యర్థులుక చోటు దక్కంది. మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసి రెండో జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని ప్రకటించిన సినీ నటుడు బాబూమోహన్ పేరుతో ఈ జాబితాలో ఉంది. అయితే జనసేనతో పొత్తు పై స్పష్టత ఉన్నా కేటాయించాల్సిన సీట్లపై తర్జన భర్జన కొనసాగుతూండటంతో.. కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముఖ్యంగా గ్రేటర్ పరిదిలోని నియోజకవర్గాలను పక్కన పెట్టారు. 
Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత
Telangana Elections 2023 : బీజేపీ మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు - జనసేన సీట్లపై రాని స్పష్టత


కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం  అంబర్ పేట నుంచి ఈ సారి ఆయన పోటీ చేయడం లేదు. మాజీ మంత్రి క్రిష్ణాయాదవ్ కు టిక్కెట్ ఇచ్చారు.  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ లో  హైదరాబాద్ లో కీలక నేతగా కృష్ణాయాదవ్ ఉండేవారు. మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించేవారు. అయితే తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చిక్కుని చాలా కాలం పాటు మహారాష్ట్ర జైల్లో ఉన్నారు . దాంతో ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మరిపోయింది. ఆ కేసు నుంచి బయటపడి వచ్చే సరికి.. తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. బీఆర్ఎస్‌లో చేరినా గుర్తింపు లేకపోవడంతో ఇటీవలే  బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు టిక్కెట్ లభించింది. 

మర్రి శశిధర్ రెడ్డి కి సనత్ నగర్ టిక్కెట్  కేటాయించారు. ఈ జాబితాలో పలువురు ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు ఉన్నారు. మాజీ జర్నలిస్టు సంగప్పకు.. నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కేటాయించారు. ఆయన బండి సంజయ్ పిలుపుతో  రాజకీయాల్లోకి వచ్చారు. పలువురు సీనియర్లు పోటీకి వెనుకాడుతూండటంతో..   అభ్యర్థులను ఖరారు చేయడం బీజేపీ పెద్దలకు సమస్యగా మారింది. జనసేన పార్టీ గ్రేటర్ పరిధిలో ఎక్కువ సీట్లను కోరుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి వంటి స్థానాలను కోరుతోంది. అలాంటి చోట్ల.. బీజేపీకి బలమైన నేతలు ఉన్నారు. ఈ సీట్లను జనసేనకు కేటాయిస్తే.. తన దారి తాను చూసుకుంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో జనసేన సీట్లపై క్లారిటీ రాలేదు.                        

గ్రేటర్ తో పాటు..  ఉమ్మడి ఖమ్మంలో  కొన్ని  సీట్లను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. జనసేన పార్టీతో కన్నా... ఆ పార్టీకి సీట్ల కేటాయింపు వల్ల సొంత పార్టీలోనే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో  బీజేపీ నేతలు కసరత్తు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. మొదటి జాబితాలో 52, రెండో జాబితాలో ఒక్క పేరు మాత్రమే విడుదల చేశారు. ఇప్పుడు మరో 35 పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 88 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇంకా  31 సీట్లకు పెండింగ్ ఉన్నాయి. వీటిలోనే జనసేనకు సర్దుబాటు చేయాల్సి ఉంది.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget